కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి భేటీ ముగిసింది. సోనియాగాంధీతో కిరణ్కుమార్ రెడ్డి సమావేశం సుమారు 45 నిమిషాలు పాటు కొనసాగింది.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి భేటీ ముగిసింది. సోనియాగాంధీతో కిరణ్కుమార్ రెడ్డి సమావేశం సుమారు 45 నిమిషాలు పాటు కొనసాగింది. అయితే సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి తన వాదనలను అధినేత్రికి వినిపించినట్లు సమాచారం. కాగా నిన్న ఆంటోని కమిటీకి దాదాపు గంటపాటు తన వాదన వినిపించిన కిరణ్కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే సమస్యలపై ఎనిమిది పేజీలతో కూడిన నివేదికను వారికి అందించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.విజభన అంటూ జరిపితే సీమాంధ్రలో కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమని కిరణ్కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారని తెలిసింది.