హమ్మయ్య.. చావు అంచులదాకా వెళ్లి...

ఇటీవల ఏనుగులు అనేక ప్రాంతాల్లో భీభత్సం సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తన్న విషయం తెలిసిందే. ఏనుగులకు కోపం వస్తే ఎంతటి దారుణానికి అయినా వెనుకాడవు. దానికి మరో ఉదాహారణే ఈ వార్త.  ఓ వ్యక్తి  ఏనుగు వల్ల  చావు చివరి అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. పార్కులో ఉన్న గజరాజుకు ఏం కోపం వచ్చిందో ఏమో ఏకంగా ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేయాలని చూసింది. వివరాలు.. థాయ్‌లాండ్‌లోని ఖోయోయాయి జాతీయ పార్కులో ఉన్న35 ఏళ్ల ఏనుగు పార్కు నుంచి రోడ్డు వైపు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న పర్యాటకుని కారును అడ్డుకుంది. ఇది గమనించిన కారులోని వ్యక్తి కారును ముందుకు తీసుకెళ్తుంటే ఏనుగు కారుపైకి ఎక్కడానికి చూస్తూ.. కారు అద్దాలను, పైకప్పును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన ఆ వ్యక్తి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఏనుగు నుంచి తప్పించుకొని  ప్రాణాలతో బయటపడ్డాడు.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారనే విషయంపై క్లారిటీ రాలేదు. ఈ వీడియోను నిల్‌తారాక్‌ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ సంఘటన అనంతరం సదరు పార్కు పర్యాటకుల కార్లను ఏనుగుల నుంచి 30 మీటర్ల దూరంలో పార్క్‌ చేయమని కోరింది. అయితే తాజాగా ఇదే పార్కులో ఆరు ఏనుగులు జలపాతంపై నుంచి జారిపడి మృత్యువాతపడ్డాయి. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top