చిత్తూరు: సీఎం సొంత జిల్లా చిత్తూరులో ప్రభుత్వం పనులు కల్పించకపోవడంతో ఉపాధి కూలీలు వలస బాట పడుతున్నారు. అరకొర పనులు జరుగుతున్నా కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కొక్కరికి రూ.169 వరకు కూలి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రూ.105కు మించి లభించడం లేదు. కొందరు రూ.60 నుంచి 80తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఉపాధి పనుల కల్పనలో రాష్ట్రంలోనే ముందున్నామంటూ అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో 5.94 లక్షల జాబ్కార్డులు ఉన్నాయి. వీరిలో ఐదు శాతం మందికి కూడా అధికారులు పనులు కల్పిం చడం లేదు. జిల్లాలో 12 క్లస్టర్లు ఉండగా చిత్తూరు క్లస్టర్లో 3,478 మందికి, పుత్తూరు 1,248, నగరి 1,858, శ్రీకాళహస్తి 1,931, తిరుపతి 2,394, చంద్రగిరి 4,001, సదుం 2,551, పీలేరు 4,119, తంబళ్లపల్లె 2,820, మదనపల్లె 1,783, పలమనేరు 4,228, కు ప్పం 3,825 మందికి పనులు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన మొత్తం 34,796 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. మిగిలిన 5.60 లక్షల మందికి పనుల్లేవు. ఒకవైపు వర్షాభావం, మరోవైపు కరువు నేపథ్యంలో అందరికీ పనులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
దీని గురించి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వాస్తవంగా 5.94 లక్షల మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు రూ.169 చొప్పున రోజూ రూ.10,03,86,000 నిధులు వెచ్చించాల్సి ఉంది. అంత మొత్తం దేవుడెరుగు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకైనా లక్ష మందికి రోజుకు రూ.1.69 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోజూ 34,796 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. కనీసం వీరికైనా ఒక్కొక్కరికి రూ.169 కూలి ఇస్తుంటే రూ.58,80,524 నిధులు వెచ్చించాల్సి వచ్చేవి. ప్రస్తుతం రోజూ ఒక్కొక్క కూలీకి రూ.105 లోపు మాత్రమే కూలి లభిస్తోంది.
ఈ లెక్కన రోజుకు ఉపాధి కూలీలకు ప్రభుత్వం రూ.34,53,580 మాత్రమే వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. పనులు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేద లు వలసబాట పట్టారు. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, కుప్పం, పూతలపట్టు తదితర ప్రాంతాల నుంచి ప్రజలు బెంగళూరు, చెన్నైకు వలస వెళుతున్నారు. 80 శాతానికి పైగా బెంగళూరుకు వలస వెళుతుండగా, మిగిలిన 20 శాతం మంది చెన్నై ప్రాంతానికి వెళుతున్నట్లు సమాచారం.
ఉపాధి కరువు !
Published Mon, Feb 9 2015 8:39 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
మృతులందరిది ఒకే కుటుంబం
అప్పులబాధతో ఆర్ఎంపీ బలవన్మరణం
ఫెడరేషన్ క్రీడల్లో వనజారెడ్డికి బంగారు పతకాలు
శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు
జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
ఉత్సాహంగా సర్కారి కిస్తీ
మేమంటే.. మేమే..
తప్పక చదవండి
- వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది: అబ్బయ్య చౌదరి
- అమిత్ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్కు ఈసీ లేఖ
- రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి
- మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
- హైబ్రీడ్ కార్.. ఒక్కసారికి 2000 కిమీ ప్రయాణం
- బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?
- ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
- టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
- Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement