ఫ్యాను హోరు | Sakshi
Sakshi News home page

ఫ్యాను హోరు

Published Thu, May 9 2024 5:35 AM

ఫ్యాన

– బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి షాక్‌

తిరుపతి మంగళం : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న వేళ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి మరో షాక్‌ తగిలింది. తిరుపతి పద్మావతిపురంలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎన్‌.రాజారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు శ్రీధర్‌వర్మ సమీప బంధువైన వాసుదేవవర్మతో పాటు గురునాథం, బాబు, భార్గవ్‌, నిఖిల్‌, చందు, సాయి, తేజ, రంగనాయకి, జయంతి, ఏ.జయంతి, శంకరమ్మ, దేశమ్మ, మరో 20 మంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు అనిల్‌రెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

ఏర్పేడు: ఏర్పేడు మండలంలోని కందాడు గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు చక్రపాణి, ఈశ్వర్‌, మణికంఠ, రాజశేఖర్‌ తదితర 10 మంది నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మండలంలోని మేర్లపాక పంచాయతీ మాజీ ఉప సర్పంచ్‌ సీవీ.రమణయాదవ్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. మండల ఇన్‌చార్జ్‌ గున్నేరి కిషోర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రమణయ్య యాదవ్‌, సర్పంచ్‌ గంగాధరం, మాజీ సర్పంచ్‌ వీరరాఘవరెడ్డి, పార్టీ నాయకులు అమరేష్‌, హరినాథరెడ్డి, పరంధామరెడ్డి, మణి, రాంబత్తెయ్య, దాము, అయ్యప్ప, నాగరాజు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సేవా కార్యక్రమాలు నచ్చి పార్టీలోకి వచ్చా

శ్రీకాళహస్తి: నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడినై వైఎస్సార్‌సీపీలో చేరానని కాపు నేత పోలస్వామి షణ్ముగం తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బియ్యపు పవిత్రారెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో స్వర్ణమూర్తి, పగడాల రాజు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కురుగొండ్లకు భారీషాక్‌

సైదాపురం: వెంకటగిరి నియోజకవర్గం, సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామ పంచాయతీలో ఫ్యాన్‌ హోరు ఫుల్‌ జోష్‌లో దూసుకెళ్తోంది. తాజాగా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యఅనుచరుడు, రాపూరు ఏఎంసీ మాజీ చైర్మన్‌ బెల్లంకొండ మస్తాన్‌నాయుడుతో పాటు ఆయన అచరులైన 500 మంది బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. రామసాగరం గ్రామంలో బుధవారం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో దుత్తలూరు గోపాల్‌నాయుడు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సరుపూరు జనార్దన్‌నాయుడు, పచ్చా సిద్ధయ్యనాయుడు, సరుపూరు శ్రీనివాసులునాయుడు, సరుపూరు సుబ్బయ్య ,రాయపనేని రమణయ్య నాయుడు, పచ్చా వెంకటేశ్వర్లు తదిరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ ఎం.రవికుమార్‌, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, సోసైటీ అధ్యక్షుడు శివకుమార్‌, మాజీ సోసైటీ అధ్యక్షుడు కే. మోహన్‌రావు, రామ్‌గోపాల్‌రెడ్డి, రాఘవరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, నేతలు నాగరాజానాయుడు, రాజశేఖర్‌నాయుడు, పార్థు, ఎంపీటీసీ నాగరాజు, రాజమోహన్‌నాయుడు, శ్రీనివాసులునాయుడు, శివశంకర్‌నాయుడు, ప్రకాష్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాను హోరు
1/3

ఫ్యాను హోరు

ఫ్యాను హోరు
2/3

ఫ్యాను హోరు

ఫ్యాను హోరు
3/3

ఫ్యాను హోరు

Advertisement
Advertisement