'అతిగా ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ నేతలు' | Uttam kumar reddy takes on TRS Leaders | Sakshi
Sakshi News home page

'అతిగా ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ నేతలు'

Jan 14 2016 3:50 PM | Updated on Sep 19 2019 8:44 PM

'అతిగా ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ నేతలు' - Sakshi

'అతిగా ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ నేతలు'

హైదరాబాద్ నగరంలో 200 ఇళ్లు కట్టి... టీఆర్ఎస్ నేతలు అతిగా ప్రచారం చేసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో 200 ఇళ్లు కట్టి... టీఆర్ఎస్ నేతలు అతిగా ప్రచారం చేసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తమ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ 76 వేల ఇళ్లు కట్టి కూడా చెప్పుకోవడం లేదని తెలిపారు.

మురికివాడల అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి పనులకు కాంగ్రెస్ పార్టీ వేల కోట్లు ఖర్చే చేసిందని ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను శుక్రవారం సగం... శనివారం సగం ప్రకటిస్తామని చెప్పారు. మేయర్ అభ్యర్థి ప్రకటనపై కసరత్తు చేస్తున్నామన్నారు. జనాభా ప్రాతిపదికిన మైనార్టీలు, సెటిలర్లకు కూడా టికెట్లు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement