
హిమాచలమంత విషాదం
హిమాచల్ప్రదేశ్లో జరిగిన ఘోర ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు కాగా.. నర్సంపేట, వరంగల్ గిర్మాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నారుు.
- బియాస్ నదిలో ఇద్దరు జిల్లా వాసుల గల్లంతు
- కుమారుడి గల్లంతుతో శోకసంద్రంలో తల్లిదండ్రులు
- హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన బంధువులు
- గిర్మాజీపేటలో విషాద ఛాయలు
హిమాచల్ప్రదేశ్లో జరిగిన ఘోర ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు కాగా.. నర్సంపేట, వరంగల్ గిర్మాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నారుు. ‘బిడ్డా.. బతికి కళ్లకు కనబడు.. నువ్వు రాకుంటే మేమెట్ల బతికేదిరా కన్నా.. నీకు ఏం కావొద్దని దేవుళ్లందరిని మొక్కుతున్నం కొడుకా..’ అంటూ గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి అఖిల్ తల్లిదండ్రులు విజయ్, సునీత కన్నీరుమున్నీరవుతున్నారు. ‘పరమేశా.. నీ పేరు పెడితే నా కొడుకు నిండు నూరేళ్లు చల్లగా ఉంటాడని ఆశపడ్డా.. కొడుకు లేడనే వార్తను తట్టుకోలేనయ్యా..’ అంటూ నర్సంపేట పట్టణానికి చెందిన చిందం పరమేశ్ తల్లి ఉమ విలపించిన తీరు అందరి హృదయూలను కలచివేసింది.
వరంగల్ చౌరస్తా, న్యూస్లైన్ : ‘బిడ్డా.. బతికి కళ్లకు కనబడు.. నువ్వు రాకుంటే మేమెట్ల బతికేదిరా కన్నా.. నీకు ఏం కావొద్దని దేవుళ్లందరిని మొక్కుతున్నం కొడుకా..’ అంటూ కుమారుడి రాక కోసం ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొడుకు జాడ తెలియకపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. హిమాచల్ప్రదేశ్లో జరిగిన వరద ప్రమాదంలో గల్లంతైన వారి జాబితాలో వరంగల్ గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి విజయ్, సునీత దంపతుల కుమారుడు అఖిల్ ఉన్నాడు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అఖిల్ హైదరాబాద్లోని బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో ఈఅండ్ఐఈ సెకండియర్ చదువుతున్నాడు. ఈ నెల 3న ఉదయం స్టడీటూర్కు వెళ్లిన అతడు ఆదివారం హిమాచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్ ప్రాజెక్టు డ్యామ్ గేట్లును అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
కష్టాలను దిగమింగుతూ..
వరంగల్ కూరగాయల మార్కెట్లో గుమస్తా పనిచేస్తున్న సంజయ్ పిల్లల చదువు కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు. తన పిల్లలు తనలాగ గుమాస్తా కొలువులు చేయొద్దని, ఎన్ని సమస్యలు ఎదురైనా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని నిరంతరం తపించేవాడు. అఖిల్ను 1వ నుంచి పదో తరగతి వరకు గోల్డెన్ త్రిశూల్డ్లో, ఇంటర్ హన్మకొండలోని ఎస్ఆర్ ధ్రువ కాలేజీలో చదివించాడు. విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివిస్తున్నాడు. కూతురు హన్మకొండలోని అల్లూరి కాలేజీలో ఎంబీఏ సెకండియర్ చదువుతోంది. చేతికందే కుమారుడు ఇలా గల్లంతు కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆనందంగా ఉందన్నాడు : తల్లి సునీత
స్టడీ టూర్ బాగా సాగుతుందని, ఆనందంగా ఉందని త న కుమారుడు అదివారం సాయంత్రం ఫోన్ చేసినట్లు అఖిల్ తల్లి సునీత తెలిపింది. పొద్దున టిఫిన్ చేశాను. కానీ మధ్యాహ్నం భోజనం ఇంకా పెట్టలేదని చెప్పాడని అమె పేర్కొంది. గంటో, రెండు గంటల్లో భోజనం చేస్తామని చెప్పిన కుమారుడు రెండు గంటల సమయంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ఆదివారం అర్ధరాత్రి తెలియడంతో అమె కుప్పకూలిపోయింది. ప్రస్తుతం అమెకు సెలైన్ ఎక్కిస్తున్నారు. తండ్రి సంజయ్, సోదరి మౌనిక గుండెలవిసేలా ఏడుస్తున్నారు. ఈ ఘటనతో గిర్మాజీపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హిమాచల్ప్రదేశ్కు బయల్దేరిన బంధువులు
అఖిల్ గల్లంతయ్యాడనే విషయం తెలుసుకున్న ఆయన పెద్దనాన్న సంజీవరావు, మామ శ్రీకాంత్, బావమరిది కుమారస్వామి సోమవారం తెల్లవారుజామునహైదరాబాద్కు వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో హిమచల్ప్రదేశ్కు వెళ్లి సోమవారం సాయంత్రం సంఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలిసింది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 24 మంది విద్యార్థుల్లో ఐదుగురి మృతదేహాలు లభించినట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అఖిల్ జాడ తెలియలేదని, గాలింపు చర్యలు కోనసాగుతున్నట్లు బంధువులకు వివరించారు. అఖిల్ క్షేమంగా తిరిగి రావాలని ఆయన తల్లిదండ్రులు, అక్క దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.