
పిల్లల్ని పాఠశాలలకు పంపాలి
నెల్లూరు(పొగతోట): బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా స్కూళ్లకు పంపి చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని డీఆర్వో ఉదయ్భాస్కర్ అన్నారు. గురువారం ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. దీనిని డీఆర్వో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల చేత పని చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పిల్లలను తప్పనిసరిగా పంపాలన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ఏడీ గౌస్బాషా, ఐసీడీఎస్ పీడీ అనూరాధ, సీడీపీఓ అరుణ, బాలల సంరక్షణాధికారి సురేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.