
వాలాజాబాద్ బస్టాండ్ను ప్రారంభించిన మంత్రి
ఆధునీకరించిన వాలాజాబాద్ బస్టాండ్ ను మంత్రి చిన్నయ్య ఆదివారం ప్రారంభించారు. కాంచీపురం జిల్లా వాలాజాబాద్ బస్టాండులో రూ.40 లక్షలతో పైకప్పు ఏర్పాటు చేశారు.
పళ్లిపట్టు: ఆధునీకరించిన వాలాజాబాద్ బస్టాండ్ ను మంత్రి చిన్నయ్య ఆదివారం ప్రారంభించారు. కాంచీపురం జిల్లా వాలాజాబాద్ బస్టాండులో రూ.40 లక్షలతో పైకప్పు ఏర్పాటు చేశారు. బస్టాండు అభివృద్ధి పనులు పూర్తి కావడంతో ఆదివారం ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పశుసంవర్థకశాఖ మంత్రి చిన్నయ్య పాల్గొని బస్టాండ్ సేవలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం కోసం వినూత్న పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రజలకు మెరుగైన సదుపాయలు కల్పించి రవాణా సేవలు మెరుగుపరిచామని తెలిపారు. ప్రయాణికులకు సేవలను విస్తృతం చేసే విధంగా బస్టాండ్లు అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చుదిద్దుతామని పేర్కొన్నారు. ప్రయూణికులు సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ షణ్ముగం, ఎమ్మెల్యేలు గణేశన్, సోమసుందరం పాల్గొన్నారు.