విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ఓ ఉద్యోగి మృతి చెందాడు. రైల్వే సైడింగ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సిక్‌లైన్‌లో గూడ్స్‌లో షంటింగ్‌ చేస్తూ ఉండగా మరో గూడ్స్‌ ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది. ఈ సంఘటనతో అక్కడి డ్రైవర్లు పరారయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top