గ్యాంగ్ రేప్ | Woman gang-raped by robbers in Bengaluru | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ రేప్

Nov 5 2014 4:47 AM | Updated on Aug 21 2018 5:46 PM

గ్యాంగ్ రేప్ - Sakshi

గ్యాంగ్ రేప్

ఇంటిలోకి చొరబడిన నలుగురు దుండగులు.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులను బంధించారు.

పోలీసులమంటూ ఇంటిలోకి చొరబడిన నలుగురు దుండగులు.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులను బంధించారు. దండుపాళ్య చిత్రం తరహాలో నగలు, నగదు లూటీ చేశారు. అనంతరం భర్త, అత్త, కుమారుడి కళ్లముందే ఆ గృహిణి (25)పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాన్ని తమ మొబైళ్లలో రికార్‌‌డ చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాము రికార్‌‌ట చేసిన వాటిని ఇంటర్‌నెట్‌లో పెట్టి పరువు తీస్తామని బెదిరించి పారిపోయారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
 
మరో ‘దండుపాళ్య’ ..

* బెంగళూరులో పది రోజుల క్రితం దుర్ఘటన
* పోలీసులమంటూ ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దుండగులు
* నగదు, నగలు లూటీ
* అనంతరం గృహిణిపై సామూహిక అత్యాచారం.. నిందితుల అరెస్ట్

బెంగళూరు :  ఇంటిలోకి చొరబడిన నలుగురు దుండగులు.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులను బంధించారు. నగలు, నగదు లూటీ చేశారు. అనంతరం  గృహిణి (25)పై సామూహిక అత్యాచారం చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.  బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ మంగళవారం తెలిపిన వివరాల మేరకు... హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ సమీపంలోని ఇగ్గలూరులోని గ్రీన్‌గ్రేన్ లేఔట్‌లో ఓ వ్యక్తి తన కుటుంబంతో నివాసముంటున్నాడు. అక్టోబర్ 24వ తేదీ రాత్రి 11.45 గంటల సమయంలో నలుగురు నిందితులు అతని ఇంటికి వచ్చారు. తాము పోలీసులమని చెప్పడంతో ఆ వ్యక్తి తలుపులు తీశాడు. ఇంటిలోకి వెళ్లిన వారు ఆ కుటుంబ సభ్యులను బెదిరించారు. బీరువాలో ఉన్న రూ. 10 వేలు, రూ. లక్ష విలువైన బంగారు నగలు దోచుకున్నారు.

అనంతరం ఆ వ్యక్తి భార్య చీరను లాగేశారు. అదే చీరతో ఆ వ్యక్తిని, అతని తల్లిని, అతని కుమారుడిని కట్టేశారు. తరువాత మహిళపై సామూహిక అత్యాచారం చేశారు.   ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే అత్యాచారం చేసిన దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో పెడతామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరువు పోతుందని భయపడిన ఆ వ్యక్తి  తన ఇంటిలో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత నేరస్తుల ఫొటోలను ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు చూపించారు. ఓ నిందితుడ్ని ఆ కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ నిందితుడి ఆధారంగా మిగిలిన వారినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని  నందీష్, అతని అనుచరులు అనీల్ కుమార్, సుజిత్ కుమార్ అలియాస్ సుజిత్, సెమైన్‌గా గుర్తించారు. నందీష్ పాత నేరస్తుడని, అతనిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని అలోక్ కుమార్ చెప్పారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరిచామని, న్యాయమూర్తి అనుమతితో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement