-
ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు
చంద్రగిరి: ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును సోమవారం పలువురు ప్రముఖులు వినియోగించుకున్నారు. ఇందులో ఎంబీయూ యూనివర్సిటీ చాన్సలర్, సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్బాబు, సీఈఓ, నటుడు మంచు విష్ణు ఉన్నారు. ఉదయం తమ ఓటు హక్కును ఏ.రంగంపేటలో వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వారు ప్రజలకు సూచించారు. 35 ఏళ్ల తర్వాత పోలింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు సాక్షి టాస్క్ఫోర్స్: పోలింగ్ కేంద్రంలో 35 ఏళ్ల తర్వాత ఏజెంట్ల సమక్షంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగిన ఘటన మండలంలోని భీముని చెరువులో చోటు చేసుకుంది. వివరాలు.. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం స్వగ్రామం భీమునిచెరువులో వార్డు స్థాయి నుంచి ఏ ఎన్నికలు జరిగినా ఏ ఇతర రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉండరు. సోమవారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు పోలీసుల సాయంతో పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును ఆదిమూలం వినియోగించుకున్నారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను చూసి రగిలిపోయారు. తన తనయుడు, జెడ్పీటీసీ సభ్యుడు సుమన్కుమార్ గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడైన భీమునిచెరువు సర్పంచ్ మురుగేశంపై విరుచుకుపడ్డాడు. సొంత ఊర్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కేంద్రంలోకి ఎలా పంపుతారని దుర్భాషలాడాడు. -
నేదురుమల్లితో ఎస్ఐ దురుసు ప్రవర్తన
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి నియోజకవర్గంలో సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వైఎస్సార్సీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వెంకటగిరి పట్టణంలోని అమ్మవారిపేట విశ్వోదయ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చారు. బూత్లోకి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న ఎస్ఐ ప్రసాద్ ఆయనతో దురుసుగా ప్రవర్తించారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో నేదురుమల్లి ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అభ్యర్థినని, పోలింగ్ సరళిని పరిశీలించే హక్కు ఉంటుందని తెలిపారు. తననే బయటకు వెళ్లాలని పేర్కొనడం ఎంత వరకు సబబని, సామాన్య ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎక్కడ ఉంటుందని మండిపడ్డారు. డీఎస్పీ పైడేశ్వరరావు అక్కడికి చేరుకుని నేదురుమల్లికి సర్దిచెప్పారు. దీంతో సమస్య సద్దుమణిగింది. ఎస్ఐ తీరుపై స్థానికులు మండిపడ్డారు. అదేవిధంగా నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మధ్యాహ్నం ప్రాంతంలో రాపూరులోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ సరిళిని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
● రాత్రి వరకు కొనసాగిన ఓటింగ్ ● పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు ● పటిష్టమైన భద్రతతో రీపోలింగ్కు నో చాన్స్ తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో 2,140 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు ఎండను సైతం లెక్కచేయక గంటల తరబడి నిరీక్షించి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఐదు పది నిమిషాల్లోనే అధికారులు ఆ సమస్యను పరిష్కరించారు. ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వచ్చారు. మరోవైపు ఎస్పీ కృష్ణకాంత్పటేల్ అధికారులను సమన్వయం చేసుకుంటూ.. సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించారు. దీంతో రీపోలింగ్ సమస్య లేకుండా ఎన్నికలు సజావుగా పూర్త య్యాయి. 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 78.21 శాతం ఓట్లు పోలవ్వగా.. ఈ సారి సోమవారం రాత్రి 9 గంటల వరకు 72 శాతానికే పరిమితమైంది. బాలాజీ కాలనీలో కలెక్టర్ ఓటు కలెక్టర్ ప్రవీణ్కుమార్ దంపతులు తిరుపతిలోని బాలాజీ కాలనీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి అక్కారంపల్లి పోలింగ్ కేంద్రంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ అదిత్సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలు ఆరంభంలోనే మొరాయించాయి. శ్రీకాళహస్తిలోని శ్రీరామనగర్ కాలనీతోపాటు పలు ప్రాంతాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తాయి. అనంతరం అధికారులు స్పందించి ఈవీఎంలను సరిచేయడంతో పోలింగ్ సజావుగా సాగింది. ఇదే విధంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మాక్ పోలింగ్ సమయం నుంచే ఈవీఎంలు మొరాయించాయి. టెక్నికల్ అసిస్టెంట్లు వాటిని వెంటనే సరిదిద్దారు. కలెక్టరేట్లోని వెబ్కాస్టింగ్ సెంటర్ నుంచి అబ్జర్వర్లు, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్, ఎస్పీ కృష్ణకాంత్పటేల్ పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. అంచనాల్లో అభ్యర్థులు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్4న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. సోమవారం పోలింగ్ ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపోటముల అంచనాల్లో మునిగి తేలుతున్నారు. తాము చేసిన ప్రచారం ఏమేరకు ఫలిస్తుందో? అన్నుకున్న స్థాయిలో ఓట్లు వస్తాయా? రావా ? ఎక్కడైనా పొరపాట్లు జరిగాయా? అన్న అంశాలను లోతుగా విశ్లేషిస్తున్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను పిలిపించుకుని పోలింగ్ కేంద్రాల వారీగా, సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. తిరుపతి తిమ్మినాయుడుపాళెం దళితవాడలో బారులు తీరిన ఓటర్లు గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్రాత్రి 9 గంటల వరకు పోలింగ్ శాతం చంద్రగిరి – 77.79 గూడూరు – 75.68 సత్యవేడు – 82.31శ్రీకాళహస్తి – 78.23 సూళ్లూరుపేట – 79.48 తిరుపతి – 62.30 వెంకటగిరి – 79.20 -
పలకరిస్తూ.. పరిశీలిస్తూ!
పుంగనూరు/పులిచెర్ల (కల్లూరు) : పుంగనూరు కొత్తయిండ్లు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మండుటెండలో ఓటర్లు బారులుతీరిన విషయాన్ని గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను గంటల తరబడి ఎండలో నిలబెట్టడంపై మండిపడ్డారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే ఓటర్లను పోలింగ్ కేంద్రం ఆవరణలోనికి అనుమతించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించారు. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే కల్లూరు ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడ ఓటింగ్ సరళిని పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు మురళీధర్, షుకూర్, షౌకత్అలీ,పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు -
ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం
తవణంపల్లె : మండలంలోని సరకల్లు గ్రామం వద్ద పంటలపై సోమవారం ఏనుగుల గుంపు దాడి చేసి నాశనం చేసినట్లు ఎఫ్ఎస్ఓ జయశేఖర్ తెలిపారు. సమీప అటవీప్రాంతం నుంచి సుమారు 11 ఏనుగులు పొలాల్లోకి చొరబడి రమేష్ అనే రైతుకు చెందిన మామిడి చెట్లు, కంచె, రాతి కూసాలను ధ్వంసం చేశాయన్నారు. అలాగే ఎస్టీ కాలనీకి చెందిన రాణెమ్మ పొలంలో మామిడి చెట్లను విరిచేసినట్లు వెల్లడించారు. రైతు ఎలకారయ్య అరటి చెట్లను నాశనం చేసినట్లు వివరించారు. ఏనుగుల సంచారంపై సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ నేతల దాడి
సైదాపురం : దొంగ ఓట్లు వేస్తుండగా అడ్డుకున్న వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడికి దిగారు. సైదాపురం మండలం 142 పోలింగ్ బూత్లో దళితవాడకు చెందిన కందలి వెంకటేష్ వైఎస్సార్సీపీ ఏజెంట్గా ఉన్నా రు. ఈ బూత్లో ఒకరికి బదులు మరొకరితో ఓటువేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. దాన్ని వెంకటేష్ అడ్డుకున్నారు. దీంతో అతనిపై టీడీపీ నేతలు కక్ష పెంచుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు చెరుకూరి పెద్దమునెయ్య, కందేరి నారాయణ మరికొంత మంది కలసి దాడిచేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు పోలింగ్ కేంద్రం వద్ద నిరసనకు దిగారు. సీఐ, ఎస్ఐ అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. బాధితుడు వెంకటేష్కు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. వేర్వేరు చోట్ల మద్యం పట్టివేత కార్వేటినగరం: వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 432 సీసాల మద్యం పట్టుబడింది. సోమవారం ఈమేరకు ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య వివరాలు వెల్లడించారు. టాటా ఏస్ వాహనంలో మద్యం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి రూ.54 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనం డ్రైవర్ చొక్కా ప్రతాప్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే వెదురుకుప్పం మండలంలోని గోవిందవారిపల్లెకు చెందిన మల్లికార్జున అక్రమంగా నిల్వచేసిన 32 కర్ణాటక మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసునమోదు చేసినట్లు చెప్పారు. దాడుల్లో ఎస్ఐలు నాగరాజు, భారతి, హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ కార్తీక్, ఢిల్లీబాబు పాల్గొన్నారు. -
వైద్యం.. కాదిక భారం
జిల్లాలో అందుబాటులో ఉండే అర్బన్ హెల్త్ సెంటర్లు26 అందుబాటులో ఉన్న వైద్యులుస్టాఫ్ నర్సులు 52టెక్నీషియన్లు 26డేటా ఎంట్రీ ఆపరేటర్లు 26ఫార్మసిస్టులు 26172 రకాలు యూపీహెచ్ సీలో అందుబాటులో ఉండే మందులుల్యాబ్లో చేసే పరీక్షలు మొత్తం 19ల్యాబ్లు 26 -
జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల వివరాలు
పీహెచ్సీలు 62యూపీహెచ్సీలు 26కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 10ఏరియా ఆసుపత్రులు 2 టీచింగ్ ఆసుపత్రి 1పీహెచ్సీల్లో అందుబాటులో ఉండే మందులు 105 రకాలునర్సులు 185పీహెచ్సీల్లో అందుబాటులో ఉన్న వైద్యులు 124టెక్నీషియన్లు 56ల్యాబ్లు : 62 -
ఉద్యోగాలకు రైట్రైట్
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చదువుకుని డ్రైవింగ్ ఫీల్డ్పై ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే 2021లో తిరుపతి అలిపిరి డిపో పరిధిలో ప్రత్యేక డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఇక్కడ 26 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చింది. ఇక్కడ శిక్షణ పొందిన 416 మందికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్లు జారీచేసింది. సర్టిఫికెట్లు పొందిన ప్రతిఒక్కరూ ఏదో ఒకచోట సెటిలయ్యి.. కుటుంబాలకు బాసటగా నిలిచారు.తిరుపతి అర్బన్: తిరుపతిలోని అలిపిరి డిపోలో ఆర్టీసీ నేతృత్వంలో 2021 మార్చిలో డ్రైవింగ్ స్కూల్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అర్హత కలిగిన వారికి 32 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. అలాగే మెకానిజంలోనూ పట్టు సాధించేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో బ్యాచ్కి 16 మంది చొప్పున ఇప్పటి వరకు 26 బ్యాచ్లకు శిక్షణ పూర్తిచేశారు. శిక్షణ పొందిన 416 మందికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ జారీచేశారు. మరో నాలుగు రోజుల్లో 27వ బ్యాచ్కి శిక్షణ ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ‘మస్తు’ శిక్షణ తీసుకుని హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన 416 మందికి ఉద్యోగాలు లభించాయి. ఇందులో 116 మంది తిరుపతి టూ తిరుమల విద్యుత్ బస్సుల్లో పనిచేస్తున్నారు. మరో 120 మందికి జిల్లాలోని 11 డిపోల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్లుగా పనిచేయడానికి అవకాశం కల్పించారు. ఇంకో 105 మంది పక్క రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాలో హెవీ లైసెన్స్లో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉద్యోగాలు చేస్తున్నారు. 25 మంది విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నారు. మొత్తంగా శిక్షణ పొందిన ఎవ్వరూ ఖాళీగా లేకుండా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక్కో జిల్లాకు ఒక్కో డ్రైవింగ్ స్కూల్ రాష్ట్ర ప్రభుత్వం 2021 నుంచి 2024 మార్చి వరకు 25 జిల్లాల్లో 10,400 మందికి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణతోపాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ జారీచేస్తున్నారు. ఒక్క ఆర్టీసీలోనే మూడేళ్లలో డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా 10,400 కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఆర్టీసీ నేతృత్వంలో డ్రైవింగ్ స్కూల్స్లో శిక్షణ తిరుపతి అలిపిరి డిపోలో డ్రైవింగ్ స్కూల్ మూడేళ్లలో జిల్లాలో 416 మందికి హె వీ డ్రైవింగ్ లైసెన్స్లు 236 మందికి స్థానిక ఆర్టీసీ డిపోల్లోనే ఉద్యోగాలు ఇప్పటికే 26 బ్యాచ్లకు శిక్షణ పూర్తి త్వరలో 27వ బ్యాచ్కు శిక్షణ రెండు రోజుల్లో దరఖాస్తులు తిరుపతి అర్బన్: ఇప్పటి వరకు 26 బ్యాచ్లకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం శిక్షణ పూర్తిచేశాం. మరో రెండు రోజుల్లో 27వ బ్యాచ్కి దరఖాస్తులు ఆహ్వానిస్తాం. ఆ మేరకు డిపో మేనేజర్ హరిబాబు కసరత్తు చేస్తున్నారు. అనంతరం శిక్షణ ప్రారంభిస్తాం. శిక్షణ సమయంలో అవసరమైన మేరకు అన్ని వసతులు కల్పిస్తాం. చిన్న పాటి సమస్యలు లేకుండా వారికి ఏర్పాట్లు చేపడుతున్నాం. – రాము, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు చక్కటి అవకాశం హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం తిరు పతిలోని అలిపిరి డ్రైవింగ్ స్కూల్లో చక్కగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో పలువురు ఆర్టీసీలో ఉద్యో గాలు సాధిస్తున్నారు. ఇంకొందరు విద్యుత్ బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నేను ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటున్నాను. ఇక్కడ శిక్షణ ఎంతో బాగుంది. అలిపిరి స్పెషల్ ఏంటంటే డ్రైవింగ్తో మెకానిజంలోనూ శిక్షణ కల్పించడం. ఇది ఎంతో సంతోషాన్నిస్తోంది. –కే.మురళి, గోపికృష్ణ, అలిపిరిలో శిక్షణ పొందినవారు -
పోలీసులకు బొజ్జల వార్నింగ్
ఉద్యోగాలకు రైట్రైట్ తిరుపతి అలిపిరి డ్రైవింగ్ స్కూల్లో ప్రవేశాలకు సమయం ఆసన్నమైందని నిర్వాహకులు తెలిపారు. వైద్యం..కాదిక భారం వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. పేదలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది. జిల్లాలో టీడీపీ రౌడీమూకలు రెచ్చిపోయారు. ఎన్నికల వేళ ఓటమి భయంతో కూటమి నేతలు దాడులకు తెగబడ్డారు. చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తినాని అరాచకాలు సృష్టించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి కారును కాల్చేసి, అనుచరులపై రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. అడ్డుకునేందుకు యత్నించిన బీఎస్ఎఫ్ జవాన్పైనా దాడి చేసి రాక్షసానందం పొందారు. ఇక శ్రీకాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు. మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2024– 8లో16 నుంచి శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి 24వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం చేపట్టే అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరగనున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో రోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వామి వారి వాహన సేవలు శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజు 16న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహన సేవలు జరగనున్నాయి. 17న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 18న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 19న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనంపై స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 20వ తేదీ ఉదయం పల్లకీ సేవ, రాత్రి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. 21న హనుమంత వాహనం, గజ వాహనం, 22న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. 23న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహన సేవ, 24న ఉదయం చక్రస్నానం, రాత్రి చేపట్టే ధ్వజావరోహణంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆకట్టుకున్న మోడల్ పోలింగ్ కేంద్రాలు తిరుపతి సిటీ: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాలు ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పింక్ కలర్ బెలూన్స్తో ఏర్పాటు చేసిన మహిళా యూనివర్సిటీలోని మోడల్ పోలింగ్ కేంద్రాన్ని చూసేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. ‘ఓటరుగా నేను గర్విస్తున్నా’ అనే స్లోగన్తో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టర్ను ఓటర్లు నిశితంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రశాంతతో పాటు ఓటర్లను ఆకట్టుకునే విధంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులను ఈ సందర్భంగా ఓటర్లు అభినందించారు. ఇటువంటి మోడల్ కేంద్రాలను నగరంలోని ఎస్వీయూ క్యాంపస్ స్కూల్, ఎస్పీజేఎన్ఎమ్ కార్పొరేషన్ పాఠశాలలో సైతం అధికారులు ముస్తామబు చేశారు. సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారంతా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటేసి రుణం తీర్చుకునేందుకు ఎదురుచూశారు. లబ్ధిదారుల ఎదురుచూపులకు సమయం వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంని చేసుకునేందుకు ప్రజలు సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద వేచి ఉండడాన్ని చూసిన కూటమి నేతలు షాక్కు గురయ్యారు. ఎన్నడూ లేని విధంగా వేకువ జాము నుంచే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలిరావడాన్ని జీర్ణించుకోలేని కూటమి నేతలు విధ్వంసం సృష్టించాలని నిర్ణయించుకున్నారు. పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు వెంటనే రంగంలోకి దిగాలని ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలకు ఆదేశాలు జారీచేశారు. టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు తెగబడ్డారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు జెడ్పీ హైస్కూల్లో వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్, నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు రాళ్లు, కర్రలతో దాడికి యత్నించారు. పోలీస్టేషన్ బయట ఉన్న టీడీపీ అభ్యర్థి పాశం సునీల్కుమార్ తన అనుచరులతో కలిసి నినాదాలు చేస్తూ.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఫలితంగా ఓటర్లు పోలింగ్ స్టేషన్లోకి వెళ్లకుండా వెనక్కు వెళ్లిపోయారు. కూటమి నేతలు కుట్రలను దిగ్విజయంగా అమలు చేశారు. చంద్రగిరిలో కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు చంద్రగిరిలో ఓటమి భయంతో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటాక కూడా తన అనుచరులతో అరాచకాలను కొనసాగించారు. రామచంద్రాపురం మండలం, బ్రాహ్మణకాలువ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేసేందుకు అడ్డుగా ఉన్న దళిత ఏజెంట్లపై దాడిచేశారు. అంతటితో ఆగకుండా బ్రాహ్మణకాలువ దళితవాడపై టీడీపీ అల్లరి మూకలు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ అల్లర్లను అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్ జవాన్ ప్రయత్నించారు. అతనిపైనా టీడీపీ నేతలు దాడిచేశారు. దీంతో గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి హుటాహుటిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరిగి ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. చంద్రగిరి మండలం, కాసిపెంట్ల వద్ద (హెరిటేజ్ సంస్థ ఉన్న ప్రాంతం) టీడీపీ శ్రేణులు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని స్వతంత్ర అభ్యర్థి రాజశేఖర్ (ఏజెంట్ కూడా ఇతనే) అభ్యంతరం వ్యక్తం చేసినందుకు పోలింగ్ ముగిశాక దాడిచేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి రాజశేఖర్ దాడిచేసిన వారిపై, పీఓపై చర్యలు తీసుకోవాలని పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. అదేవిధంగా కూచువారిపల్లెలో సోమవారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానితోపాటు తన అనుచరులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి వాహనంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి పరిధిలోని కందులవారిపల్లెలోనూ టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ ఏజెంట్పై దాడికి పాల్పడ్డారు. పాకాల మండలం, ఆదినపల్లి పోలింగ్ బూత్లో వైఎస్సార్సీపీ ఏజెంట్ అనిల్కుమార్పై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు పులివర్తి వినిల్, అనుచరులు కలిసి దాడి చేశారు. అనిల్కుమార్కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి దాడులకు తెగబడ్డవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఇంటిపై దాడి.. ధ్వంసం సోమవారం రాత్రి కూచువారిపల్లెలోని సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై సుమారు 500 మందికిపైగా టీడీపీ గూండాలు మూకుమ్మడిగా దాడిచేసి ఇంటిని ధ్వంసం చేశారు. ఆపై ఎడ్ల బండ్లను సైతం తగులబెట్టారు. – 8లోన్యూస్రీల్ జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు చంద్రగిరి, గూడూరులో అల్లర్లకు యత్నం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని దాష్టీకం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్రెడ్డి వాహనం ధ్వంసం గూడూరులో పెట్రోలు, డీజిల్ చల్లి నిప్పుపెట్టేందుకు స్కెచ్ చంద్రగిరి పరిధిలో దళిత ఏజెంట్లపై కమ్మ సామాజిక వర్గం నేతల దాడి అడ్డుకునేందుకు యత్నించిన బీఎస్ఎఫ్ జవాన్పైన దాడి చేసిన టీడీపీ నేతలు కొట్టాల చంద్ర ఇల్లు ధ్వంసం మీ అంతు చూస్తానంటూ పోలీసులకువార్నింగ్ ఇచ్చిన బొజ్జల సుధీర్రెడ్డి శ్రీకాళహస్తిలో ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు బొజ్జల సుధీర్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అల్లరి మూకలు చేసిన గొడవలకు ఆజ్యం పోసేలా బొజ్జల పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. బొజ్జల అండ చూసుకున్న టీడీపీ అల్లరి మూకలు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి యత్నించారు. వారిని సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన పోలీసుపై బొజ్జల విరుచుకుపడ్డారు. ‘ఏయ్ పోలీస్.. నీ అంతు చూస్తా’ అంటూ వేలుచూపిస్తూ హెచ్చరించారు. అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఓటు వేసుకునేందుకు అవకాశం లేకుండా అడుగడుగునా అడ్డుపడుతూ గందరగోళం సృష్టించారు. ఏర్పేడు మండలం, గుండ్లకండ్రిగ, చెన్నంపల్లి పోలింగ్ బూత్లో టీడీపీ ఏజెంట్లు వైఎస్సార్సీపీకి ఓటువేసేందుకు వచ్చిన వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ బూత్లో టీడీపీ శ్రేణులు, ఏజెంట్లు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తూ ఓటింగ్ శాతాన్ని తగ్గించే కుట్రలు చేశారు. అయినా కూటమి అల్లర్లు, ఆగడాలు, దౌర్జన్యాలు, దాడులను దాటుకుని ఓటర్లు తమ సత్తా చాటుకున్నారు. దీంతో జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం -
● ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన జగన్ ప్రభుత్వం ● కొత్తగా అందుబాటులో విలేజ్ హెల్త్ క్లినిక్స్ ● ఆధునిక సౌకర్యాలతో హెల్త్ సెంటర్లు ● పరిపుష్టిగా వైద్యులు, వైద్య సిబ్బంది, మందులు ● హెల్త్ సెంటర్లలో పూర్తి స్థాయిలో ల్యాబ్లు ● మందుల కొరత నిల్
తిరుపతి తుడా: వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పేదలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వైద్య రంగం ముఖ చిత్రాన్నే మార్చివేశాయి. టీచింగ్ ఆసుపత్రులు మొదలు అర్బన్, విలేజ్ హెల్త్ సెంటర్లను పరిపుష్టం చేసింది. వైద్యరంగ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా పూర్తిస్థాయి వైద్యులు, వైద్యసిబ్బంది నియామకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రోగులకు ఇచ్చే మందులు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. రోగులకు రక్తపరీక్షలు చేయడానికి ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్లు తెచ్చారు. అంతటితో ఆగక ప్రభుత్వం ఇళ్ల వద్దకే వైద్యసేవలు అందించేందుకు 2022లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’, ‘ఫ్యామిలీ ఫిజీషియన్’ అమలుకు శ్రీకారం చుట్టింది. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో 2000 ఇళ్ల పరిధిలో 2 మెగా హెల్త్ క్యాంపులను నిర్వహించి అన్ని రకాల ప్రాధమిక వైద్యపరీక్షలు చేసింది. ఫలితంగా వైద్యం కోసం గ్రామీణులు వ్యయ ప్రయాసలకోర్చి మండల కేంద్రాలకు వచ్చే అగత్యం తప్పింది. భవిష్యత్లో వీటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయని, దీర్ఘకాలిక వ్యాధులకు ఆదిలోనే చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెప్పారు. వైద్య రంగంలో చారిత్రక నిర్ణయం దేశంలో మరెక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఆరోగ్య సురక్ష , ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం సత్ఫలితాలను ఇచ్చాయి. స్థానికంగానే ప్రజలకు చేరువై మెరుగైన వైద్యం అందుతుండంతో రోగులకు ఆర్థిక భారం తప్పింది. 2022లో ప్రారంభమైన ఈ 2 ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ఇంటింటికీ వెళ్లి వైద్యసేవలను తీసుకెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 2 పర్యాయాల ఆరోగ్య సురక్ష ద్వారా లక్షలాదిమందికి వైద్యసేవలను అందించారు. జనరల్ ఫిజిషియన్, ఆర్థో, గైనిక్, సీ్త్రల వైద్యనిపుణులు ఆరోగ్యసురక్ష కేంద్రానికి వెళ్లి స్థానికంగా ప్రజలకు వివిధ వైద్యపరీక్షలు నిర్వహించారు. రోగుల ఆరోగ్య వివరాలను డేటాల రూపంలో నిక్షిప్తం చేశారు. భవిష్యత్లో ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందో ముందే గ్రహించి వారిని అప్రమత్తం చేస్తున్నారు. హెల్త్ డేటా ఆధారంగా వారికి అవసరమైన మందులు అందజేస్తున్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి వేగంగా విస్తరిస్తోంది. కానీ ఆ స్థాయిలో వైద్య సౌకర్యాలు పెరగలేదు. కార్పొరేట్ ఆస్పత్రులున్నా పేదలకు పెనుభారంగా మారుతున్నాయి. ఆర్థిక సమస్యలతో పలువురు ప్రాణాలమీదికి తెచ్చుకునే పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. పేదలకు కార్పొరేట్ తరహా ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. విస్తరిస్తోన్న జనాభాకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. అదనంగా ఏడు పీహెచ్సీలు, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు.ఇప్పటికే విశాఖ, తిరుపతి నగరాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి పట్టణవైద్యాన్ని మరింత మెరుగుపరిచింది. తిరుపతిలో వైద్యం ఇలా ... తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేద, మధ్య తరగతి ప్రజలు అధికం. ఆధ్యాత్మిక నగరానికి వలసజీవుల సంఖ్య పెరుగుతోంది. వీరి ఆరోగ్యానికి తగ్గ స్థాయిలో యూపీహెచ్సీ సెంటర్లు లేవు. ఇరవైయేళ్ల క్రితం అవసరాలకు తగ్గట్టుగా నిర్మించిన యూపీహెచ్సీలే ఇప్పటికే పెద్ద దిక్కుగా ఉండేవి. తిరుపతి నగరం ఎంతగానో విస్తరించినా నాడు అందుబాటులో 9 హెల్త్ సెంటర్లు మాత్రమే ఉండేవి. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం తిరుపతికి మరో 6 హెల్త్ సెంటర్లు అవసరమని మంజూరు చేసింది. ఇటీవల కాలంలో 4 అర్బన్ హెల్త్సెంటర్లు ప్రారంభించారు. ఒక్కో సెంటర్ను రూ.90లక్షలతో ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు పట్టణ పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కో అర్బన్ సెంటర్లో రిసెప్షన్, డాక్టర్ చాంబర్, ల్యాబ్ మెడికల్ స్టోర్, మెడికల్ వార్డు, రెండు టాయ్లెట్లు, విశ్రాంతగదులు ఉండేలా వీటిని నిర్మించారు. అత్యాధునిక డయాగ్నోస్టిక్ సెంటర్ రాయలసీమలో వైద్యరంగానికి తిరుపతి కేంద్రబిందువుగా ఉంటోంది. వివిధ ఆరోగ్యసమస్యలతో రోజూ వందలాది మంది తిరుపతికి వస్తుంటారు. రాయలసీమ పెద్దాసుపత్రిగా సేవలందిస్తున్న తిరుపతి రుయాలో రోజూ సగటున 1200 మంది వరకూ ఓపీ సేవలకు వస్తుంటారు. అర్బన్ హెల్త్సెంటర్లలో మరో 800 వరకు ఓపీ సేవలకు వస్తున్నారు. వ్యాధి నిర్థారణకోసం ప్రస్తుతం అర్బన్ హెల్త్సెంటర్లలో 19 రకాల పరీక్షలు, రుయాలో అదనంగా మరిన్ని రక్తపరీక్షలు చేస్తున్నారు. ఖరీదైన, మరిన్ని వైద్యపరీక్షలను నిర్వహించే వ్యవస్థను 2022లో ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల్లోని మహానగరాలకు వెళ్లి పరీక్షలు చేయించుకునే అవసరం లేకుండా అత్యాధునిక సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్ను రూ.3కోట్లతో రుయా ప్రాంగణంలో నిర్మించారు. ఇది మరో రెండుమూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. అన్నిరకాల రక్తపరీక్షలతో పాటు ఎక్స్రేతోపాటు ఎంఆర్ఐ, సీటీ, మూలగ మార్పిడి..ఇత్యాది ఖరీదైన వైద్యపరీక్షలను ఇక ప్రజలు ఉచితంగా పొందనున్నారు. తిరుపతిలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష క్యాంపులో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న మేయర్ శిరీష (ఫైల్) గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్లు విలేజ్ హెల్త్ క్లినిక్స్ వివరాలు గ్రామీణులకు సంజీవినిగా హెల్త్ క్లినిక్లు రాష్ట్రంలో తొలిసారిగా విలేజ్ హెల్త్ క్లినిక్లు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో క్షేత్రస్థాయిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ ఏవైనా అనారోగ్య సమస్యలు గుర్తిస్తే విలేజ్ హెల్త్ క్లినిక్లలో ప్రాధమిక వైద్యం అందిస్తారు. కొంచెం తీవ్రమైన వ్యాధులను గుర్తిస్తే వారిని ఏరియా ఆసుపత్రులు లేదా జిల్లా అసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వైద్యులు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. తిరుపతి జిల్లాకు ఏకంగా 439 విలేజ్ హెల్త్ క్లినిక్లు మంజూరయ్యాయి. కొన్ని సొంత భవనాల్లో (ప్రభుత్వ భవనాల్లో) వీటిని నిర్వహిస్తుండగా 385 కొత్త భవనాలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో ఇప్పటికే 102 విలేజ్ హెల్త్ క్లినిక్స్ భవనాలను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చింది. మిగిలిన భవన నిర్మాణాలు వివిధ దశల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రెండు వైద్య సేవల కార్యక్రమాల ద్వారా తిరుపతి జిల్లా వ్యాప్తంగా లక్షలాదిమందికి వైద్య పరీక్షలు చేస్తున్నారు.పట్టణవైద్యం మరింత మెరుగు తిరుపతి నగరంలో 6 అర్బన్ హెల్త్ సెంటర్ల మంజూరు ఇందులో అందుబాటులోకి 4 యూపీహెచ్సీలు రుయాలో అత్యాధునిక సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్ -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 70,815 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.16 కోట్లుగా లెక్క తేలింది. -
తగ్గించే కుట్ర!
ఆకర్షిస్తున్న పోలింగ్ కేంద్రాలు తిరుపతిలో పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. బెలూన్లు, రకరకాల షామియానాలు ఏర్పాటు చేశారు.సార్వత్రిక ఎన్నికలకు పటిష్ట భద్రతఓటింగ్ శాతం ● 4,500 మంది పోలీసులు, కేంద్ర బలగాలతో నిఘా ● 286 రూటు మొబైల్ పార్టీలతో గస్తీ ● సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు ● ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ● జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ● ఓటర్లను భయభ్రాంతులకు గురుచేసేందుకు ఎల్లో మీడియా భారీ స్కెచ్ ● నేడు సోషియల్ మీడియా, టీవీల వేదికగా అసత్య ప్రచారాలు చేసే అవకాశం ● పాస్లు లేనివారిని పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఎస్పీకి వినతి ● ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలంటున్న ఎస్పీ సోమవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2024సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు దేశవిదేశాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఉద్యోగం.. ఉపాధి కోసం ఎక్కడెక్కడో స్థిరపడిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఐదేళ్లలో మారిన తమ ఊర్ల రూపురేఖలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ ఇంతటి అభివృద్ధిని చూడలేదని హర్షాతిరేకాలు వెలిబుచ్చుతున్నారు. తాము చదివిని బడి ఇప్పుడు కార్పొరేట్ హంగులతో కనువిందు చేయడంపై ఆనందపడుతున్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు ఆర్థికంగా పుంజుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సకల సేవలను ఇంటి ముంగిటకే తీసుకువచ్చిన ప్రభుత్వ పనితీరుపై అభినందనలు కురిపిస్తున్నారు. పొరబాట్లకు తావివ్వొద్దు తిరుపతి అర్బన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా పొరబాట్లకు తావివ్వొద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఆయన జిల్లాలోని అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవీఎంల పరిశీలన శ్రీకాళహస్తి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని స్కిట్కళాశాలలోని ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ ప్రవీణ్కుమార్ పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లాలో 2,140 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 690 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవిశంకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్బాబు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూ ఏటీసీ సర్కిల్ వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 76,945 మంది స్వామివారిని దర్శించుకోగా 33,844 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.67 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శ న టిక్కెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. నేడు ఎస్వీ జూకు సెలవు తిరుపతి మంగళం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతుప్రదర్శనశాల(ఎస్వీ జూపార్క్)కు సెలవు ప్రకటించారు. సోమవారం ఎన్నికల పోలింగ్ దృష్ట్యా జూలోకి సందర్శకుల అనుమతి లేదని జూ క్యూరేటర్ సెల్వం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి యథావిధిగా జూ సందర్శన ఉంటుందని తెలిపారు. బస్..రష్ తిరుపతి అర్బన్: ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ సర్వీసులు రద్దీగా మారాయి. జిల్లాలో 905 ఆర్టీసీ బస్సులుండగా.. అందులో 505 సర్వీసులను ఎలక్షన్కు కేటాయించారు. మిగిలిన 400 బస్సుల్లో 250 బస్సులు తిరుపతి–తిరుమలకు నడుస్తున్నాయి. మిగిలిన 150 బస్సులు మాత్రమే జిల్లాలో నడుస్తున్నాయి. బతుకు దెరువు కోసం పట్టణాలకు వలస లొచ్చిన వారంతా తమ ఓటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో ఆ ప్రాంతాలకు ఓటు వేయడానికి క్యూకట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ సర్వీసులు అవసరంమేరకు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. ఇదేఅదునుగా ప్రైవేటు వాహనదారులు రెట్టింపు ధరలకు ప్రయాణికులను దోచుకునేపనిలో పడ్డారు. తిరుపతి జిల్లా, పాకాల మండలం, అచ్చమ్మఅగ్రహారం పాఠశాలలో నేడు పరిస్థితి తిరుపతి జిల్లాలో సంక్షేమ సమాచారం మొత్తం జనాభా 20,05,942అభివృద్ధి అమోఘం ● ఎన్నికల వేళ సొంతూరికి వచ్చిన స్థానిక ఓటర్లు ● మారిన ఊర్లను చూసి ఆశ్చర్యం ● తాము చదివిన బడిని చూసి ఆనందం ● ఇది కదా అభివృద్ధి అంటూ అభినందనలు ● మేలు చేసిన వారికే ఓటేస్తామని స్పష్టీకరణ చిత్తూరు కలెక్టరేట్ : కోవిడ్ మహమ్మారి మూడేళ్ల పాటు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఆ వైరస్ దెబ్బకు ప్రజలు భీతిల్లిపోయారు. ఇంటికి వచ్చి తమ తల్లిదండ్రులను చూసుకుందామని విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన పిల్లలు అనుకున్నప్పటికీ సొంత గ్రామాలకు రాలేని పరిస్థితి. అలాంటి విపత్కర వేళలో ప్రస్తుత సర్కారు సహాయక చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లు ఏర్పాటు చేసింది. 35,67,999 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. పాజిటివ్ కేసులకు ఆర్థిక సహాయం చేసింది. కోవిడ్ సెంటర్ల నిర్వహణకు రూ.53.8 కోట్లు వెచ్చించింది. వైద్యసిబ్బంది కోసం 20 కోట్లు ఖర్చు చేసింది. యుద్ధప్రాతిపదిక కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయించింది.ఈ క్రమంలోనే పకడ్బందీగా సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఈ ఐదేళ్లలో చిత్తూరు జిల్లావ్యాప్తంగా 28,13,013 మందికి రూ.8,635.23 కోట్లు, నాన్ డీబీటీ పద్ధతిలో 5,78,015 మందికి 2,750.71 కోట్లు ఖర్చు చేసింది. తిరుపతి జిల్లాల్లో 28,50,798 మందికి డీబీటీ పద్ధతిలో 8,552.69 కోట్లు, నాన్ డీబీటీ పద్ధతిలో 34,49,551 మందికి రూ.3,401.89 కోట్లు వెచ్చించింది. బడులు మారిపోయాయ్! ఓట్ల పండుగకు గ్రామాలకు విచ్చేసిన వారు గతంలో తాము చదివిన బడులను చూసి సర్కారు పాఠశాలలు ఇంతలా మారాయా అని ముక్కున వేలేసుకుంటున్నారు. తాము చదివే రోజుల్లో ఎలాంటి సౌకర్యాల్లేవని వారు వెల్లడిస్తున్నారు. అప్పట్లో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఇలాంటి వసతులు ఉండేవని గుర్తుచేసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి పిల్లలకు సర్కారు బడుల్లో ఉచితంగా కార్పొరేట్ విద్యను అందివ్వడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు. వలంటీర్ల సేవలు బాగున్నాయ్! కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రస్తుత ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడం అద్భుతమని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో తమ తల్లిదండ్రులను కంటికి రెప్పలా వలంటీర్లు కాపాడారని ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన ఇక్కడి ఓటర్లు వెల్లడిస్తున్నారు.ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా వలంటీర్ వ్యవస్థను తీసుకురావడంపై అభినందనలు కురిపిస్తున్నారు. ఇలాంటి విప్లవాత్మకమైన పథకాలతో అండగా నిలిచిన వారికే తమ మద్దతని స్పష్టం చేస్తున్నారు. ఓటుతో కడిగేస్తాంప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకుని కుళ్లు రాజకీయాలను కడిగేయాలి. యువతకు, ప్రజలకు మేలు చేసే నాయకులను ఎన్నుకోవాలి. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని చెప్పిన మాట.. నిరుపేదల సంక్షేమం కోసం.. పాటుపడే మంచి నాయకున్ని ఎన్నుకునే తరుణం వచ్చింది. అందరూ సన్నద్ధం కండి. – ఆవుల శరణ్య, విద్యార్థిని, సైదాపురం మా పాఠశాలను చూస్తే ఆశ్చర్యమేస్తోంది నేను మొదటి సారిగా ఓటు హక్కును వినియోగించుంకుంటున్నాను. మా అమ్మ ప్రోత్సాహంతో కష్టపడి నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను. గతంలో మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే నా చదువు సాగింది. గత ప్రభుత్వ హయాంలో మా పాఠశాల చాలా దుర్భరంగా ఉండేది. కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. అయితే ప్రస్తుత ప్రభుత్వం మా పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దింది. ఆహ్లాకదరమైన వాతావరణం, మినరల్ వాటర్, క్లాస్ రూంలో బెంచీలు, డిజిటల్ క్లాసులు, ఇంగ్లిష్ మీడియం ఇలా ఒకటేమిటి అనేక విధాలుగా అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది. మా గ్రామంతో పాటు పాఠశాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి అండగా నిలవాలనుకుంటున్నాను. – మౌనిక, కొటాల, చంద్రగిరి మండలం కరోనా నుంచి కాపాడారు ఈ ప్రభుత్వం కరోనా మహమ్మారి నుంచి మా ప్రాణాలను కాపాడింది. నా భర్త వికలాంగుడు కావడంతో నేను ఓ ప్రైవేటు కళాశాలలో దినసరి కూలీగా పనిచేస్తూ, ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాను. రోజూ కూలీ పనికి పోతేగాని పూటగడవని పరిస్థితి. అలాంటి సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో లాక్డౌన్ విధించారు. ముగ్గురు పిల్లలు, భర్తను ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో ఈ ప్రభుత్వం మాకు అండగా నిలిచింది. మేము ఉన్నామంటూ భుజం తట్టి భరోసా ఇచ్చింది. నిత్యావసర సరుకులు, మందులు, కోడిగుడ్లు, ఆర్థిక సాయం అందిస్తూ మా ప్రాణాలను కాపాడింది. ఇక బతకలేము అనుకున్న సమయంలో మాకు తోడుగా నిలిచిన ఈ ప్రభుత్వానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. విపత్కర సమయంలోనూ సంక్షేమ పథకాలను క్రమం తప్పకుండా అందిస్తూ మాకు ఆర్థిక భరోసాను కల్పించిన ఈ ప్రభుత్వాన్ని జీవితంలో మురువలేము. – కే.నీలా, కొటాల, దళితవాడ, చంద్రగిరి మండలంమా మంచి కోరిన వారికే మద్దతు మా మంచి కోరిన వారికే మద్దతు ఉంటుంది. ప్రతి సంక్షేమ పథకం ఇంటి వద్దకే వచ్చి మాకు అన్ని విధాలుగా ప్రస్తుత ప్రభుత్వం అండగా నిలిచింది. సకాలంలో రైతులను ఆదుకోవడంతో పాటు విద్యావ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చింది. ఇంటి వద్దకే వైద్యాధికారులు వచ్చి మా బాగోగులు చూస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ, ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నా. మనం ఐదు నిమిషాల్లో వేసే ఓటు, మన ఐదేళ్ల భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. – ఆనంద్, అరిగెలవారిపల్లి, పనపాకం పంచాయతీ, చంద్రగిరి మండలం ప్రాణాలు కాపాడింది కరోనా బారిన పడినప్పుడు కుటుంబ సభ్యులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి కష్ట సమయాల్లో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, పేదల ప్రాణాలు కాపాడింది. కరోనా బాధితులు గడప దాటకుండానే వలంటీర్లు, వైద్య సిబ్బందిని ఇంటికే పంపించింది. అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించింది. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉటాం. – గూటూరు హాజరత్, ఎన్ఎస్ఆర్ కాలనీ, నాయుడుపేట మానవత్వం చాటుకున్న ప్రభుత్వమిది కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం చూపిన మానవత్వం ప్రజల మన్ననలు చూరగొంది. రెండేళ్లు ఆర్థిక ఇబ్బందులు కలిగినా సంక్షేమాన్ని 100 శాతం అమలు చేసింది. కరోనాను సాకుగా చూపి సంక్షేమాన్ని ఆపలేదు. నిత్యావసరకులు, మందులు ఆర్థిక సహాయాన్ని సైతం నేరుగా ఇంటికే పంపించారు. ప్రభుత్వం చూపిన చొరవ, అవగాహనతో లక్షలాది మందికి ప్రభుత్వ సహాయ, సహకారాలు అందాయి. సకాలంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచడం వల్ల వేలాది మంది ప్రాణాలు కాపాడి, ప్రాణ భిక్ష పెట్టారు. – డీ.లక్ష్మయ్య, బీసీ సంఘ నాయకుడు అభివృద్ధిలో 49 ఏళ్లు ముందుకు ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధితో తిరుపతి మరో 49 ఎళ్లు ముందుకు వెళ్లింది. అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. గత పాలకులు తిరుపతికి వచ్చిన ప్రతిసారీ గ్రీన్ సిటీ, మెడికల్ హబ్, హెల్త్ హబ్, ఐటీ హబ్.. ఇలా నోటికొచ్చిన పేర్లతో అభివృద్ధి చేస్తానని మాయ మాటలు చెప్పి వెళ్లారు. కానీ ఏ ఒక్కటీ అమలు కాలేదు. గడిచిన ఐదేళ్లలో తిరుపతిలో వందలాది కోట్లతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి ఫలాలను నగర ప్రజలు కళ్లారా చూస్తున్నారు. రోడ్లు, యూడీఎస్, కాలువలు, డ్రైన్లు ఇతర మౌలిక వసతుల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్పరంగా ఇప్పుడు జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు. తిరుపతి భవిష్యత్తుపై అవగాహన ఉన్న మంచి నాయకున్ని ఎన్నుకుందాం. – టీ.దాసు, దళిత సంఘ నాయకుడు – 8లో– 8లోన్యూస్రీల్కుటుంబాలు 7,09,483ఇంటి వద్దకే వైద్యసేవలు చక్కగున్నాయ్! ఇంటి వద్దకే వైద్యమా ఇలాంటి సౌకర్యం ఎక్కడా లేదే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో సైతం ఇలాంటి సౌకర్యం లేదని వెల్లడిస్తున్నారు. గతంలో ప్రభుత్వాస్పత్రికి వెళితే కనీసం మందులు కూడా ఉండేవి కావని, ఇప్పుడు ఇంటికే ఫ్యామిలీ కాన్సెప్ట్ కింద వైద్యులు వస్తున్నారని వివరిస్తున్నారు. ఇంత మేలు చేసిన ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమని, పేదలకు ఇలాంటి పాలకులే కావాలని స్పష్టం చేస్తున్నారు. లబ్ధిపొందిన ఫ్యామిలీలు 6,33,898మేలు చేకూరిన వారు 10,34,611డీబీటీలో ఖర్చు చేసిన మొత్తం రూ.8,552.69 కోట్లు నాన్ డీబీటీలో వెచ్చించి మొత్తం రూ.3,401.89 కోట్లు -
జిల్లా సమాచారం
నియోజకవర్గం ఓటర్లు గూడూరు 2,45,205 సూళ్లూరుపేట 2,42,610 వెంకటగిరి 2,43,582 చంద్రగిరి 3,15,159 తిరుపతి 3,02,503 శ్రీకాళహస్తి 2,48,536 సత్యవేడు 2,15,385 మొత్తం ఓటర్లు 18,12,980జిల్లాలో ఎన్నికల బరిలో నియోజకవర్గం అభ్యర్థులు తిరుపతి పార్లమెంట్కు 23 తిరుపతి అసెంబ్లీకి 46 చంద్రగిరి అసెంబ్లీకి 24 శ్రీకాళహస్తి అసెంబ్లీకి 15 సత్యవేడు అసెంబ్లీకి 15 గూడూరు అసెంబ్లీకి 14 వెంకటగిరి అసెంబ్లీకి 10 సూళ్లూరుపేట అసెంబ్లీకి 09 -
No Headline
తిరుపతి క్రైమ్: రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ట భద్రత నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 4500 మంది పోలీసులు కేంద్ర బలగాలతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పూర్తి భద్రత మధ్య ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. భద్రత కోసం కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల నుంచి పోలీస్ సిబ్బంది జిల్లాకు వచ్చారన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించామని ఆ ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ.. పూర్తి భద్రత చేపట్టామన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ఆంక్షలను పక్కాగా అమలు చేస్తామని ఓటర్లు తప్పనిసరిగా 100 మీటర్ల దూరంలోనే ఉండాలన్నారు. కేవలం ఓటు హక్కు వినియోగించుకునే వారు మాత్రమే వారు ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లాలన్నారు. 286 రూటు మొబైల్ పార్టీలతో గస్తీ 286 రూట్ మొబైల్ పార్టీతో గస్తీ నిర్వహిస్తున్నట్లుగా ఎస్పీ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చెక్పోస్టుల వద్ద కూడా అదనపు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ముందురోజు నుంచే 144 సెక్షన్ అమల్లో ఉంచామని తెలిపారు. శాంతి భద్రతలకు విగాతం కలిగితే సహించేది లేదని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గత ఎన్నికల్లో తీసుకున్న విధివిధానాలను పరిశీలించి ఈ ఎన్నికల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. సమస్య ఉంటే తక్షణమే ఫిర్యాదు చేయండి పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్యలు తలెత్తిన అతిక్రమణలకు పాల్పడిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రజలంతా కూడా ఇలాంటి సంఘటనలు చూసిన సమయంలో డయల్ 100, పోలీస్ వాట్పాప్ నంబర్ 8099999977 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన తిరుపతి జిల్లా పరిధిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ పరిశీలించారు. ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీయూ క్యాంపస్ హైస్కూల్లో పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ అనంతరం అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. -
No Headline
సాక్షి, తిరుపతి: పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఎల్లోమీడియా భారీ స్కెచ్ వేసింది. కుట్రలో భాగంగా సోమవారం పోలింగ్ రోజున సోషియల్ మీడియా, టీవీ షోషల్ మీడియాల్లో పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు చేసేందుకు ప్రణాళిక రచించింది. ఈ మేరకు వారి యాజమాన్యాల నుంచి కూటమి నాయకులకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు పక్కా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఎవరు భయపెట్టినా బయపడాల్సిన పనిలేదని.. స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించే యత్నం ఎన్నికల నిబంధనల ప్రకారం ఇప్పటికే అధికారుల అనుమతి పొంది పాస్లు ఉన్న వారికి మాత్రమే పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోకి మీడియాను అనుమతిస్తారు. కానీ మీడియా పాస్లు లేకపోయినా పోలింగ్ కేంద్రాలలోకి ప్రవేశించి అల్లర్లు సృష్టించేందుకు ఎల్లోమీడియా ప్రతినిధులు, సిబ్బంది యత్నించనున్నట్లు తెలుస్తోంది. కుట్రలో భాగంగానే పాస్లు లేని వారిని సైతం పోలింగ్ కేంద్రాలలోకి అనుమతించాలని ఆదివారం జిల్లా ఎస్పీని కలిసి విన్నవించడం దీనికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ‘ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి మీడియా పాత్రపై ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి మీడియా ప్రతినిధులకు కచ్చితంగా ఎన్నికల అధికారి ఇప్పటికే పాస్లు జారీచేసి ఉంటారు’అని ఎస్పీ ఎల్లో మీడియాకు తెలియజేశారు. పాస్లు లేకుంటే ఎట్టిపరిస్థితిలో పోలింగ్ కేంద్రాలలోకి అనుమతించమని, ఇందులో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని ఎల్లో మీడియాకు తేల్చిచెప్పినట్టు సమాచారం. అసత్యాల ఫోకస్పైనే దృష్టి గత ఏడాది నుంచి ప్రభుత్వంపైనా, అధికారులపైనా విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా పోలింగ్ రోజు సోమవారం జిల్లాలో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పోలింగ్ కేంద్రాలలో వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు చేస్తోందంటూ సోషల్ మీడియా, వారి అనుకూల టీవీ చానల్స్లో కల్పిత వీడియోలు, అసత్యాలు ప్రచారం చేసేందుకు సన్నద్ధమైంది. ఎలాగైనా ఓటర్లును ఇంటి నుంచి బయటకు రానియ్యకుండా చేసేందుకు ప్రయత్నించడంతో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు స్కెచ్ వేసింది. మీడియా పేరుతో పోలింగ్ కేంద్రాలలోకి ప్రవేశించాలనే ఆలోచనతో ఎల్లో మీడియా ఉన్నట్లు సమాచారం. -
టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి (అలిపిరి) : తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. విద్యార్థులు admission.tirumala.org వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
పుష్పాభిషేకం
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఆలయంలోని ఊంజల్ మండపంలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి పుష్పయాగం అత్యంత వైభవంగా సాగింది. తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలిరేకులు వంటి 11 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం మూడు టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు 3 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు. ఈ మహోత్సవాన్ని తిలకించి భక్తులు తన్మయత్వం చెందారు. శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్ర మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడంతో ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో, నిత్య కై ంకర్యాల్లో అర్చక పరిచారుకులు, అధికార, అనధికారులు, భక్తుల కారణం తెలియక జరిగే లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యాగం నిర్వహణతో సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. పుష్పయాగం అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఏఈవో పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్ పాల్గొన్నారు. -
ఘనంగా భాష్యకారుల సాత్తుమొర
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు. -
వెలుగు సిబ్బందితో ఓటర్లకు నగదు పంపిణీ
శ్రీకాళహస్తి : ఓ రాజకీయ పార్టీ వెలుగు సిబ్బందితో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. తొట్టంబేడు మండలం, బోనుపల్లికి చెందిన వేణు తొట్టంబేడు వెలుగు కార్యాలయం(వైఎస్ఆర్ క్రాంతిపథం)లో సంఘ మిత్రగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తన స్వగ్రామమైన బోనుపల్లిలో ఓ రాజకీయ పార్టీ తరఫున ఓటర్లకు నగదు పంచుతూ స్థానికుల కంట పడ్డాడు. సదరు పార్టీకి ఓట్లు వేయకపోతే డ్వాక్రా రుణాలు ఇవ్వమని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్టు తెలిసింది. సంబంధిత సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
కళ్లెదుటే విషాదం
కావలి(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): రైలు ఢీకొని తల్లీకొడుకు మృతిచెందిన ఘటన కావలి రైల్వే స్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం చాగణంకు చెందిన ఐసీడీఎస్ ఉద్యోగిని బట్టా సుభాషిణికి (55)కి కావలిలో ఎన్నికల విధులు కేటాయించారు. దీంతో ఆమె తన కుమారుడు విజయ్ (28)ను తోడు తీసుకుని గూడూరు నుంచి కావలి రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. ఉదయం 7.20 గంటల ప్రాంతంలో స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఎగువమార్గం పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో దురంతో ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. చివరి క్షణంలో రైలు గమనించిన విజయ్ తల్లిని కాపాడేందుకు ముందుకు రావడంతో ఇద్దరూ ప్రమాదం బారిన పడ్డారు. దురంతో ఎక్స్ప్రెస్ రైలు వేగంగా ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఎన్నికల విధులకు హాజరైన పలువురు ఉద్యోగులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు అనాలోచితంగా దూర ప్రాంతానికి చెందిన మహిళకు విధులు కేటాయించారని మండిపడ్డారు. రైల్వే పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. రైలు ఢీకొని తల్లీకొడుకు దుర్మరణం కావలిలో ఘటన -
ఓటేద్దాం రండి
● సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం ● పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సామగ్రి, సిబ్బంది ● రీ పోలింగ్కు చాన్స్ లేకుండా ఏర్పాట్లు ● సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యే నిఘా సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదివారం విధులకు కేటాయించిన ఉద్యోగులకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసింది. ఆ మేరకు ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఆరుగురు చొప్పున జిల్లాలో 2,140 పోలింగ్ కేంద్రాలకు పంపింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సిబ్బంది సందడిజిల్లా సమాచారం... ఓటర్లు 18,12,980 సర్వీస్ ఓటర్లు 862 మంది ఎన్నారై ఓటర్లు 291 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు 24,596 85 ఏళ్లు దాటిన ఓటర్లు 7924 పోలింగ్ స్టేషన్లు 2,140 మోడల్ పోలింగ్ స్టేషన్లు 14 సమస్యలు లేని పోలింగ్ స్టేషన్లు 1,444 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 696 వల్నరబుల్పోలింగ్ స్టేషన్లు 15 హోమ్ ఓటింగ్తోపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 22,416తిరుపతి అర్బన్: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ప్రక్రియ ద్వారా జిల్లాలోని ఎన్నికల కసరత్తును జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. జిల్లాలో సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాలపై ఎన్నికల సంఘం, పోలీస్ అధికారులు డేగకన్ను పెట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పక్క రాష్ట్రాలకు చెందిన పోలీసులు, కేంద్రబలగాలు ఈ ఎన్నికల్లో పహారా కాస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 696 సమస్యాత్మక, 15 అతిసమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, ఆయా కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 2019లో 78.06 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు అధికారిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 18,12,980 మంది ఓటర్లలో సాధ్యమైనంత మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 24,596 మంది దివ్యాంగ ఓటర్లుండగా వారందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ సార్వత్రిక ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఐదు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం ఈ ఎన్నికల్లో 14,342 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు, పోలింగ్ సామగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. వారంతా ఆదివారం రాత్రి పోలింగ్ కేంద్రాలలోనే బస చేస్తారు. ప్రిసైడింగ్ అధికారులు సోమవారం ఉదయం 5.30 గంటలకు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కంట్రోల్ యూనిట్లోని మెమరీని డిలీట్ చేసి, వీవీప్యాట్ కంటైనర్ బాక్స్ నుంచి మాక్ ఓటింగ్ స్లిప్పులను తొలగిస్తారు.ఇరకం దీవికి బోటులో తరలివచ్చిన సిబ్బందితడ: మండలంలోని ఇరకం, వేనాడు ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ఓటు హక్కు అందరి బాధ్యత ఓటు హక్కు ప్రజలందరి బాధ్యతగా భావించాలి. ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలి. ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. గత ఐదు నెలలుగా జిల్లా యంత్రాంగం ఎంతో శ్రమంచి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాం. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. – ప్రవీణ్కుమార్, జిల్లా ఎన్నికల అధికారి, తిరుపతి ఈవీఎంలను తీసుకెళ్తున్న సిబ్బంది -
No Headline
తిరుపతి పార్లమెంట్కు ప్రవీణ్కుమార్, కలెక్టరేట్ వెంకటగిరి అసెంబ్లీ హెచ్ఎం ధ్యానచంద్ర తిరుపతి అసెంబ్లీకి అదిత్ సింగ్ చంద్రగిరి అసెంబ్లీకి ఏ.నిషాంత్రెడ్డి గూడూరు అసెంబ్లీకి కిరణ్కుమార్ సూళ్లూరుపేట అసెంబ్లీకి ఆర్.చంద్రముని శ్రీకాళహస్తి అసెంబ్లీకి ఎన్.రవిశంకర్రెడ్డి సత్యవేడు అసెంబ్లీకి నరసింహులు -
ఆకట్టుకుంటున్న పోలింగ్ కేంద్రాలు
తిరుపతి సిటీ: తిరుపతి నియోజకవర్గ పరిధిలో పలు పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. బాలాజీ కాలనీలోని ఎస్వీ క్యాంపస్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో రంగురంగుల బెలూన్లతో స్వాగతం పలుకుతున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు తాగునీటి సౌకర్యం, అత్యవసర మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. నగరంలో రెండు మోడల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు, యువత, దివ్యాంగుల కోసం పద్మావతి మహిళా వర్సిటీలోని హ్యుమనిటీ బ్లాక్లోనూ, స్థానిక ఎస్డీ లే అవుట్లోని ఎస్పీజీఎన్ఎమ్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ముక్కంటి సేవలో హెకోర్టు న్యాయమూర్తి
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని ఆదివారం మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీ.వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు జడ్జికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా జడ్జి ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. 12వ జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాస్నాయక్, ఆలయ అధికారులు సతీష్మాలిక్, హరియాదవ్, నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాన్ బోల్తా తిరుమల : తిరుమల శ్రీవారి పా దాలకు వెళ్లే ఘా ట్ రోడ్డు మార్గంలో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈఘటనలో నలుగురు భక్తులకు గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన యమునప్ప, పుష్ప దంపతుల ఆధ్వర్యంలో దాదాపు 20 మంది కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమలలోని స్థానిక ఆలయాల సందర్శన కోసం ఓ వ్యాను అద్దెకు తీసుకున్నారు. వీరు శ్రీవారి పాదాలు దర్శించుకుని ఘాట్ రోడ్డులో కిందకు దిగుతున్న సమయంలో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న సుధ(19) తలకు తీవ్రగాయం కాగా మరో ముగ్గురు మహిళలలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ సరైన కండీషన్లో లేదని భక్తులు ఆరోపించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ పోలింగ్పై సీఎం జగన్ ట్వీట్
టీ20 వరల్డ్కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
కేఎల్ రాహుల్ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
- మెడికల్ బోర్డు చీఫ్పై సుప్రీం ఆగ్రహం
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement