పరాయి దేశంలో కోటి కష్టాలు!
మన దేశం నుంచి బతుకుతెరువు కోసం విదేశాలు వెళ్లి, అక్కడ చాలా మంది నానా బాధలు పడుతూ ఉంటారు. అలాంటి జీవితకథల నేపథ్యం లోని చిత్రమే ‘గల్ఫ్’ అని పి. సునీల్కుమార్ రెడ్డి అంటున్నారు. శ్రావ్యా ఫిల్మ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించనున్న ఈ చిత్రానికి సునీల్కుమార్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ప్రచార గీతాన్ని హైదరాబాద్లో విడుదల చేశారు.
‘‘మస్కట్, దుబాయ్ ఇంకా అరబ్ దేశాల్లోని తెలుగువారి క ష్టాలను ఈ చిత్రంలో చూపించనున్నాం. ఓ ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నాం’’ అని సునీల్కుమార్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి. బాపిరాజు, సహనిర్మాత డాక్టర్ ఎల్.ఎన్. రావు, సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి పాల్గొన్నారు.