
18 నుంచి ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవా రం గూడూరులో వెల్లడించారు.
- వారంపాటు సభ నిర్వహించే అవకాశం రాజధాని, పెట్టుబడులపై చర్చ: స్పీకర్
సాక్షి, హైదరాబాద్/గూడూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవా రం గూడూరులో వెల్లడించారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే సమావేశాలు 24వ తేదీతో ముగుస్తాయి. సెలవు దినాలతో కలిపి వారం రో జుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ విపక్షం సభను మరికొన్ని రోజులు పొడగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే.. శ నివారం కూడా కొనసాగిస్తారు.
రాజధాని, పెట్టుబడులుపై చర్చ: కోడెల
అసెంబ్లీ సమావేశాల్లో పెట్టుబడులు, రాజధాని నిర్మాణం, పథకాల అమలుపై చర్చ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల తెలిపారు. ఆయన సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్, జపాన్ పర్యటనల గురించి, ఖరీఫ్ పంటలకు సంబంధించిన సమస్యలు, శాంతి భద్రతలు, ఎర్ర చందనం వేలం తదితర అంశాలపైనా చర్చ జరుగనుందని పేర్కొన్నారు.
నేడు అంచనాల కమిటీ సమావేశం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాలు, పీయూసీ కమిటీల సమావేశం మంగళవారం జరగనుంది. ఈ సమావేశంలో అంచనాల కమిటీ ఉద్యానవన శాఖ పనితీరుపై సమీక్షించనుంది.
విద్యుత్, నీరు కట్
ఏపీ ఎమ్మెల్యేల వసతి కమిటీ సమావేశం సోమవారం జరిగింది. సమావేశంలో కమిటీ చైర్మన్ గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ క్వార్లర్లు ఖాళీ చేయని మాజీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు నివాసం ఉంటున్న వాటికి విద్యుత్, నీటి సౌకర్యం నిలిపి వేయాలని నిర్ణయించారు.