చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : బుగ్గన | Sakshi
Sakshi News home page

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : బుగ్గన

Published Fri, Dec 13 2019 11:02 AM

టీడీపీ సభ్యులు అధికారులు గొంతు పట్టుకుని దౌర్జన్యానికి దిగారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న అధికారులను పిలిచి మాట్లాడినట్టు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలోని రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సభ్యుల రక్షణ కోసమే మార్షల్స్‌ ఉన్నారని గుర్తుచేశారు. అలాంటిది మార్షల్స్‌ను టీడీపీ సభ్యులు దుర్భాషలాడారని సభ దృష్టికి మరోసారి తీసుకువచ్చారు. నిన్నటి ఘటనపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.