ఇంతకీ పవన్‌ ఏం చదివాడబ్బా!?

గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నారు. అయితే గతంలో నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్‌ కాలేజీలో రికమెండేషన్‌తో సీఈసీ తీసుకున్నానని ఓ సభలో.. వేరే గత్యంతర లేక ఎమ్‌ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పారు. ఇంకొక సభలో అయితే స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్‌​కు వెళ్లానని వివరించాడు. అయితే పవన్‌ ఇంతకీ ఏం చదివాడనే దానిపైన సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరుగతోంది. ఇంతకీ పవన్‌ ఏం చదివాడబ్బా అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top