తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు | not a single rupee spent on polavaram by chandra babu, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Mar 16 2017 3:27 PM | Updated on Mar 20 2024 3:11 PM

చంద్రబాబు నాయుడు ఇంతకుముందు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, అప్పట్లో ఈయన ఒక్క రూపాయి కూడా పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చుపెట్టలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు ప్రసంగానికి స్పందనగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు స్పీచ్ వింటే, నిజంగా పోలవరం ప్రాజెక్టు ఆయన స్వప్నం అన్నట్లు అనిపిస్తుందన్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు ఖర్చయిన 8800 కోట్లలో 5540 కోట్లు చంద్రబాబు సీఎం కాకముందే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఖర్చయిందని తెలిపారు. ఆరోజు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం 172 కిలోమీటర్ల కుడికాల్వలో 144 కిలోమీటర్లు, ఎడమకాలువ 182 కిలోమీటర్లలో 135 కిలోమీటర్లు పూర్తిచేసిందని, ఆ ఘనత రాజశేఖరరెడ్డిదేనని అన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేసి మూడేళ్లవుతున్నా ఆయన 3300 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement