breaking news
december 6
-
బయటపడిన భారీ కుతంత్రం
న్యూఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాదులు అతికించిన పోస్టర్ చివరకు దేశరాజధానిలో వరుస బాంబు పేలుళ్ల ఉగ్రకుట్ర భగ్నానికి దారితీసింది. పదో తేదీన ఎర్రకోట సమీపంలో నడిరోడ్డుపై కారు పేలి పలువురి బ్రతుకుల్ని ఛిద్రం చేసిన ఉదంతం వెనుక భారీ ఉగ్ర కుట్ర దాగి ఉందని తాజా దర్యాప్తులో తేలింది. బాబ్రీ మసీదును కూల్చేసిన అదే డిసెంబర్ ఆరో తేదీన ఢిల్లీలో వరుస బాంబుపేలుళ్లు జరపాలని వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో వెల్లడైంది. ఫరీదాబాద్లో 2,500 కేజీల అమ్మోనియం నైట్రేట్, పొటాíÙయం క్లోరేట్, సల్ఫర్ల స్వాధీనం, వాటి నిల్వతో సంబంధం ఉన్న ఉగ్రమాడ్యూల్ సభ్యుల అరెస్ట్ తర్వాత వారిని లోతుగా ప్రశ్నించగా ఈ కుట్ర విషయం బయటపడింది. గణతంత్రదినోత్సవం సందర్భంగా జనవరి 26న ఢిల్లీలో పేలుళ్లు జరగబోతున్నాయని తొలుత వార్తలొచ్చినా అసలు దాడి డిసెంబర్లోనే చేయాలని ఉగ్రవాదులు నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. ఇందుకు బలం చేకూర్చే ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సంపాదించారు. ఫరీదాబాద్లో అరెస్టయిన డాక్టర్ ముజామిల్ ఘనీ ఈ ఏడాది జనవరిలోనే పలు మార్లు ఎర్రకోట, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుమార్లు రెక్కీ నిర్వహించాడని అతని మొబైల్ కాల్ డేటా, లొకేషన్ల ద్వారా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జనవరి 26న దాడులకు ప్లాన్చేసినా ఆరోజు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అవకాశం ఉండటంతో దాడుల ప్లాన్ను డిసెంబర్ ఆరో తేదీకి మార్చినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. మొబైల్లోని డంప్ డేటాను విశ్లేíÙంచడంతో ఈ విషయం స్పష్టమైంది. కారుతోపాటు పేలిపోయిన డాక్టర్ ఉమర్ నబీతో కలిసి ఘనీ 2021లో తుర్కియేకు వెళ్లొచ్చినట్లు వాళ్ల పాస్పోర్ట్ల మీది స్టాంపింగ్ల ఆధారంగా పోలీసులు కనిపెట్టారు. విదేశీ హ్యాండ్లర్ల నుంచి వీళ్లకు ఏ స్థాయిలో ఆర్థిక, ఆయుధ, పేలుడు పదార్థాల సరఫరా సాయం అందిందనే కోణంలోనూ దర్యాప్తు మొదలెట్టారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ సభ్యులతో ఉమర్, ఘనీ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల రెండు టెలిగ్రామ్ గ్రూప్లలో ఉమర్, ఘనీలు సభ్యులుగా ఉన్నారు. వీటిలో ఒకదానిని పాకిస్తాన్లోని జైషే మొహమ్మద్ ఆపరేటివ్ ఉమర్ బిన్ ఖథాబ్ నిర్వహిస్తున్నాడు. మరో గ్రూప్లో కశ్మీర్కు చెందిన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ సభ్యునిగా ఉన్నాడు. 2008లో ముంబైలో మారణహోమం తరహాలో దాడులుచేయాలని ఉమర్, ఘనీలకు ఆదేశాలు అందాయి. దీపావళి రోజున దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాడులుచేయాలని సూచించాడు. రామ్లీలా మైదానం సమీపంలో 3 గంటలు అత్యంత పేలుడు పదార్థం(ఐఈడీ)ను వాహనానికి అమర్చి వాహనాధారిత ఐఈడీని తయారుచేయడంలో ఉమర్ నిమగ్నమైనట్లు అరెస్టయిన ఉగ్రవాదులు చెప్పారు. వీబీఐఈడీలో డిటోనేషన్ సర్క్యూట్ ఏర్పాటు, తయారీకి సంబంధించిన సాంకేతిక నైపుణ్యం సాధించేందుకు ఉమర్ పూర్తిగా ఇంటర్నెట్పై ఆధారపడినట్లుతెలుస్తోంది. అయితే తోటి సహచరులు అందరూ పోలీసులకు చిక్కడంతో తాను దొరికిపోతానన్న తొందరలో పూర్తిస్థాయి ఐఈడీ తయారుచేయకుండానే అమ్మోనియం నైట్రేట్తో వాహనాన్ని తీసుకుని తన స్థావరం నుంచి పారిపోయాడని దర్యాప్తు సంస్థలు చెప్పాయి. పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడెక్కడ తిరిగాడన్న విషయలు ఒక్కోటిగా బయటికొస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం పదో తేదీన కారు పేలడానికి ముందు ఉమర్ తన కారులో అసఫ్ అలీ రోడ్డులోని మసీదుకు వెళ్లాడు. దీని పక్కనే రామ్లీలా మైదానం ఉంది. ఉమర్ అక్కడే మూడు గంటలు ఉన్నాడు. తర్వాత నమాజ్ పూర్తిచేసుకుని ఎర్రకోట వైపు వచ్చాడు. ఉమర్ పేరిట మరో కారు చనిపోయిన ఉమర్ పేరిట ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు(డీఎల్10సీకే0458) ఉందని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో దీని జాడ కనిపెట్టేందుకు ఢిల్లీ, హరియాణా పోలీసులు బృందాలు రంగంలోకి దిగి అన్ని చెక్పోస్ట్ల వద్ద జల్లెడపట్టాయి. చివరకు దానిని ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండావాలీ గ్రామంలో పోలీసులు గుర్తించి స్వా«దీనంచేసుకున్నారు. ఫరీదాబాద్లో అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయం సమీపంలోని తన అద్దె ఇంట్లో పేలుడుపదార్థాలను దాచిపెట్టేందుకు ఉగ్రవాదులకు సాయపడిన ఇస్లాం మతబోధకుడు, మౌల్వీ ఇష్తియాఖ్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటిదాకా ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మేవాట్కు చెందిన మౌల్వీ తరచూ అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయంలో మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేవాడు. అలా ఉమర్, ఘనీసహా పలువురు వైద్యులు, విద్యార్థుల మెదళ్లలోకి ఉగ్రభావజాలాన్ని నింపినట్లు తేలింది.శక్తివంతమైన ఐఈడీల తయారీ! అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీల తయారీలో ఉగ్రమాడ్యూల్ సభ్యులు గతంలోనే మునిగిపోయారని దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియాగేట్, కాన్సిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, గురుగ్రామ్, ఫరీదాబాద్సహా దేశంలోని కీలక ఎయిర్పోర్ట్లు, రైల్వేస్టేషన్లు, మాల్స్ వద్ద పేలుళ్లు జరపాలని భారీ ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అమ్మోనియం నైట్రేట్తోపాటు ఒక కొత్తతరహా రసాయనం అశేషాలను పోలీసులు గుర్తించారు. అది అమ్మోనియం నైట్రేట్ కంటే అత్యంత విస్ఫోటక గుణమున్న ధాతువు కావొచ్చని భావిస్తున్నారు. బుధవారం ఘటనాస్థలి నుంచి 40 శాంపిళ్లను ఢిల్లీ ఫోరెన్సిక్ విభాగం సేకరించింది. వీటితోపాటు ఇతర మందుగుండు, బుల్లెట్లను స్వా«దీనంచేసుకున్నారు. పేలుడు తర్వాత పేరు మార్మోగిపోతున్న అల్–ఫలాహ్ వర్సిటీలో పోలీసులు ముమ్మర సోదాలు కొనసాగిస్తున్నారు. ఉమర్, ఘనీలతో సంబంధం ఉన్న వాళ్లను ప్రశి్నస్తున్నారు. కశ్మీర్లో 500 చోట్ల సోదాలు బుధవారం ఒక్కరోజే కశ్మీర్లోని శ్రీనగర్, గందేర్బల్, బుద్గామ్, బారాముల్లా, బందీపొరా, కుప్వారా, అనంత్నాగ్, కుల్గాం, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లోని 500 చోట్ల పోలీసులు విస్తృతస్థాయిలో సోదాలుచేశారు. జమాతే ఇస్లామీ ఉగ్రసంస్థ మళ్లీ క్రియాశీలకంగా మారిందన్న సమాచారంతో పోలీసలు ఆకస్మిక తనిఖీలు చేశారు. థానె, పుణెలో మహారాష్ట్ర ఏటీసీ బృందం సోదాలుచేసింది. అల్ఖైదాతో సంబంధమున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్ నేపథ్యంలో థానెలో ఒక టీచర్, పుణెలో మరో వ్యక్తికి చెందిన చోట్ల సోదాలు జరిగాయి. -
అయోధ్యలో పటిష్ట భద్రత
అయోధ్య: బాబ్రీ మసీదు కూల్చివేత దినం (డిసెంబర్ 6) సమీపిస్తుండటంతో అయోధ్యలో భద్రత పెంచారు. శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్ని ప్రజలు ప్రదర్శిస్తారని భావిస్తున్నట్లు అయోధ్య డిప్యూటీ కలెక్టర్ అనూజ్ ఝా చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేత దినం రోజున కొందరు ఉత్సవాలు జరుపుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అయోధ్యను నాలుగు విభాగాలుగా విభజించి భద్రతా బలగాలను మోహరించారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయోధ్య జిల్లాలో డిసెంబర్ 28 వరకూ 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
బీజేపీపై బుసలు కొడుతున్న 'కోబ్రా పోస్ట్'
-
'బాబరీ వల్లే దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లింది'
ఈ దేశంలో ఉగ్రవాదం పెరగడానికి కారణం ఏమిటి? ఉత్తరప్రదేశ్ మైనారిటీ వ్యవహారాల మంత్రి ఆజమ్ ఖాన్ ప్రకారం బాబరీ కట్టడాన్ని కూల్చేయడమే దీనికి కారణం. ఆదివారం ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆజమ్ ఖాన్ ఏకె 47, ఆర్ డీ ఎక్స్ పంటి పదాలను అంతకు ముందు ఎవరూ వినలేదని, బాబరీ కట్టడం కూల్చి వేసిన తరువాతే ఇవన్నీ తెరపైకి వచ్చాయని ఆయన అన్నారు. మసీదు కూల్చడానికి ముందు హిందూ ముస్లింల మధ్య ఎలాంటి విద్వేషాలూ లేవని, అసలు గొడవంతా డిసెంబర్ 6, 1992 నుంచే మొదలైందని ఆజమ్ ఖాన్ అన్నారు. అయోధ్యకు అయిదు కి.మీ దూరంలో ఉండే ఫైజాబాద్ లో ఆజమ్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతంలో ఆజమ్ ఖాన్ భారత మాత ఒక రాక్షసి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై చాలా దుమారమే చెలరేగింది. అయితే ఆజమ్ ఖాన్ తన వ్యాఖ్యలను ఇప్పటి వరకూ ఉపసంహరించుకోలేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కి ఆజమ్ ఖాన్ అత్యంత సన్నిహితుడు.


