ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Roundup 11th Sep 2019 | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Sep 11 2019 9:03 PM | Updated on Mar 21 2024 8:31 PM

బీజేపీ సర్కార్ గోవులకు ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. కొత్త మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం పెంచిన ట్రాఫిక్ జరిమానా ప్రభుత్వానికి ఆదాయ వనరు కాదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ చలో ఆత్మకూరు కార్యక్రమం చేపడుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement
 
Advertisement
Advertisement