రేవంత్ రెడ్డి డ్రైవర్ కు ఏసీబీ నోటీసులు | acb issued notice to revanth reddy's driver | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డి డ్రైవర్ కు ఏసీబీ నోటీసులు

Jul 19 2015 7:27 PM | Updated on Sep 29 2018 5:26 PM

ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేంద్ర రెడ్డికి ఏసీబీ తాజాగా నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్:ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేంద్ర రెడ్డికి ఏసీబీ తాజాగా నోటీసులు జారీ చేసింది.  ఈ మేరకు సెక్షన్ 160 సీఆర్పీసీ కింద రాఘవేంద్రరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. ఆదివారం సాయంత్రం నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు తెలుగు యువత నాయకుడు పుల్లారావుకు కూడా ఏసీబీ నోటీసులు పంపింది.

అంతకుముందు ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు టీడీపీ నేత ప్రదీప్కు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఓటకు కోట్లు కేసులో ఉన్నవారి సంఖ్య మరింత పెరుగుతుండటం టీడీపీ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement