-
రేవంత్రెడ్డి వర్సెస్ హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు ఆరోపణలు.. దీనిపై సీఎం రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించడంతో.. ఈ ఇద్దరి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్రావు.. గతంలో తమ ప్రభుత్వం చేసిన అప్పులను ఎక్కువ చేసి చూపిస్తున్నారని, అది సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీల అమలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదేమని నిలదీశారు.ఇంతలో సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. ‘‘హరీశ్రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7 వేలకోట్లకే తెగనమ్మారు. గొర్రెల స్కీం పేరుతో రూ.700 కోట్లు దండుకున్నారు. బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ఖర్చు విషయంలో గతంలో ఒకటి చెప్పి ఇప్పుడు రూ.94 వేల కోట్లే అంటున్నారు. అప్పుల లెక్కలు చెబుతున్నారు.. కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడంలేదు.రాష్ట్ర ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి.. ఎన్ని వేలకోట్ల విలువైన భూములు అమ్ముకున్నారో లెక్కలు తీద్దాం. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేశారు. మీరు నిజాయతీ పాలన అందించి ఉంటే.. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?’’ అని సవాల్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి తెచ్చుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.అబద్ధపు గ్యారంటీలతో పరువు తీశారు: మాజీమంత్రి హరీశ్రావుసీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల కరువు, వలసలకు రేవంత్రెడ్డి గతంలో ఉన్న టీడీపీ, ఇప్పుడున్న కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. ‘‘బతుకమ్మ చీరల విషయంలో సీఎం మహిళలను అవమానపరిచారు. దీనిపై క్షమాపణ చెప్పాలి. ఆరు గ్యారంటీలపై రాహుల్ గాం«దీతో హామీ ఇప్పించారు. సోనియాగాం«దీతో కూడా లేఖ రాయించారు. కానీ అమలు చేయలేక.. సోనియా గౌరవం పోగొట్టారు. రాహుల్ పరువు తీశారు.పేగులు మెడలో వేసుకుంటా, లాగులో తొండలు విడుస్తానంటూ సీఎం రేవంత్రెడ్డి వాడిన రాక్షస భాషను చూసి జనం భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ గౌరవం పోగొట్టవద్దని కోరుకుంటున్నాం’’ అని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 500 హత్యలు, 1,800 అత్యాచారాలు జరిగాయని.. పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ప్రతివారం సీఎం ప్రజలను కలుస్తారని చెప్పారని.. కానీ ప్రజాపాలనలో మొదటి రోజు తప్ప మళ్లీ అక్కడ కనిపించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పారీ్టయే పెద్ద ధోకా అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులంతా ‘ధోకా.. ధోకా..’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై మంత్రి శ్రీధర్బాబు అభ్యంతరం వ్యక్తంచేశారు. -
సభలో ‘కరెంటు మంట’
సాక్షి, హైదరాబాద్: సభలో ‘కరెంటు’ అంశం మంటలు రేపింది. ‘స్మార్ట్ మీటర్ల’ ఏర్పాటు ఒప్పందం, వ్యవసాయానికి మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారనే అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో శాసనసభ దద్దరిల్లింది. శనివారం ఉదయం సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీశ్రావుల మధ్య వివిధ అంశాలపై జరిగిన సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆ సమయంలో వారు చేసిన వ్యాఖ్యలు.. రాత్రి శాసనసభ ముగిసే సమయంలో ‘కరెంటు’ వివాదానికి తెరలేపాయి. విద్యుత్ సంస్కరణలు అమలు చేయనందుకు తమ హయాంలో రూ.30 వేల కోట్లు నిధులు కోల్పోయామని ఉదయం హరీశ్రావు చెప్పగా.. అసలు బీఆర్ఎస్ సర్కారు 2017లోనే కేంద్రంతో మీటర్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. దీనికి ఆధారంగా నాటి ఒప్పంద పత్రాలను రాత్రి శాసనసభ ముందుంచారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బీఆర్ఎస్ వాదన సత్యదూరం విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వాదనలు పూర్తిగా సత్యదూరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ సమక్షంలో 2017 జనవరి 4న ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2017 జూన్ 30 నుంచి ఆరు నెలల్లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్ఫార్మర్లకు మీటర్లు బిగిస్తామని, 2018 జూన్ 30లోగా ఫీడర్లకు మీటర్లు పెడతామని, 2018 డిసెంబర్ 31 లోగా 500 యూనిట్లు, ఆపై విద్యుత్ వాడే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు, 2019 డిసెంబర్ 31 లోపు 200 యూనిట్ల విద్యుత్, ఆపైన వాడే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందాలను అమలు చేయకపోతే, స్మార్ట్ మీటర్లను బిగించకపోతే.. కేంద్ర ప్రభుత్వం డిస్కంల మీద చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పుడు వాటి మెడపై కత్తి వేలాడుతోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం. వాళ్లు, వీళ్లు ప్రేమించుకున్నప్పుడు, సంతకాలు పెట్టుకున్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కనిపించలేదు. ఎన్నికలు వచ్చేప్పటికి రైతులు ఉరి వేస్తారని తెలిసి దాన్ని దాచిపెట్టారు. ఈ ఒప్పందంతో తెలంగాణ విద్యుత్ సంస్థలను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు. డిస్కంలకు విధిలేని పరిస్థితిని తెచ్చిపెట్టారు..’’ అని రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలి.. ఉదయ్ ఒప్పందంపై సంతకాలు పెట్టలేదని, మీటర్లు పెట్టబోమని చెప్పామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్న మాటలన్నీ అబద్ధాలేనని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘‘ఈ ఒప్పందంపై అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఐఏఎస్ అజయ్ మిశ్రా, సదరన్ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి, నార్తర్న్ సీఎండీ ఏ.గోపాల్రావు సంతకం పెట్టారు. ఇప్పుడు విధిలేక మన వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శనపైనా సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘మేడిగడ్డకు వెళ్లి సెల్ఫీలు దిగారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. పదవి పోయినందుకు మీకు తొందర ఉండాలిగానీ.. నాకేమీ తొందరలేదు’’ అని పేర్కొన్నారు. సీఎం రేవంత్కు తొందరెక్కువ: హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డికి తొందరపాటు ఎక్కువని, సభను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఎవరో ఏదో కాగితం తెచ్చిస్తే తొందరపడి మాట్లాడటం వల్ల సీఎం కుర్చీ గౌరవాన్ని తగ్గిస్తుందని.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మాట్లాడితే హుందాతనం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘‘నేను ఉదయం మాట్లాడేప్పుడు ఉదయ్ పథకం కింద కేంద్రం బలవంతంగా రూ.9 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర సర్కారుపై రుద్దిందని చెప్పాను. కానీ సీఎం రేవంత్రెడ్డి ఓ కాగితం తెచ్చి మీరు సంతకాలు పెట్టారు, మీటర్లు పెడుతున్నారంటూ సుదీర్ఘంగా చెప్పారు. అసలు మేం చెప్పిందేంటి? కేంద్రం రూ.30 వేల కోట్లు అప్పు అదనంగా ఇస్తామన్నా.. వ్యవసాయ బోరుబావుల వద్ద మీటర్లు పెట్టబోం, విద్యుత్ సంస్కరణలను ఒప్పుకోమనే చెప్పాం. నాటి సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలోనే ఈ విషయం స్పష్టం చేశారనే నేను ఉదయం వివరించాను. కానీ సీఎం రేవంత్ ఏదో అనుకుని ‘ఉదయ్’ కాగితాన్ని తెచ్చి చూపించారు. 2017 జనవరి 4న అందిన ఆ పేపర్లో వ్యవసాయ బోరు బావులకు కాకుండా.. అన్నివర్గాల కరెంట్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించాలని స్పష్టంగా ఉంది. అంటే పాత మీటర్లు ఉన్న చోట కొత్తగా స్మార్ట్ మీటర్లు పెట్టడమే తప్ప.. కొత్తగా మీటర్లు పెట్టే ముచ్చటే అందులో లేదు..’’ అని హరీశ్రావు స్పష్టం చేశారు. నేను చెప్పిన ‘రూల్స్’ పేపర్ వేరు ఇక తాను చెప్పిన కాగితం కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి 2021 జూన్ 9న వచ్చిందని హరీశ్రావు వివరించారు. ‘‘దాని ప్రకారం.. ఏ రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పు తీసుకోవాలని అనుకుంటున్నాయో ప్రతిపాదనలు పంపాలని కోరారు. 2022 నుంచి 2025 వరకు విద్యుత్ సంస్కరణలు అమలుచేస్తే.. అరశాతం అదనంగా 4 శాతం జీఎస్డీపీ వరకు అప్పు అధికంగా పొందే వెసులుబాటు ఇస్తామని కేంద్రం పేర్కొంది. దానికి ఒప్పుకుంటే తెలంగాణకు రూ.30 వేల కోట్లు సమకూరేవి. అయితే సంస్కరణల్లో భాగంగా డిస్కంల ప్రైవేటీకరణ, వ్యవసాయ బోర్లు, బావులకు మీటర్లు పెట్టడం వంటివి రైతులకు ఇబ్బంది తెస్తాయని గుర్తించి.. ఆ నిబంధనలకు మేం ఒప్పుకోలేదు’’ అని స్పష్టం చేశారు. కానీ సీఎం సభను, ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేశారని హరీశ్ ఆరోపించారు. ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కల్పించుకుని హరీశ్రావు వ్యాఖ్యలను ఖండించారు. ‘‘ఏదో ఓ కాగితాన్ని చూపుతూ సభను, ప్రజలను సీఎం తప్పుదారి పట్టిస్తున్నారంటూ హరీశ్ మాట్లాడటం సరికాదు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడతామని సీఎం ఎక్కడైనా చెప్పారా? మీరు తలకిందులుగా తపస్సు చేసినా మేం రైతులకు మీటర్లు పెట్టబోం..’’ అని పేర్కొన్నారు. -
సభలో మా గొంతు నొక్కుతున్నారు.. హరీష్రావు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మా గొంతు నొక్కుతున్నారని.. ఏ పార్టీకి ఎంత సమయం ఇచ్చారో లెక్కలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం సభను తప్పుదోవ పట్టించే విధంగా ప్రసంగం చేశారని.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు చేసే ప్రకటనలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని హితవు పలికారు.‘‘ఉదయ్ స్కీం వల్ల కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు గతంలో మాకు ఇస్తామన్న మేము ఒప్పుకోలేదు. వ్యవసాయ బోర్డు దగ్గర మీటర్లు పెట్టకూడదని 30 వేల కోట్ల రూపాయలను వదులుకున్నాం. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు కాకుండా.. పాత మీటర్ల చోట కొత్త మీటర్ల అంశం అందులో ఉంది. వ్యవసాయ భూములు మీటర్లు ప్రైవేటుపరం చేయకూడదని మేము కేంద్రం పెట్టిన నిబంధనలకు ఒప్పుకోలేదు. కేంద్రం పెట్టిన నిబంధనలకు మేము ఒప్పుకుంటే ప్రతి ఏడాది 5000 కోట్లు మొత్తం ఐదేళ్లు 30 వేల కోట్లు వచ్చేవి’’ అని హరీష్రావు పేర్కొన్నారు.హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎంహరీష్ రావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టదు. తలకిందులుగా తపస్సు చేసిన రైతులకు అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదన్నారు. -
‘మా గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసింది?’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తప్పు చేసిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇవ్వడం తప్పా?. మహిళలను ఆదుకోవడం తప్పా?. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడం తప్పా?. మా గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసింది’’ అంటూ ప్రశ్నించారు.రైతు భరోసాపై అఖిల పక్షం పెట్టబోతున్నాం. వందకు వంద శాతం రైతు భరోసా అమలు చేస్తాం. గతంలో బడ్జెట్పై నేను మాట్లాడితే అవహేళన చేశారు. వాస్తవానికి దూరంగా గత బడ్జెట్ను పెట్టారు. గత ప్రభుత్వం లాగా మేము బడ్జెట్ పెట్టాలనుకుంటే మూడున్నర లక్షల కోట్లు పెట్టేవాళ్లం. గత ప్రభుత్వం చివరి బడ్జెట్ రెండు లక్షల 90 వేలు పెట్టింది. వాస్తవానికి దగ్గరగా ఉండాలని మేము ఒక వెయ్యి మాత్రమే పెంచాము. గత ప్రభుత్వం లాగా మేము గాలి బడ్జెట్ పెట్టలేదు.’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.‘‘ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. స్పష్టమైన విద్యుత్ పాలసీ తీసుకురాబోతున్నాం. వరుస సమీక్షలతో పాలన పరుగులు పెడుతోంది. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ పెట్టబోతున్నాం. 2035 వరకు విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేశాం. రాబోయే 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం.’’ అని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.‘‘రుణమాఫీపై మమ్మల్ని రైతులు నమ్మారు. బడ్జెట్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇచ్చిన మాటను మేం నిలబెట్టుకుంటాం. పదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. రైతు రుణ మాఫీ చేస్తామంటే అభినందించడం పోయి విమర్శిస్తున్నారు. రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం. ఇరిగేషన్పై కూడా ఆరోపణలు చేస్తున్నారు’’ అంటూ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
సీఎం రేవంత్ షాడో కేబినెట్లో ఆ నలుగురు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో షాడో కేబినెట్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో శనివారం(జులై 27) మీడియాతో కేటీఆర్ చిట్చాట్లో మాట్లాడారు. సీఎం రేవంత్ సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఉదయ సింహ, అజిత్ రెడ్డితో షాడో కేబినెట్ నడుస్తోందన్నారు. మిగతా వాళ్ళంతా డమ్మీలే అని ఎద్దేవా చేశారు.సీఎం సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. తమ వద్దకు అన్ని వివరాలు వస్తున్నాయని చెప్పారు. అన్నీ బయటపెట్టడానికి టైమ్ ఉందన్నారు. -
డిప్యూటీ సీఎం చేస్తా..! అక్బరుద్దీన్కు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి చేయకపోను ఓల్డ్ సిటీ వాసులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో పాతబస్తీకి మెట్రో విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధ జరిగింది. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల కోసం ఆదాని సంస్థకు అప్పగించారు. కేవలం పాతబస్తీని ఎందుకు సెలెక్ట్ చేశారు?. సీఎం నియోజకవర్గం కొడంగల్, ఉత్తమ్కుమార్రెడ్డి నియోజకవర్గం, శ్రీధర్ బాబు నియోజకవర్గం ఎందుకు పైలెట్ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోలేదంటూ అక్బరుద్దీన్ ప్రశ్నించారు.అక్భరుద్దీన్ ప్రశ్నకు సీఎం రేవంత్రెడ్డి సమాధానమిస్తూ.. మెట్రో విషయంలో పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని.. ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీలో మెట్రో నిర్మిస్తామని రేవంత్ అన్నారు. అది ఓల్డ్సీటీ కాదు.. ఒరిజినల్ సిటీ. రెండో విడత మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ కాకి లెక్కలు చెప్పింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టాలని ఎల్అండ్ టీకి చెప్పాం. లేదంటే చర్లపల్లి, చంచల్గూడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పానని రేవంత్ అన్నారు.‘‘కాంగ్రెస్ బీ ఫామ్పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే కొడంగల్లో గెలిపించే బాధ్యత నాది.. డిప్యూటీ సీఎంను చేసి పక్కనే కూర్చోబెట్టుకుంటా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని.. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానంటూ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. -
TG: కేటీఆర్పై అక్బరుద్దీన్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: గతంలో నోట్ల రద్దు జరిగినపుడు క్యూలైన్లు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ ఆరు పథకాల కోసం ప్రజలు అలానే క్యూలైన్లను నిలబడుతున్నారని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. శనివారం(జులై 27)అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరిగిన సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టారు ఓకే.. కానీ ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి. హైదరాబాద్ పట్టణానికి మెట్రో రావడానికి నేను కృషి చేశాను. ఆనాడు దివంగత నేత వైఎస్రాజశేఖర్రెడ్డి సహాయంతో హైదరాబాద్కు మెట్రో రైలు తీసుకువచ్చాం. కానీ ఓల్డ్ సిటీకి మాత్రం మెట్రో ఇప్పటికీ రావడం లేదు. అక్బర్సాబ్ త్వరలో చుక్చుక్ రైలు పాతబస్తీకి వస్తుంది అని కేటీఆర్ మాటలు చెప్పారు. అవేవీ జరగలేదని అక్బరుద్దీన్ కేటీఆర్పై సెటైర్లు వేశారు. -
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ పాలన.. విమర్శలతో అట్టుడికిన అసెంబ్లీ
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు శనివారం వాడీవేడీగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఒకరినొకరు విమర్శలతో సభను అట్టుడికించారు.ఈ మేరకు అసెంబ్లీలో శనివారం హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు ఎత్తేస్తామని అని అన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. బీర్ల ధరలు పెంచి, ప్రజలపై భారం వేస్తారా అని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు ఎత్తేస్తే రూ. 42 వేల కోట్లు ఆదాయం ఎలా వచ్చిందని నిలదీశారు. రూ. 7 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని, ఎక్సైజ్పై ఆదాయం పెంచి ప్రజలపై భారం వేయొద్దని అన్నారు.రుణమాఫీ విషయంలో చాలా కోతలు పెట్టారని అన్నారు హరీష్ రావు. రూ. 31 వేల కోట్ల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పారని కానీ.. కోతలతో రూ. 31 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్లుకు తగ్గిస్తారా? అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ రూ. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం సంతోషమే కానీ వైద్యశాఖకు బడ్జెట్ తగ్గిస్తే ఇది ఎలా సాధ్యమవుతుందని విమర్శించారు. గత ప్రభుత్వ పథకాలను మేం అధికారంలోకి వచ్చాక కొనసాగించామని గుర్తు చేశారు.కేసీఆర్ పేరు నచ్చకపోతే మార్చుకోండి.. కానీ కిట్లను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాల కోసం పేదల కడుపు కొట్టకండని తెలిపారు. అప్పుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ 6 లక్షల 71 వేల 757 కోట్లు అప్పు చేసిందని పదే పదే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి ఉన్న అప్పులు 72 వేల కోట్లు అని.. 72 వేల 658 కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చినట్లు తెలిపారు. అయితే 7 లక్షల కోట్లు అప్పు చేశామని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.‘బీసీలకు రూ. 9 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టారు. మైనార్టీలకు మంత్రివర్గంలో చోటులేదు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు. అభయ హస్తం శూన్య హస్తంలా మారింది. పాలమూరు వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం. మహబూబ్నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. సోనియా గాంధీతో అబద్దాలు చెప్పారు. మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలి. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేని 15 వందల గ్రామాలకు బస్సులు నడపాలి. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి’ అని అన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తమ బడ్జెట్ చూసి హరీష్ రావుకు కంటగింపుగా ఉందని విమర్శించారు. మంత్రి జూపల్లి గల్లి గల్లీకి బెల్ట్ షాపు పెడతా అని అన్నారా? అని ప్రశించారు. ప్రతిపక్ష నేత బడ్జెట్ పెట్టే సమయంలో సభకు వచ్చారని.. మళ్లీ నేడు సభకు రాలేదని తెలిపారు. హరీష్రావు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారని అన్నారు భట్టి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిక తీసుకొచ్చారని దుయ్యబట్టారు. తాము నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చేపని మొదలు పెట్టినట్లు తెలిపారు. హారీష్ రావు ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తారని ప్రశ్నించారు. పూర్తి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైన్ షాపు టెండర్లు ముందే ఎందుకు పెట్టారని.. టానిక్ లాంటి దుకాణాలు పెట్టి సర్కార్కు డబ్బులు రాకుండా , కొన్ని కుటుంబాలకు వెళ్లేలా చేశారని మండిపడ్డారు. తాము అలా చేయమని.. సర్కార్ సొమ్ము ప్రజలకే చేరేలా చేస్తామని చెప్పారు.2017లో ఆనాటి సీఎం మీటర్లు బిగిస్తామని మోదీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సభను తప్పుదోవ పట్టించినప్పుడు సరిద్దాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామని, విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు.‘బీఆర్ఎస్ తీరు వల్లే కేంద్ర బడ్జెట్లో నిధులు రాలేదు. గతంలో బతుకమ్మ చీరలు ఇస్తే మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతారు. బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగింది. గొర్రెల పథకంలో రూ. 77 కోట్లు స్వాహా చేశారు.. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ల మీద విచారణకు సిద్ధమా?పాలమూరు జిల్లా కేసీఆర్కు ఏం అన్యాయం చేసింది. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ దుర్మార్గం కారణం కాదా?రంగారెడ్డి జిల్లాకు, కొడంగల్కు గోదావరి జలాలు ఇవ్వొద్దని కుట్ర చేశారు రంగారెడ్డి జిల్లాకు, కొడంగల్కు గోదావరి జలాలు ఇవ్వొద్దని కుట్ర చేశారు. బీఆర్ఎస్ ఆలోచన మారలేదు.. విధానం మారలేదు. అబద్దాలు రికార్డుల్లో ఉంటే కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు నిజమనుకునే ప్రమాదం ఉంది. పూర్తిగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు’ అని రేవంత్ పేర్కొన్నారు.గతంలో హరీస్ రావు ఓ డమ్మీ మంత్రి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఅబద్దాలు, గారడీలు అంటే బీఆర్ఎస్సేఅధికారంలోకి వస్తే దళితుడిని సీఎంనుచేస్తా అని కేసీఆర్ అన్నారు.హరీష్ రావు దగ్గర సబ్జెక్ట్ లేదు.ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్.. ఇవాళ సభకు రాలేదు.చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్ బడజెట్పై స్పందించలేదు.మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబుబీఆర్ఎస్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం -
కేటీఆర్ యువరాజు అనుకుంటున్నారా? భయపడేది లేదు: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో విపక్షాలకు అన్యాయం జరిగిందని, అందుకే నిరసన తెలియజేసేందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ వ్యాప్తంగా చర్చ జరిగేందుకే నీతి ఆయోగ్ బహిష్కరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. టూరిజం మంత్రిగా ఉన్నా కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమి లేదని విమర్శించారు.కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదని, పైసా ఇవ్వకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం మూర్ఖత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.‘కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అయినా సహకారం లేదు. గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరు.. కారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదు. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా?తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగింది. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా. మేడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారు. ఆయన హుకుంలకు, అల్టిమేటంకు బయపడేది లేదు. -
తెలంగాణ అసెంబ్లీ: ‘హరీశ్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి’
Updatesతెలంగాణ శాసనసభ సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదావ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్ల అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళనస్పీకర్ పోడియం వద్ద నిరసన చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలువ్యవసాయ మీటర్ల అంశంపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలు నిరసన చేస్తుండగాని సభను వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై కొనసాగుతున్న చర్చ.. మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటులేదు: హరీశ్ రావుఉద్యోగులకు కొత్త పీఆర్సీలకు అనుగుణంగా కేటాయింపులు లేవుఈ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదుబీసీలు 9 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టారుఅభయ హస్తం శున్య హస్తంలా మారింది. సభను తప్పుదోవ పట్టించిప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉంది: సీఎం రేవంత్ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నాం. పూర్తి సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు.విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. బడ్జెట్ పై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చాం.అసత్యాలను రికార్డుల నుంచి తొలగించాల్సిన బాధ్యత నాపై ఉంది..కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, విద్యుత్ సంస్థలు మూడు పార్టీలు కలపి 2017లో ఒప్పందం చేసుకున్నారు.మీటర్లు పెడతాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందిగృహాలకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఓప్పందంలో బీఆర్ఎస్ స్పష్టంగా పేర్కొందివిద్యుత్ ఒప్పందాలపై హరీష్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలిహరీష్ రావుకు ఆఫ్ నాలెడ్జ్.. పెద్దాయనకు ఫుల్లు నాలెడ్జ్.. ఇలాంటి వారికి మేం ఏం చెప్తాం హైదరాబాద్ సిటీలో ఆటో ఎక్కిన అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు: హరీశ్రావుశాంతిభద్రతలు రాష్ట్రంలో లోపించాయిఅర్దరాత్రి ఐస్ క్రీం తినాలనుకున్న మంత్రికి.. ఐస్ క్రీం దొరకలేదట10 గంటలకే హైదరాబాద్లో షాపులు మూసేస్తున్నారని.. రివ్యూలో సదరు మంత్రి సీఎంకు చెప్పారట ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరిన మంత్రి శ్రీధర్ బాబునడి రోడ్డుపై మిట్టమధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లను చంపేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు..హరీష్ రావు మాట్లాడుతుంటె దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది చేత గానమ్మకు మాటలు ఎక్కువ అన్న భట్టి వాఖ్యలు కాంగ్రెస్కు వర్తిస్తాయి: హరీశ్ రావుకాంగ్రెస్ ఇస్తా అన్న రెండు లక్షల ఉధ్యోగాలు ఏమయ్యాయిసభలో బీఆర్ఎస్ సభ్యులు ఫ్లకార్డులు ప్రదర్శించడంపై స్పీకర్ అభ్యంతరం. 2020 జులై నెలలో పెన్షన్ ఇవ్వకుండా నెల ఆలస్యం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది.అప్పటి నుంచి నెల ఆలస్యం అవుతూ ఉంది..57 ఏళ్ళకే బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్ అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు.బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఏ రోజు నెల మొదటి వారం లో పెన్షన్ ఇవ్వలేదు.వాళ్లు చేసింది మాత్రమే రైట్ అన్నట్లు హరీష్ రావు మాట్లాడుతున్నారు. మే , జూన్ నెల పెన్షన్ ఇంకా ఇవ్వలేదు: హరీష్ రావునాలుగు వేల పెన్షన్ సరికదా.. రెండు వేల పెన్షన్ టైం కు ఇవ్వడం లేదు మంత్రులపై హరీష్ రావు వాఖ్యలు సరికాదన్న విప్ ఐలయ్యతెలంగాణ మొదటి సీఎం దలితుడే అని పదేళ్లలో ఎందుకు చేయలేదురెవెన్యూ వ్యవస్థ ను బిఆర్ఎస్ నాశనం చేసిందివిఆర్ఎ, వీఆర్వో వ్యవస్థను తొలగించి.. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారు కోమటిరెడ్డికి హరీశ్ రావు కౌంటర్కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అన్న హరీశ్ రావు.గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనేదా? బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.బస్సులు లేని 15 వందల గ్రామాలు బస్సులు నడపాలిప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.మహాలక్ష్మీ పథకాన్ని వెంటనే అమలు చేయాలిమద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రైలు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలితెలంగాణ లో 90 శాతం దొడ్డు వడ్లు పండిస్తారుదొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలిగృహజ్యోతి పథకం లో పాక్షికంగా ఇబ్బందులు ఉన్నాయియువ వికాసం పథకంపై బడ్జెట్ లో చర్చే లేదుచేయూత గురించి ప్రభుత్వం మాటైనా మాట్లాడడం లేదు హరీశ్ రావు వద్ద సబ్జెక్ట్ లేదు: మంత్రి కోమటిరెడ్డిఅబద్దాలు, గారడీలు అంటే బీఆర్ఎస్సేహరీష్ రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి.హరీష్ రావు బడ్జెట్ పై కాకుండా రాజకీయాలు సభలో మాట్లాడుతున్నారు. ఉద్యమంలో కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా అన్నారు.దళితున్ని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నారు.బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదు.బడ్జెట్పై చీల్చి చెండాడుతా అన్నారు కేసీఆర్.ఈరోజు ఏం చీల్చుతారో అని నేను అసెంబ్లీకి వచ్చాను కానీ కేసీఆర్ రాలేదు.కేసీఆర్కు సభకు రావాలంటే భయం.. అందుకే వీళ్లను పంపాడు.గతంలో హరీశ్ రావు ఒక డమ్మీ మంత్రికేసీఆర్ సభుకు రాలేక హరీశ్రావును పంపారు.బీఆర్ఎస్ నేతలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 24 గంటల కరెంట్ ఎక్కడిచ్చారో చెప్పాలి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ అమలు చేస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుబీఆర్ఎస్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం గత ప్రభుత్వం భూములు అమ్మింది అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుసీఎం గత ప్రభుత్వం భూముల అమ్మింది అంటున్నారు.. మరి ఈ బడ్జెట్లో 24 వేల కోట్ల రూపాయలు భూముల అమ్మో తెస్తాం అనడం ఏంటి?మహబూబ్నగర్ జిల్లాకు నీళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కాలేశ్వరం ప్రాజెక్టుపై నేను ఒకే మాటపై ఉన్నాను. అప్పుడైనా ఇప్పుడైనా రూ. 94 వేల కోట్లు ఖర్చు చేశాం అని చెప్పాను.బతుకమ్మ చీరలపై సీఎం వ్యాఖ్యలు సరికాదు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి.ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చ పెడితే అన్నిటికీ సమాధానాలు చెప్తాను.పాలమూరు వెనబాటుకు కాంగ్రెస్సే కారణంమహబూబ్నగర్కు ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చాం.100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. హారీశ్రావు వ్యాఖ్యలకు సీఎం రేవత్రెడ్డి కౌంటర్గతంలో బతుకున్న చీరలు ఇస్తే.. మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉంది: సీఎం రేవంత్రెడ్డితెలంగాణ ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బతుకుతారు.బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగింది.బీఆర్ఎస్ ఆలోచన మారలేదు.. విధానం మారలేదు.బీఆర్ఎస్ తీరు వల్ల కేంద్ర బడ్జెట్లో నిధులు రాలేదు.గొర్రెల పథకంలో 700 కోట్ల స్వాహా చేశారు. వేల కోట్ల విలువైన భూములు అమ్మేశారు.పాలమూరు జిల్లా కేసీఆర్కు ఏం అన్యాయం చేసింది? పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ దుర్మార్గ కారణం కాదా?బీఆర్ఎస్ నేతలు ప్రజలను సభ్యపెట్టాలని చూస్తున్నారు.రంగారెడ్డి జిల్లా, కొడంగల్కు గోదావరి నీరు ఇవ్వొద్దని కుట్ర చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు భారీ అవినీతి జరిగిందిపార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుండు సున్నా ఇచ్చినా వారి బుద్ధి మారలేదుచేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రంగారెడ్డి జిల్లా ఆస్తులను భూములను అమ్ముకున్నది గత ప్రభుత్వం.మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్లో ప్రజలు బొంద పెట్టారు.బతుకమ్మ చీరలు, కెసిఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధమా?విచారణకు సిద్ధమైతే సవాళ్లు బీఆర్ఎస్ స్వీకరించాలి? ఆరోగ్య శ్రీ పథకం వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు - హరీష్ రావుఫీజు రీయింబర్స్ మెంట్, 108 పథకాలను వైఎస్సార్ ప్రారంభించారువైఎస్ఆర్ పెట్టిన పథకాలను కేసీఆర్ సభలో పొగిడారు మంచి పథకాలు అయిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్, 108 ను పేర్లు మార్చకుండా కేసీఆర్ కొనసాగించారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తెచ్చిన న్యూట్రిషన్ కిట్ను పక్కకు పెట్టింది.ఆరోగ్య శ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచటం సంతోషమేకానీ, వైద్య శాఖ బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తే.. ఇది ఎలా సాధ్యం అవుతుంది? రుణమాఫీ కోసం 31వేల కోట్లు ఖర్చు అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు: హరీష్ రావు బడ్జెట్ లో 26వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయింపు జరిగింది.5వేల కోట్ల రూపాయలను కోత విధించారు ఎలా బడ్జెట్ తగ్గింది?రుణమాఫీ కోత విధించారు.. రుణమాఫీ అర్హులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రుణమాఫి విషయంలో చాలా కోతలు పెట్టారు. 31వేల కోట్ల రుణమాఫి ఒకేసారి చేస్తామన్నారు. 31 వేల కోట్ల నుంచి 25 వేల కోట్లకు తగ్గించారు.రాజకీయాలు కోసం పేదల కడుపుకొట్టకండి ఎక్సైజ్ ఆదాయం 7వేల కోట్లు ఎలా పెరుగుతుంది?: హరీష్ రావు తెలంగాణ ప్రజలను మద్యం బానిసలు చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మద్యం పై ఆదాయం పెరుగుతుంది అంటే బిర్ల ధరలు పెంచుతారా?బెల్ట్ షాపులను రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతారా? భూములు అమ్మి 10వేల కోట్లు, మరో 14వేల అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ద్వారా ఆదాయం అని బడ్జెట్ పెట్టారు ఆదాయ మార్గాలను చెప్పకుండా 24వేల కోట్ల రూపాయలను ఆదాయం అని బడ్జెట్లో చూపించారు.వారసత్వ భూములు ఎలా అమ్ముతారు? అని ఆనాడు నేటి సీఎం రేవంత్ అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలన ప్రజలను మభ్య పెట్టారు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కప్రతిపక్షంలో కూడా అలానే భ్రమలు కల్పిస్తున్నారుప్రతిపక్ష నేత ఇవ్వాళ సభకు వస్తారు అనుకున్నాం.బడ్జెట్పై ఎల్ఓపీ మాట్లాడుతారు అనుకున్నాం.ఎక్సైజ్ టెండర్లు ముందే ఎందుకు పిలిచారు?టానిక్ లాంటి వారితో కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళనివ్వం.ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చారు. మేం అధికారంలోకి వచ్చాకు నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పని మొదలు పెట్టాంసర్కార్ సొమ్ము ప్రజలకు చేరేలా చేశాం మా బడ్జెట్ చూసి హరీశ్ రావుకు కంటగింపుగా ఉంది: మంత్రి భట్టి విక్రమార్కహరీశ్ రావు ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.హరీశ్రావు లేనిది ఉన్నట్లు మాట్లాడుతున్నారు.పూర్తి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారు.పత్రిపక్ష నేత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే వచ్చారు.ఇవాళ ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రాలేదు.పదేళ్లు తెలంగాణను ఆర్థికంగా నాశనం చేశారు.మంత్రి జూపల్లి గల్లీకో బెల్ట్ షాప్ పెడతామని అన్నారా? ఎక్సైజ్ శాఖ పై హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు2014లో పదివేల కోట్ల ఆదాయం ఉండే బీఆర్ఎస్ రాగానే అది 19వేలకు పెరిగింది.అదే విధంగా 2019 నాటికి 19వేల కోట్లు.. గత ఏడాదికి రూ. 35వేల కోట్లు ఎక్సైజ్ నుంచి ఆదాయం వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వల్ల రియలేస్టేట్ కుదేలైంది: హరీశ్ రావురాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల తగ్గుతున్నాయి... రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుతుంది.రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుతున్నా .. 4 వేల కోట్లు అదనపు ఆదాయం ఎలా తెస్తారు?రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెంచుతారా? రెట్లు పెంచుతారా?7700 కోట్ల రూపాయలు గత ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని బడ్జెట్లో పెంచారుమొత్తం ఎక్సైజ్ శాఖ నుంచి గత ఏడాది 25వేల కోట్లు ఆదాయం వస్తె ఇప్పుడు 42వేల కోట్లకు పెంచారు.42వేల కోట్ల ఆదాయం రావాలంటే గల్లీలో బెల్ట్ షాప్ పెట్టాల్సి వస్తది. సభలో హరీష్ రావు స్పీచ్కు అడ్డుపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావుజూపల్లి కృష్ణారావు మంత్రిపై మాజీ మంత్రి హరీష్ చురకలుఎవరూ ఆవేశపడకండి.. అన్ని లెక్కలు చెప్తాను, లిక్కర్ లెక్కలు చెప్తా అన్న హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి మమ్మల్ని తిట్టడమే సరిపోతుంది8 నెలల పాలన కాంగ్రెస్ ఏం సాధించింది: హరీశ్ రావుబీఆర్ఎస్ టార్గెట్గానే బడ్జెట్ ప్రసంగం ఉంది.ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతోంంది.బడ్జెట్లో వాస్తవాలు విస్మరించారు. గల్లీకో బెల్ట్ షాప్ ఓపెన్ చేశారుమేం అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ. 2 వేలు చేశాం రాష్ట్రంలో దశ, దిశలేని పాలన నడుస్తోంది కరెంట్ అంశంపై కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన హరీష్ రావుభట్టి విక్రమార్క, నేను అసెంబ్లీ బయట రోడ్డుపై పదినిమిషాలు ప్రజలను అడుగుదాం- హరీష్ రావుకరెంట్ బీఆర్ఎస్ పాలనలో భగుండేనా?, కాంగ్రెస్ పాలనలో బాగుండేనా? ప్రజలే చెప్తారురాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేదుగ్రామాల్లో విద్యుత్పై చర్చకు సిద్దమా? : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుప్రతిపక్ష నేతలు మాట్లాడేటప్పుడు మమ్మల్ని టీవీలో చూపించాలి : హరీష్ రావు.పార్లమెంట్ లో రాహుల్ గాంధీని చూపించడం లేదు అని కోడ్ చేసిన హరీష్ రావు.మమ్ములను సైతం అలా వివక్ష చూపిస్తున్నారు.. మమ్ములను మాట్లాడేటప్పుడు చూపించాలి: హరీష్ రావు హరీష్ రావు పై స్పందించిన స్పీకర్, మంత్రి శ్రీధర్ బాబు.రాహుల్ గాంధీ కంటే పదిరెట్లు ఇక్కడ చూపిస్తాం : శ్రీధర్బాబురాహుల్ గాంధీ బాటలో మేము నడుస్తం - శ్రీధర్బాబుప్రతిపక్ష నాయకులను టీవీలో చూపిస్తున్నారు కదా - స్పీకర్శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్రాహుల్ గాంధీ బాటలో నడవటం కాదు - ఆయన చెప్పినట్లు ఎమ్మెల్యేలను డిస్క్వాలిపై చేయాలి అని కోరుతున్నాం: హరీష్ రావుతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం బీజేపీ వాయిదా తీర్మానంరాష్ట్రంలో బాలికల మీద పెరుగుతున్న అత్యాచారాలపై వాయిదా తీర్మానం పెట్టిన బీజేపీబీజేపీ తరపున అసెంబ్లీలో మట్లాడనున్న ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్ నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.శాసన సభలో నేడు క్వశ్చన్ అవర్ రద్దుబడ్జెట్పై సభలో సాధారణ చర్చ జరగనుంది.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్లుబడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధి కి 10 వేల కోట్లు కేటాయించిన సీఎంకు , డిప్యూటీ సిఎంకు కృతజ్ఞతలుజీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రో లకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందిసికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏం తెచ్చారుటూరిజం మంత్రి గా ఉన్నా కిషన్ రెడ్డి చేసిందేమి లేదు.హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలికిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదుహైదరాబాద్ అభివృద్ధి కి నిధులు ఇచ్చినందుకా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారాకేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం కు తెలియజేసాం. అయినా సహకారం లేదు.గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరుకారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెల్లలేదుకేంద్ర బడ్జెట్ లో మాకు అన్యాయం జరిగింది.. అందుకే నిరసన తెలియజేయడం కోసమే నీతిఅయోగ్ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నాంతమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందిగేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా?మెడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డిఎస్ఎ చెప్పిందికేటీఆర్ యువరాజు కాదు, హుకుంలకు.. అల్టిమేటంకు బయపడేది లేదు -
పార్టీలే వేరు.. ఆలోచనా విధానం ఒక్కటే
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీఆర్ఎస్ లు.. పార్టీలే వేరు కానీ, నేతల ఆలోచనా విధానం మాత్రం ఒక్కటే అని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. రాష్ట్రంలో జెండాలు మారాయి తప్ప విధానాలు మార లేదంటూ సీఎం రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ల తీరుపై విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్పై అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లా డారు.కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.26 వేల కోట్లు, గ్రాంట్స్ కింద రూ.21 వేల కోట్లపైన చూపించారన్నారు. ఈ రెండు కలిపితే రూ.50 వేల కోట్లు తెలంగాణకు వస్తుండగా.. మరి రాష్ట్రానికి ఏమిచ్చారని ఎలా ప్రశ్ని స్తున్నారని రఘునందన్ నిలదీశారు. ‘నిధులు వచ్చుడో.. ఇద్దరం చచ్చుడో’అన్న వారు.. కేంద్రం తెలంగాణకు నిధులు ఇచ్చిందని తేలితే ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ముక్కు నేలకు రాస్తారా? అంటూ సవాల్ విసిరారు. మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వలేదన్న సీఎం, కేంద్రానికి డీపీఆర్ ఇచ్చారా? డీపీఆర్ ఇవ్వకుండా నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్లో కొండగల్కు రూ.5 వేల కోట్లు ఇచ్చుకున్న వారు కేంద్ర బడ్జెట్పై మాట్లాడే హక్కు లేదన్నారు. -
ఆ రైతుల సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కాలేదని అనేక మంది రైతులు ఆవేదన చెందుతున్నారని, దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్’వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారని, ఏడు నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు పంట రుణాన్ని రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నామని, తక్షణమే పరిష్కరించాలని హరీశ్రావు కోరారు. -
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం(జులై 26) సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహించడంపై అధికారులతో చర్చించారు. ఆగస్టు తొలివారంలోగా కొత్త ఓటరు లిస్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన తర్వాత గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ను సీఎం కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వి.కృష్ణ మోహన్, సీఎస్ శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
కాళేశ్వరం బీఆర్ఎస్కు పిక్నిక్ స్పాట్లా మారింది: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కమీషన్ల కక్కుర్తి, నాసిరకం నిర్మాణం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై బీఆర్ఎస్ పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తోందని.. కాళేశ్వరంపై తెలంగాణ సమాజం నిజాలు తెలుసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ గ్లోబల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.‘‘మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ సీఎం.. కుంగిపోయినప్పుడూ ఆయనే సీఎం.. మేడిగడ్డ బ్యారేజ్కు ప్రమాదం జరిగితే.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. కమీషన్ల కుక్కర్తి తప్ప ఇది మరొకటి కాదు. పాలమూరు-రంగారెడ్డిపై 31 వేల కోట్లు ఖర్చుపెట్టి.. ఒక్క ఎకరానికి నీరు అందించలేదు. కేసీఆర్ అండ్ కంపెనీ కక్కుర్తి వల్లే ఈ దుస్థితి’’ అంటూ ఉత్తమ్ ఎండగట్టారు.‘‘బీఆర్ఎస్ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ టీమ్ శాశ్వతంగా దెబ్బకొట్టారు. ప్రాజెక్టు నాసిరకం అని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని కమిటీ స్పష్టం చేసింది. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొదని కమిటీ చెప్పింది. కాళేశ్వరం బీఆర్ఎస్ నేతలకు పిక్నిక్ స్పాట్లా మారింది.’’ అని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు.‘‘35 వేల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ను రిడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బీఆర్ఎస్ 94వేల కోట్లు ఖర్చు చేసింది. 90 వేలకు పైగా ఖర్చు చేసినా కాళేశ్వరం పూర్తి కాలేదు.. పూర్తి కావాలంటే 1లక్ష 40 వేల కోట్లకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మైంటనేన్స్ కోసం ప్రతి ఏటా 15వేల కోట్లు ఖర్చు అవుతుంది. ప్రాజెక్టు పూర్తి అయితే అన్ని ఖర్చులు కలిపి ప్రతీ ఏటా 25 వేల కోట్లు అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఇరిగేషన్ సెక్టార్ను సర్వనాశనం చేసింది.’’ అని ఉత్తమ్ మండిపడ్డారు.కాళేశ్వరం సర్వనాశనం చేసి మళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ముందుకు వెళ్తాం. బ్యారేజీలో నీళ్లు వదలాలి చెప్పింది కాబట్టే మేము గేట్లు ఎత్తి పెట్టాం. మేడిగడ్డ వద్ద నీళ్లు స్టోరేజ్ చేస్తే గోదావరి పరివాక ప్రాంతాలు మునుగుతాయి. కేటీఆర్ కంటే ఎన్డీఎస్ఏకు తెలివి ఎక్కువ ఉంది అనుకుంటున్నాం. మీరే నాశనం చేసి.. మళ్ళీ మీరే పంప్లను ఆన్ చేస్తా అనడం విడ్డూరం. ఎల్లంపల్లి వద్ద రెండు మూడు రోజుల్లో పంపింగ్ మొదలు పెడతాం. అన్నారం 11 మీటర్ల వద్ద పంపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అన్నారం బ్యారేజి వద్ద 5 మీటర్లకే బుంగలు పడింది.’’ అని ఉత్తమ్ చెప్పారు. -
కేటీఆర్ కాళేశ్వరం పర్యటన ఒక విహారయాత్ర: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై ఇప్పటికైనా బీఆర్ఎస్ తప్పు ఒప్పుకోవాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వాస్తవాలు తెలిసి కూడా తప్పును కప్పి పుచ్చుకోవడానికి విహార యాత్రగా కాళేశ్వరంగా వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.కాగా, బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజక్ట్ పర్యటనపై జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కేటీఆర్ కాళేశ్వరం పర్యటన ఓ విహారయాత్ర. మూడు లిఫ్ట్ల్లో నీటిని తరలిస్తే 30వేల కోట్లు అయ్యే ప్రాజెక్ట్కు లక్షా 20వేల కోట్లు చేశారు. అప్పులకు కేసీఆరే బాధ్యుడు. ఈ ప్రాజెక్ట్లో నిర్మాణాత్మకంగా లోపాలు ఉన్నాయి. మూడు ప్రాజెక్ట్ల్లో నీటిని నిల్వ చేయకుడదని ఎన్డీఎస్ఏ స్పష్టం చెబుతోంది. విజిలెన్స్ కూడా ఇదే నివేదిక ఇవ్వబోతోంది.వాస్తవాలు తెలిసి కూడా ఇలా విహారయాత్రకు వెళ్లినట్టు వారంతా అక్కడికి వెళ్లారు. ఒకవైపు న్యాయవిచారణ జరుగుతోంది. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ అనుభవం ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించడానికి ఒకేఒక అవకాశం ఉంది. మారో మార్గమే లేదు. గత బీఆర్ఎస్ వల్లే ఈ పరిస్థితి నెలకొంది. తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారు. 148 మీటర్ల ఎత్తుతో నీటిని తరలిస్తే ప్రాణహిత నీళ్లు ఒక్క లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీళ్లు వచ్చేవి. కేసీఆర్ కమీషన్ల కోసం లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులకు ప్రజలను క్షమాపణ కోరండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఆగస్టు 2 డెడ్లైన్.. రైతులతో కలిసి పంపులు ఆన్ చేస్తాం: కేటీఆర్
సాక్షి, కాళేశ్వరం: కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా మొదటగా వీరు కన్నెపల్లి పంప్హౌజ్ వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్హౌజ్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ హయాంలో ప్రతీ రిజర్వాయర్ నిండుకుండలా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దయచేసి ప్రాజెక్ట్లపై రాజకీయం చేయకండి. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్లను నింపడం లేదు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ గుండె లాంటింది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ను కట్టాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతులకు కల్పతరువు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకుండా ముందు చూపుతో కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరితగతిన ప్రాజెక్ట్ను నిర్మించలేదు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదు.గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్ట్పై విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు రెండో తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం స్పందిచకపోతే 50వేల మంది రైతులతో మేము పంపులు ఆన్ చేస్తాం. బీడు భూములకు నీళ్లు అందిస్తాం. రాజకీయపరమైన నిర్ణయం వల్లనే నీటిని ఎత్తిపోయడం లేదు. ఈ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీరాంసాగర్ సామర్థ్యం 90 టీఎంసీలు, ఇప్పుడు కేవలం 25 టీఎంసీలే ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్ల్లో ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రమంతా కాళేశ్వరం నీటి కోసం చూస్తున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు.ఒక్క బటన్ నొక్కితే పైన ఉన్న ఎల్ఎండీ, మిడ్ మానేరు సహ ఎస్ఆర్ఎస్పీ కూడా నింపొచ్చు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరుతో ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. పోలవరం కొట్టుకుపోతే ఏళ్లు గడిచినా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ, కాళేశ్వరం విషయంలో రోజుల్లోనే రిపోర్టులు ఇచ్చింది. కేవలం కేసీఆర్పై రాజకీయ కక్షతోనే ఇదంతా జరుగుతోంది. ఎలాగూ మీరంతా అనుకున్నట్టుగానే కేసీఆర్ను ఓడించారు. ఇంకా రైతులపై ఎందుకింత పగ. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఇబ్బందిపెట్టకండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. -
రేవంత్, కేటీఆర్.. ధర్నా చేసే దమ్ముందా?: బీజేపీ ఎంపీ రఘునందన్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటేనని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రెండు పార్టీలు బడ్జెట్ కేటాయింపులపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. రేవంత్, కేటీఆర్ ఇద్దరూ జంతర్మంతర్ వద్ద ధర్నా చేయాలి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయాలి అంటూ ఘాలు వ్యాఖ్యలు చేశారు.కాగా, ఢిల్లీలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగాయి. గత పదేళ్లుగా ఎన్డీయే నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితోనే చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటే. జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేదు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైఖరి ఒకటే ఏం మారలేదు. మార్పు ఏదైనా ఉందా అంటే.. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారారు. మార్పు ఇంకేదైనా ఉందంటే.. కుర్చీలు మాత్రం మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ.20 కోట్లతో కేసీఆర్ కొన్నారని, కానీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.5 కోట్లకే కొన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్లో చెప్పారు.ప్రతీ మహిళకు రూ.2,500 ఇస్తామన్నారు. ఏడాదికి రూ.30వేలు అవుతుంది.. ఇది ఇచ్చారా? బడ్జెట్లో కేటాయింపులు ఏవి?. వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్లో కేటాయింపులు ఏవి మరి?. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రూ. 35,500 కోట్లు రుణం తెచ్చామన్నారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.9లక్షలపైనే ఉంది. వికారాబాద్ జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.1 లక్షపైన ఉంది. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంత వ్యత్యాసం ఉంది. దేశవ్యాప్తంగా చూసినా సరే ఇదే తరహా అంతరాలు ఉంటాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.26వేల కోట్లుగా చూపించారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.21వేల కోట్లపైన చూపించారు. ఈ రెండు కలిపితే దాదాపు రూ.50 వేల కోట్లు తెలంగాణకు వస్తున్నాయి. మరి తెలంగాణకు ఏమిచ్చారు అని ఎలా ప్రశ్నిస్తున్నారు.రేవంత్ రెడ్డి, కేటీఆర్ జంతర్ మంతర్ల ధర్నా చేయాలి. నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా. ఢిల్లీ జంతర్ మంతర్ రండి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయండి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చి కడుతున్నారా లేదా?. తెలంగాణకు కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందో లెక్కలున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.10 లక్షలకు కేంద్రం పెంచింది. దీన్నే ఆరోగ్యశ్రీ కింద మీ పేరు మీద ప్రచారం చేసుకుంటున్నారు. మైనారిటీల పండుగల కోసం రూ.33 కోట్లు కేటాయించారు. మరి తెలంగాణలో హిందువులు లేరా? హిందూ పండుగలు లేవా?. సెక్యులరిజం అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు. -
రుణమాఫీ సరే.. వడ్డీ సంగతేంటి: హరీష్ రావు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ తొమ్మిదో తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడు నెలల కాలయాపన చేసిందన్నారు. దీంతో, రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు.కాగా, హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. డిసెంబర్ తొమ్మిదో తేదీన రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పి, ఏడు నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ… pic.twitter.com/MdHZsSeOcO— Harish Rao Thanneeru (@BRSHarish) July 26, 2024 ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను. పరిష్కరించాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. -
కాళేశ్వరం బయలుదేరిన బీఆర్ఎస్ బృందం..
సాక్షి, రామగుండం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం రామగుండం నుంచి కన్నెపల్లి పంప్ హౌస్కు బీఆర్ఎస్ టీమ్ పయనమైంది. ఈ తర్వాత వీరంతా మేడిగడ్డ ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు.అయితే, కాళేశ్వరం పర్యటనకు బీఆర్ఎస్ నేతలు గురువారం సాయంత్రం బయలుదేరారు. ఈ క్రమంలో నిన్న రాత్రి రామగుండంలో వారంతా బస చేశారు. బీఆర్ఎస్ టీమ్ ముందుగా ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలిస్తారు. అనంతరం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్నారు. కాగా, కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద బీఆర్ఎస్ బృందం మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం పర్యటన అనంతరం వీరంతా తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. ఇక, కేటీఆర్ నేతృత్వంలో టీమ్ పర్యటనకు వెళ్లడంతో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది.మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం. pic.twitter.com/WfoThtZssp— KTR News (@KTR_News) July 26, 2024 మరోవైపు.. రామగుండంలో సింగరేణి క్వార్టర్స్ కోల్పోతున్న బాధితులు శుక్రవారం ఉదయం కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ప్లకార్డ్స్ ప్రదర్శనలతో తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ వేదికగా తమ గోడును వినిపించాలని కోరారు. ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెల పరిస్థితిని ఈ శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చాం.ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రచారాలు బంద్ పెట్టి.. నీటి పంపింగ్… pic.twitter.com/0B2kaeCEUS— BRS Party (@BRSparty) July 25, 2024 రేవంతూ.. నీ అసమర్థ పాలనతో తెలంగాణను ఎడారిగా మారుస్తున్నావు.బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతలతో కళకళలాడిన లోయర్ మానేరు డ్యాం..చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకపోవడంతో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నీళ్లు లేక వెలవెలబోతున్నది. pic.twitter.com/X2jBcH4l28— BRS Party (@BRSparty) July 25, 2024 -
రైతుకు వెన్నుపోటు.. పథకాలకు తూట్లు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విమర్శించారు. బడ్జెట్లో ఏ ఒక్క వర్గానికి కూడా స్పష్టమైన హామీ లేదని, రైతులను పొగుడుతున్నట్టుగా పొగుడుతూనే ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టు కాకుండా రైతుబంధు, రైతుభరోసా వంటి పథకాల్లో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా చెప్పి రైతులను మోసం చేశారని, ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం పూర్తయిన అనంతరం గురువారం మధ్యాహ్నం మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన నైజాన్ని బయటపెట్టుకున్నది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క పథకంపై స్పష్టత లేదు. గొర్రెల పథకం లేదు..దళితబంధు లేదు యాదవులకు ఇస్తున్న గొర్రెల పెంపకం పథకాన్ని మొత్తానికి మూసేసినట్టు అర్థమవుతుంది. ఇప్పటికే యాదవులు చెల్లించిన డిపాజిట్లు కూడా వాసప్ ఇస్తుంది ఈ ప్రభుత్వం. కొత్త విషయం ఏమీలేదు. అత్యంత బడుగువర్గాలకు మేలు చేస్తున్నట్టుగా చెబుతూనే గొంతు కోసింది. దళితవర్గాల కోసం గతంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన దళితబంధు పథకం ప్రస్తావనే లేదు. ఇదీ చాలా దురదృష్టకరం. దళిత సమాజంపై ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి, ఫ్యూడల్ విధానానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం అవసరం లేదు. మత్స్యకారులకు భరోసా లేదు. ఏ ఒక్కవర్గానికి కూడా ఈ బడ్జెట్లో భరోసా లేదు. బడ్జెట్లో విశేషమేమిటంటే ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క డబ్బుల గురించి చెప్పినప్పుడు ప్రతిమాటను ఒత్తిఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీలేదు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం కూడా లేని పరిస్థితి వచ్చింది. మహిళల పట్ల కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ దీనిని కూడా లక్ష కోట్ల రుణాలు అంటూ వీళ్లేదో ఇస్తున్నట్టు చెప్పారు. ఉన్న స్కీంను చెప్పారే తప్ప..కొత్తగా ఏమీలేదు. వెరసి ఇది పాతదే. దురదృష్టం ఏమిటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఆరుమాసాల సమయం ఇవ్వాలని అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ, ఈ రోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీకి ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటికీ పాలసీ పార్ములేషన్ చేసేటట్టుగా కనిపిస్తలేదు. ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం వ్యవసాయం విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉండే. ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని, మేం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. వీళ్లెమో ఎగ్గొడుతామని చెబుతున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బును పాడు చేసినం..చెడగొట్టినం.. దుర్వినియోగం చేసినం అనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం అని తెలుస్తుంది. ధాన్యం కొనుగోలు చేయలేదు. విద్యుత్ సరఫరా చేయడం లేదు. నీళ్లు సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతుబంధు, రైతుభరోసా ప్రస్తావనే లేదు. రైతుభరోసా ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అరిస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. కాబట్టి రైతులను ఈ ప్రభుత్వం వంచించింది. వృత్తి కార్మికులను వంచించింది’అని కేసీఆర్ అన్నారు. భవిష్యత్లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం ‘ఇండస్ట్రీయల్ పాలసీ ఏమిటి? ఏం లేదు వట్టిదే గ్యాస్..ట్రాష్. ఇదేదో స్టోరీ టెల్లింగ్లాగా ఉంది తప్ప ఏం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి ? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు.. పేదవర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి? అనే ఏ ఒక్కదానిపై కూడా స్పష్టత లేదు. చిల్లరమల్లర ప్లాట్ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగంలా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా.. నిర్దిష్టంగా ఈ పనిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ, పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు.. ఎవరి బడ్జెటో రేపు మీకు విశ్లేషణలో తెలుస్తది. భవిష్యత్లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం’అని కేసీఆర్ తేల్చి చెప్పారు. -
బడ్జెట్పై కేసీఆర్ వ్యాఖ్యలు తగదు.. జగ్గారెడ్డి
ప్రతిపక్షనేత కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్.. రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండే బడ్జెట్. గత పదేళ్ల కాలంలో హైప్ బడ్జెట్..కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రాక్టీకల్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల బడ్జెట్ ఊహల్లో విహరించిన బడ్జెట్ అన్న ఆయన.. కాంగ్రెస్ నాయకత్వం వాస్తవానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోరి ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తే.. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం అప్పులకే ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. -
‘పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్!‘..కేటీఆర్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్ : పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రతిపాదించారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..!వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్..!డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..!విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతోఏమార్చిన డొల్ల బడ్జెట్..!రైతులకు…— KTR (@KTRBRS) July 25, 2024 అయితే ఈ బడ్జెట్పై కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..! వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్ అని మండిపడ్డారు. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..! విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ట్వీట్లో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..రైతులకు కత్తిరింపులు. అన్నదాతలకు సున్నం..! ఆడబిడ్డలకు అన్యాయం.. మహాలక్ష్ములకు మహామోసం..! అవ్వాతాతలకు..దివ్యాంగులకు..నిరుపేదలకు...నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదు..! దళితులకు దగా..గిరిజనులకు మోసం. అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలింది..! బడుగు..బలహీన వర్గాలకు భరోసాలేదు..వృత్తి కులాలపై కత్తికట్టారు..! మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ..నీటి మూటలైనయ్..! నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..4 వేల భృతి జాడా పత్తా లేదు..! విద్యార్థులపై కూడా వివక్షే..5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదు..! హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు..మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్..! నేతన్నకు చేయూత లేదు..ఆటో అన్నలను అండదండ లేదు..ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమేలేదు..! మొత్తంగా ..పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్..! అంటూ ట్వీట్లో తెలిపారు. -
‘ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. అంకెల గారడీలా మారింది‘: హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్: ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆత్మ స్తుతి పర నిందలా మారింది. బడ్జెట్లో హామీల ప్రస్తావన లేదు. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో బడ్జెట్ ఉంది. ఇచ్చిన హామీల ప్రస్తావన ఏ ఒక్కటి లేదు. అప్పులు తెస్తామని మళ్ళీ చెప్తుంది. కాంగ్రెస్ తన మేనిఫెస్టో మర్చిపోయింది. 2,500 మహిళలకు ఇస్తామని చెప్పింది. కోటి మంది అక్క చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు. 8 నెలలుగా మహాలక్ష్మి కాస్త మహా నిరాశగా మారింది. ఆసరా పెన్షన్పై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో చెప్పారు. 4వేల పెన్షన్ ఇప్పటిదాక ఇవ్వలేదు. ఊదర గొట్టి బడ్జెట్లో పెట్టలేదు. పేదల ప్రభుత్వం అన్న కాంగ్రెస్ ఎందుకు ఇవ్వటం లేదు. విద్యా భరోసా కార్డు, స్కూటిలు ఇస్తామన్నారు బడ్జెట్లో దాని ఊసే లేదు. ఆటో కార్మికులు వృత్తి నమ్ముకొని ఆటో నడుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి పొట్ట కొట్టింది. చేనేత కార్మికుల ప్రస్తావన లేదు. రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?: బండి సంజయ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్పై కేంద్ర మోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్+రాష్ట్ర బడ్జెట్=గాడిద గుడ్డేనా?.. 6 గ్యారంటీలు+రాష్ట్ర బడ్జెట్=గాడిద గుడ్డేనా? అంటూ సెటైర్లు వేశారు.గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమని మండిపడ్డారు. ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా..? అంటూ దుయ్యబట్టారు.రాష్ట్రంలో అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అప్పులున్న విషయం ముందు మీకు తెలిసి కూడా 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్లో నిధులెందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. బడ్జెట్ కేటాయింపులకు సరిపడ ఆదాయం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో బడ్జెట్ో లెక్కా పత్రం చూపకపోవడం విడ్డూరమన్నారు.‘సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా?. ఔను.. హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ కు మాటలెక్కువని బడ్జెట్ చూస్తే అర్ధమవుతోంది. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిన మీరు 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో పైసా కేటాయించని మీరా కేంద్రంపై విమర్శలు చేసేది?రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా?. ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందూ ప్రజలకు తీవ్రమైన నష్టం చేయడమేనా మైనారిటీ డిక్లరేషన్ అంటే?రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారా? లేదా? చెప్పాలి. ఏడాదిపాటు నష్టపోయిన ‘రైతు భరోసా’, రూ.500 బోనస్, పంట నష్ట పరిహారం నిధులను కూడా ఈ ఏడాది చెల్లిస్తారా? లేదా?జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వ్రుద్ధి రేటు తక్కువ నమోదు కావడమే 10 ఏళ్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు అద్ధం పడుతుంది. కేబినెట్ మంత్రుల మధ్యే సఖ్యత లేదు.. తెలంగాణలో సమసమాజం స్థాపిస్తామనడం శతాబ్దం జోక్. ఇప్పటికైనా పీఎం ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించడం సంతోషం. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే.. 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం దారుణం. 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గు చేటు.ఇందిరమ్మ ఇండ్లు, ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం విడ్డూరం. బడ్జెట్లోని చివరి పేజీలో ప్రస్తావించిన మహాత్ముడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, అప్పులకు.. మీరిచ్చిన అమలుి కాని హామీలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్ లోనే తేలిందిబడ్జెట్లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదు.. సీఎంసహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా?. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని.. రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్ లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా... దీనికేం సమాధానం చెబుతారు? బడ్జెట్లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్లా? రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారా?