
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశానుసారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లాలోని 12 ప్రభుత్వ కళాశాలలో 1 నుంచి 3 సబ్జెక్ట్ల వరకు ఫెయిలైన విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో 488 మంది, ద్వితీయ సంవత్సరంలో 237 మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రత్యేక తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఐఈఓ కోరారు.