చెరువులో పడి విద్యార్థి మృతి | student died | Sakshi
Sakshi News home page

చెరువులో పడి విద్యార్థి మృతి

Sep 11 2016 11:02 PM | Updated on Nov 9 2018 5:02 PM

మృతి చెందిన రాజేష్‌ - Sakshi

మృతి చెందిన రాజేష్‌

లఖందిడ్డి వెళ్లే రోడ్డు పక్కనున్న చెరువులో పడి ప్రకాశ్‌నగర్‌ కాలనీకి చెందిన ఎం.రాజేష్‌(12) ఆదివారం మృతి చెందాడు. ప్రకాశ్‌నగర్‌ కాలనీకి చెందిన కార్పంటర్‌ ఎం.శంకరరావు కుమారుడు రాజేష్‌ స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

కోటబొమ్మాళి :  లఖందిడ్డి వెళ్లే రోడ్డు పక్కనున్న చెరువులో పడి ప్రకాశ్‌నగర్‌ కాలనీకి చెందిన ఎం.రాజేష్‌(12) ఆదివారం మృతి చెందాడు. ప్రకాశ్‌నగర్‌ కాలనీకి చెందిన కార్పంటర్‌ ఎం.శంకరరావు కుమారుడు రాజేష్‌ స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో రాజేష్‌ తన స్నేహితుడు ఢిల్లీశ్వరరావుతో కలసి చెరువులో స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తూనే ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. విషయం గుర్తించిన తోటి స్నేహితులు కేకలు వేయడంతో అక్కడ ఉన్నవారు వచ్చి రాజేష్‌ను బయటకు తీశారు. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాజేష్‌ మృతి చెందినట్టు డాక్టర్‌ గణేష్‌ చెప్పారు. ఈ సంఘటనతో కాలనీలో విషాదం అలముకొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement