రైతు సౌఖ్యంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామన్నారు. ప్రతి రైతుకు 7 గంటలపాట ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రైతులకు వడ్డీలేని రుణాలు కూడా అందిస్తామన్నారు. వ్యవసాయ శాఖను ఇద్దరు మంత్రులకు కేటాయిస్తామని చెప్పారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేస్తామన్నారు.