తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్సెంటర్) : ఏకీకృత సర్వీస్ రూల్స్ను వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు అన్నారు. గురువారం పట్టణానికి విచ్చేసిన ఆయన జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భర్తీ కాకుండా ఉన్న పోస్టులు ఎంఈఓ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, డెప్యూటీ డీఈఓలు, డైట్ అధ్యాపకులు పోస్టులను అర్హత, తగ్గ సీనియార్టీలతో ప్రభుత్వ, జెడ్పీ తేడాలు లేకుండా భర్తీ చేయాలన్నారు. సీఎం, విద్యాశాఖ మంత్రి సహకారంతో ఢిల్లీ వరకు ఫైల్ను నడిపించామన్నారు. తుదిదశకు చేరిందని, అతికొద్దికాలంలో సవరణలతో రాష్ట్రపతి ఆమోదం పొందుతుందన్నారు. ఇరు రాష్ట్రాలకు నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఇప్పటికే ఎంఈఓలను రెగ్యులర్ చేయించామని చెప్పారు. 2004 తరువాత ఎవరైతే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వారికి సంబంధించి రిటైర్మెంట్ అయినా, మధ్యలో చనిపోయినా వారు అనేక విధలుగా నష్టపోతున్నారని, మానవత దృక్పథంతో పరిశీలించాలని కోరామన్నారు. సీపీఎస్ విధానం రద్దుకు కేంద్రం పునరాలోచన చేస్తుందన్నారు. పీఆర్టీయూ సర్వీస్ రూల్స్ను సాధ్యం చేయడం, సీపీఎస్ విధానంను అంతం చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీగా తన వంతు సహాయ సహకారాలు ఉపాధ్యాయులకు ఉంటాయని ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రంలో సర్వీస్ రూల్స్ తుది దశకు చేరుతున్నందున పీఆర్టీయూ తొలుత పదోన్నతులు కల్పించడం ద్వారా బదిలీలు చేపట్టాలని చెబుతుందన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కమలాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు డీఏలు చెల్లించాల్సి ఉందన్నారు. 10 నెలలుగా పీఆర్సీ ఏరియర్స్, హాఫ్ లీవ్ ఎన్కేష్మెంట్ ఇవ్వాల్సి ఉందన్నారు. 398 నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. నిరంతర సమగ్ర మూల్యంకనం విధానం రద్దు చేయాలని, కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని, నాన్ టీచింగ్ సిబ్బందిని నియామకాలు చేపట్టాలన్నారు. పీఈటీ, గ్రేడ్ పండిట్లను నూటికి నూరుశాతం భర్తీ చేయాలన్నారు.
ఏకీకృత సర్వీస్ రూల్స్ను వేగవంతం చేయాలి
Published Thu, Apr 20 2017 10:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement