శ్రీవారి ఆలయానికి భద్రత కరువు | flight travel on tirumala temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయానికి భద్రత కరువు

Jun 3 2015 10:35 PM | Updated on Oct 2 2018 8:04 PM

శ్రీవారి ఆలయానికి భద్రత కరువు - Sakshi

శ్రీవారి ఆలయానికి భద్రత కరువు

తిరుమల ఆలయంపై గగనతలంలో బుధవారం సాయంత్రం ఓ విమానం వెళ్లింది.

సాక్షి,తిరుమల: తిరుమల ఆలయంపై గగనతలంలో బుధవారం సాయంత్రం ఓ విమానం వెళ్లింది. తిరుమల ఆలయంపై విమానాల రాకపోకలు నిషేధించాలని గతంలోనే టీటీడీ పౌర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసింది. ఆలయ భద్రతను పరిశీలించేందుకు వచ్చిన పార్లమెంటరీ కమిటీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. అయితే, తరచూ విమానాలు తిరుమల ఆలయానికి అతి సమీపంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి.

బుధవారం సాయంత్రం 6.20 గంటలకు ఓ విమానం ఆకాశమార్గంలో తూర్పు నుంచి పశ్చిమదిశగా సరిగ్గా ఆలయం మీదే ప్రయాణించింది. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు టీటీడీని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement