ఫేక్‌ న్యూస్‌ : ఈపీఎఫ్‌ఓ రూ. 80వేలు ఆఫర్‌ | Fake News Buster: EPFO is not giving Rs 80,000 | Sakshi
Sakshi News home page

ఫేక్‌ న్యూస్‌ : ఈపీఎఫ్‌ఓ రూ. 80వేలు ఆఫర్‌

Nov 2 2019 11:11 AM | Updated on Nov 2 2019 11:13 AM

Fake News Buster: EPFO is not giving Rs 80,000 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగులకు తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000లు బహుమతి ఇస్తుందంటూ  సోషల్‌   మీడియాలో ఒక సందేశం విపరీతంగా షేర్‌ అవుతోందని.. ఇది  ఫేక్‌ అని తేల్చి చెప్పింది. ఇలాంటి సత్యదూరమైన మెసేజ్‌ల పట్ల అప్రతమత్తంగా ఉండాలని  సూచించింది. తామెలాంటి ఆఫర్లను అందించడం లేదని స్పష్టం చేసింది. 

ఈపీఎఫ్ఓ చందాదారులకు బంపర్‌ అఫర్‌అంటూ ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్య కాలంలో పని చేసిన వారికే వర్తిస్తుందని..ఇక దాన్ని పొందాలంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ లింక్‌లో వివరాలు తెలియజేయాలంటూ ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. దీంతో ఖాతాదారులు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన  సంస్థ ఇది ఫేస్‌ న్యూస్‌ అని,  ఇలాంటి పుకార్లను నమ్మవద్దవని స్పష్టం చేసింది. అలాగే ఈపీఎఫ్ఓ పేరుతో వచ్చే నకిలీ  కాల్స్, మెసేజ్స్ వచ్చినా కూడా స్పందించరాదని ఖాతాదారులను హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్‌ ద్వారా ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement