
అగచాట్ల ఆహ్వానం
నాణ్యత లేక..
ఇళ్ల నుంచే ఆహారం
విద్యార్థుల కేరింతలు.. చూడముచ్చటైన పాఠశాలలు.. పండగ వాతావరణం.. ఇదంతా గతం. నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో సర్కారీ స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. నాడు – నేడుతో ఆయన చేపట్టిన చర్యలతో సరస్వతీ నిలయాలు కళకళలాడి.. అందులో చేరే విద్యార్థుల సంఖ్యా ఎక్కువగా ఉండేది. అమ్మఒడి పేరిట తల్లుల ఖాతాల్లో నగదును ఠంచనుగా జమచేసేవారు. విద్యాసంవత్సర ప్రారంభ రోజునే స్టూడెంట్స్కు అన్నీ సమకూరేవి. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో అకడమిక్ ఇయర్ ప్రారంభ రోజున విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. అధ్వానంగా మారిన టాయ్లెట్లు.. తరగతి గదులను చూసి బేజారెత్తడం వారి వంతైంది.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తూతూమంత్రంగా అమలు చేశారు. వెజిటబుల్ రైస్, బంగాళదుంపు కూర, ఉడికించిన గుడ్డును అందజేశారు. జిల్లావ్యాప్తంగా 52,899 మందికి గానూ 51,696 మందికి దీన్ని అందజేశామని విద్యాశాఖ అధికారులు లెక్కలు చెప్తున్నారు. అయితే చాలా చోట్ల భోజనం చేయకపోయినా, జరిగిందనే రీతిలో లెక్కలు చూపారని సమాచారం. మరోవైపు నాణ్యత, రుచి లేకపోవడంతో చాలా మంది తమ ఇళ్ల నుంచే క్యారేజీలను తెచ్చుకున్నారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా..
స్టూడెంట్స్ కిట్లు.. అరకొరగా..

అగచాట్ల ఆహ్వానం