వేసవి రాకనే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. పార్లమెంట్, శాసనసభ ఎన్నికల ముందే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. వాయిదా పడుతూ వస్తున్న మున్సిపల్ ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నాలుగు వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సాధారణ ఎన్నికల ముందే సవాల్ ఎదురుకానుంది. త్వరలో శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
Feb 3 2014 4:12 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement