అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని లోక్సభ, ప్రాదేశిక ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీ య అనుకూలతలను ఆసరాగా చేసుకుని పార్టీ విస్తరణకు ఇదే అత్యంత అనువైన సమయమని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి జూలై నెలాఖరు వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగించాలని నిర్ణయించారు. 2017లో చేపట్టిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది.
నెల రోజులపాటు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
Jun 25 2019 8:06 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement