కారు ఢీకొని వృద్ధుని మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా డక్కిలి మండలం పలుగోడు గ్రామం వద్ద కల్వర్టుపై కూర్చున్న ఆదిరెడ్డి గంగిరెడ్డి (65) ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగిరెడ్డి అక్కడికక్కడే మరణించాడు.
తిరుపతి నుంచి నెల్లూరు వైపు అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. కల్వర్టుపై కూర్చున్య వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదంలో నరసింహులు అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై మరింత వివరాలు తెలియవలసి ఉంది.