ఛత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి కోనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది.
విశాఖపట్నం: ఛత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి కోనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఉపరితల ద్రోణి పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రాష్ట్రాల్లో రుతుపవానాలు చురుగ్గా కదులుతున్నాయి. రెండింటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.