
ఏ బటన్ నొక్కినా ఓటు బీజేపీకే!
మధ్యప్రదేశ్లోని భీండ్ జిల్లాలో ఉప ఎన్నిక నేపథ్యంలో..ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) యంత్రాల పనితీరుపై అవగాహన కార్యక్రమంలో
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని భీండ్ జిల్లాలో ఉప ఎన్నిక నేపథ్యంలో..ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) యంత్రాల పనితీరుపై అవగాహన కార్యక్రమంలో ఆ మెషీన్ల నుంచి బీజేపీ స్లిప్పులు మాత్రమే వచ్చిన ఘటనపై ఎన్నికల సంఘం ఆ జిల్లా ఎన్నికల అధికారుల నుంచి నివేదికను కోరింది. దీంతో ఓటింగ్ యంత్రాల సమర్థతపై అనుమానం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శనివారం ఈసీని ఆశ్రయించింది.
ఎన్నికల్లో ఈవీఎంలను కాకుండా పాత విధానమైన బ్యాలెట్ పద్ధతిని అమలుచేయాలని డిమాండ్ చేసింది. ముఖ్య ఎన్నికల కమిషనర్ జైదీని కలుసుకున్న కాంగ్రెస్ ప్రతినిధి బృందం భీండ్ ఘటనపై దర్యాప్తు జరపాలని కోరింది.