ఆ పొత్తుతో చిత్తే..! | tdp alliance with the bjp | Sakshi
Sakshi News home page

ఆ పొత్తుతో చిత్తే..!

Apr 8 2014 1:29 AM | Updated on Mar 29 2019 9:24 PM

ఆ పొత్తుతో చిత్తే..! - Sakshi

ఆ పొత్తుతో చిత్తే..!

మొత్తమ్మీద విభజనవాదులు ఒక్కటయ్యారు. నేరుగా విభజనకు మద్దతిచ్చిన బీజేపీ, ఆ నిర్ణయానికి అనుకూలంగా లేఖలిచ్చిన టీడీపీలు పొత్తు కుదుర్చుకోవడంపై సమైక్యవాదులు గుర్రుగా ఉన్నారు.

సాక్షి, గుంటూరు:మొత్తమ్మీద విభజనవాదులు ఒక్కటయ్యారు. నేరుగా విభజనకు మద్దతిచ్చిన బీజేపీ, ఆ నిర్ణయానికి అనుకూలంగా లేఖలిచ్చిన టీడీపీలు పొత్తు కుదుర్చుకోవడంపై సమైక్యవాదులు గుర్రుగా ఉన్నారు. ఈ పార్టీల పొత్తును చిత్తు చేస్తామని సమైక్యవాదులు పేర్కొంటున్నారు. సీమాంధ్రలోనే సమైక్య ఉద్యమానికి గుంటూరు చుక్కానిలా నిలిచింది.

విభజన జరిగిన తీరు జిల్లా వాసుల గుండెల్ని తీవ్రంగా గాయపరిచింది. ఆరు నెలల పాటు సుదీర్ఘంగా సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగింది. ఈ ఉద్యమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అప్పట్లో వీరు బీజేపీ వైఖరిని ఎండగట్టారు. దీనికి తోడు జిల్లాలో చాలా సెగ్మెంట్లలో గెలుపోటములు నిర్ణయించే శక్తిగల ముస్లింలు బీజేపీని ఎంతమాత్రం సమర్థించే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు తమ పార్టీకి తీరని చేటు తెస్తుందని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు.

తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు.. జిల్లాలో బీజేపీ పరిస్థితి దయనీయంగా ఉందనీ, సమైక్యవాదులు ఎంతమాత్రం వారిని అంగీకరించబోరనీ, ఈ పరిస్థితుల్లో నరసరావుపేట నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయిస్తే గెలుపెలా సాధ్యమవుతుందని తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. రెండుసార్లు మంగళగిరి స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించినా కమల దళం పట్టు సాధించలేకపోయిందని వారు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement