దీపావళికి నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ | Sakshi
Sakshi News home page

దీపావళికి నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ

Published Wed, Aug 21 2013 2:18 AM

దీపావళికి నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ

ముంబై: నిస్సాన్ కంపెనీ కొత్త ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ, టెర్రానోను మంగళవారం ఆవిష్కరించింది. రానున్న దసరా, దీపావళి పండగల సందర్భంగా అక్టోబర్‌లో ఈ కారును వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 10 లక్షల రేంజ్‌లో ఉంటుందని, వచ్చే నెల నుంచి  బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపింది. పాత్‌ఫైండర్, పాట్రోల్ ఎస్‌యూవీల డిజైన్ ఆధారంగా భారత పరిస్థితులకు తగ్గట్లుగా ఈ టెర్రానో ఎస్‌యూవీని చెన్నై ప్లాంట్‌లో తయారు చేస్తున్నామని వివరించింది. ఈ కంపెనీ ప్రస్తుతం  మైక్రా, సన్నీ, ఇవాలియా కార్లను విక్రయిస్తోంది. 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా 2016 కల్లా 16 కొత్త మోడళ్లను అందించనున్నది. 
 

Advertisement
Advertisement