చేతిలో అధికారం ఉందనే అహంకారమో, లేకపోతే ఎవరూ ఏం చేయలేరమో అన్న పొగరో తెలీయదు కానీ కుప్పంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు.
కుప్పం: చేతిలో అధికారం ఉందనే అహంకారమో, లేకపోతే ఎవరూ ఏం చేయలేరమో అన్న పొగరో తెలీయదు కానీ కుప్పంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సహా 40 మందికి గాయాలయ్యాయి.
నంద్యాల సభలో వైఎస్ జగన్ మాటలకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కుప్పంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీనికి నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి యత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ వారికి అనుమతినిచ్చి మాకేందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించడంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై విచక్షణా రహితంగా విరుచుకుపడ్డారు. పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.