రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Sep 12 2013 3:08 AM | Updated on Jul 11 2019 6:33 PM
చిత్తూరు(అర్బన్), న్యూస్లైన్ : రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా గుడిపాల మండలం, 187-రామాపురంలో చోటు చేసుకుంది. ఒంగోలుకు చెందిన బత్తుల పెద్దకళ్లూరు(26) వేలూరులో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం రామాపురం రైల్వే స్టేషన్ వద్ద రైలు వస్తుంటే ఒక్కసారిగా ప్లాట్ఫామ్ నుంచి పట్టాలపైకి దూకి ఎదురెళ్లాడు. రైలు డ్రైవర్ హారన్ మోగించినా పక్కకు జరగలేదు. రైలు ఢీకొనడంతో బత్తుల పెద్దకళ్లూరు అక్కడికక్కడే మృతి చెందాడు. చిత్తూరు ప్రభుత్వ రైల్వే ఎస్ఐ మహ్మద్బాబా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు, కళాశాల యాజమాన్యానికి సమాచారం అందచేశారు.
Advertisement
Advertisement