కొత్తనోట్ల బాగోతంపై సుప్రీంకోర్టు విస్మయం | how some got lakhs of new currency | Sakshi
Sakshi News home page

Dec 16 2016 8:57 AM | Updated on Mar 21 2024 7:54 PM

పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యులకు వెయ్యి, రెండువేలు ఇవ్వడానికి బ్యాంకులు చేతులు ఎత్తేస్తుండగా.. కొందరు అక్రమార్కుల వద్ద కొత్త కరెన్సీ రూపంలో కోటానుకోట్ల నల్లధనం వెలుగుచూస్తోంది. ఇదే విషయమై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రజలు బ్యాంకుల్లో కనీసం రూ. 24వేలు తీసుకోలేకపోతున్నారు, అలాంటి సమయంలో కొందరి వద్దకు లక్షలు లక్షలు కొత్త కరెన్సీ ఎలా వస్తున్నదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement