వేయి స్తంభాల ఆలయం ఆదాయం రూ.15,39,722 | - | Sakshi
Sakshi News home page

వేయి స్తంభాల ఆలయం ఆదాయం రూ.15,39,722

Jun 25 2025 3:07 PM | Updated on Jun 25 2025 3:07 PM

వేయి స్తంభాల ఆలయం ఆదాయం రూ.15,39,722

వేయి స్తంభాల ఆలయం ఆదాయం రూ.15,39,722

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలోని హుండీల్లోని కానుకలను మంగళవారం ఉదయం లెక్కించారు. హుండీల్లో భక్తులలు సమర్పించిన కానుకల ద్వారా రూ.7,47,722, పూజా రుసుముల ద్వారా రూ.7,92,000 ఆదాయం మొత్తం రూ.15,39,722 ఆదాయం సమకూరినట్లు దేవాలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్‌ వెల్లడించారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించుకున్నందున అధిక ఆదాయం నమోదైందని ఈఓ తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు లెక్కింపు కొనసాగింది. పర్యవేక్షకులుగా దేవాదాయశాఖ పరిశీలకులు ప్రసాద్‌ వ్యవహరించారు. దేవాలయ ప్రధానా ర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సిబ్బంది మధుకర్‌, లింగబత్తుల రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, వెంకటేశ్వర సేవాసమితి మహిళా భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement