
మరో ఉద్యమ చిత్రం
‘‘ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ ఉద్యమం. వందలాది మంది యువకుల బలిదానాల త్యాగఫలంతో ఏర్పడిన తెలంగాణా విశిష్టతే మా జయహో తెలంగాణా’’ అని దర్శకుడు మిరియాల రవికుమార్ చెప్పారు.
‘‘ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ ఉద్యమం. వందలాది మంది యువకుల బలిదానాల త్యాగఫలంతో ఏర్పడిన తెలంగాణా విశిష్టతే మా జయహో తెలంగాణా’’ అని దర్శకుడు మిరియాల రవికుమార్ చెప్పారు. ఇంద్ర, రాజీవ్ కుమార్, ప్రీతి నిగమ్, మధుబాల, సుమనశ్రీ, అజయ్ ముఖ్యతారలుగా ప్రేమ్ మూవీస్ పతాకంపై కొత్తపల్లి సతీష్బాబు నిర్మిస్తోన్న ‘జయహో తెలంగాణా’ చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి తెలంగాణ జెఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ క్లాప్ ఇచ్చారు. సుమన్ మాట్లాడుతూ -‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేస్తున్న ఈ చిత్రంలో ఓ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నా’’ అన్నారు. మే నెల నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: మార్త రఘుపతిగౌడ్, నడిగొట్టి శంకర్.