
పేదల డాక్టర్ రంగారెడ్డి
ఫ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే ఆయన తపన
ఫ సూర్యాపేటలో ఆస్పత్రి నెలకొల్పిన తొలుత 5 రూపాయలకే వైద్యసేవలు
ఫ ప్రస్తుతం రూ.20లకే ఓపీ
ఫ పూర్వవిద్యార్థుల సేవాసమితి ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలునేడు డాక్టర్స్డే
రైతు కుటుంబం నుంచి వచ్చి..
మా సొంతూరు ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రం. మాది రైతు కుటుంబం. విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. పేదలందరికీ వైద్యం అందుబాటులో తేవాలన్న తపనతో సూర్యాపేట పట్టణంలో ఆస్పత్రి నెలకొల్పాను. మొదట రూ.5కే ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓపీ ఫీజు రూ.7, కొన్ని రోజులకు రూ.10, కొన్నాళ్లకు రూ.15చేశాను. ప్రస్తుతం రూ.20లకు ఓపీ చూస్తున్నాను. నా దగ్గరికి వచ్చే రోగులు అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉండడం చేత మందులు కూడా తక్కువ ధరకు దొరికేవి, నాణ్యతగా ఉండేవి రాస్తాను.
సూర్యాపేట అర్బన్: పేద రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తి కష్టపడి చదవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పేదలకు వైద్యం అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఆస్పత్రి ఏర్పాటు చేసుకొని నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందిస్తూ పేదల వైద్యుడిగా పేరుగాంచారు. పూర్వ విద్యార్థుల సేవా సమితి ఏర్పాటు చేసి వైద్య శిబిరాలతో పాటు అనేక సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూర్యాపేట పట్టణంలోని ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ రంగారెడ్డి. నేడు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యుడి జీవిత విశేషాలు, వైద్య రంగంలో చేస్తున్న సేవలు ఆయన మాటల్లోనే..