నెల్లూరు (లీగల్): నెల్లూరు ఐదో అద నపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ)కోర్టులో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. అయితే పోలీసుల తరఫున స్పెషల్ పీపీ విజయమ్మ తమ వాదనలు వినిపించడనికి వాయిదా కోరారు. ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు ఇన్చార్జి కోర్టు న్యాయమూర్తి సోమశేఖర్ కేసు విచారణ గురువారానికి వాయిదా వేశారు
ఐఅండ్పీఆర్ డీడీ బదిలీ
నెల్లూరు (అర్బన్): జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావును ప్రభుత్వం విశాఖపట్నంకు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఏప్రిల్ 2023లో విజయవాడ నుంచి నెల్లూరుకు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. 2 ఏళ్ల 2 నెలల కాలం ఇక్కడ వివాదారహితుడిగా పనిచేశారు. సదారావు అధికారులు, జర్నలిస్టులతో స్నేహ పూర్వక సంబంధాలతో కలిసిపోయారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
పంచాయతీ పూర్వ కార్యదర్శి సస్పెన్షన్
● డక్కిలి ఈఓపీఆర్డీ ప్రస్తుతం విధులు
పొదలకూరు : పొదలకూరు మేజర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఎస్కే అల్లాభక్షును పంచాయతీరాజ్శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. అల్లాభక్షు 2023 వరకు ఇక్కడ పనిచేసి ఉద్యోన్నతిపై తిరుపతి జిల్లా డక్కిలి ఈఓపీఆర్డీగా బదిలీపై వెళ్లారు. ఇక్కడ పనిచేసిన సమయంలో అక్రమ లే –అవుట్లకు అనుమతులతోపాటు భవనాల నిర్మాణానికి అక్రమంగా పంచాయతీ అనుమతులిచ్చారని ఆరోపణలపై విచారణ నిర్వహించి సస్పెండ్ చేశారు.
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు గురువారం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ మోహన్రావు తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఏడు స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశాలు జరుగుతాయన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని కోరారు.
విద్యుత్ క్రీడాకారుల
ఎంపిక రేపు
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): ఏపీ ట్రాన్స్కో ఇంటర్ సర్కిల్ బాల్బ్యాడ్మింటన్, బ్రిడ్జ్ పోటీలు విశాఖపట్నంలోని గాజువాకలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరీ రామస్వామివేలు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఏపీఎస్పీడీసీఎల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉగ్యోగులు, జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 ఉద్యోగులు అర్హులని తెలిపారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించే సెలక్షన్స్లో పాల్గొనాలని, ఇతర వివరాలకు 90308 02038, 98660 70775 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
11 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
జలదంకి: కూటమి ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను ప్రకటించిన పదిరోజులకే అక్రమంగా రేషన్ బియ్యం దందా బయటపడింది. చామదలకు చెందిన డీలర్లు వెంకటసుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి దుకాణాల నుంచి మంగళవారం అర్ధరాత్రి రేషన్ బస్తాలను ఆటోలో తరలిస్తుండగా జలదంకి పోలీసులు ఆటోను పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఆటోలో 11 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో అక్రమంగా తరలిస్తున్న మరో లారీని అక్రమ దందా నిర్వాహకులు వేరే రూట్లోకి మళ్లించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ లారీలో భారీగా అక్రమ రేషన్ బియ్యం తరలివెళ్లినట్లు సమాచారం.
ఎస్సై లతీఫున్నీసా మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి ఆటోను పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. ఆటోడ్రైవర్ సత్తిబాబుతో పాటు ఇద్దరు డీలర్లపై కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించామన్నారు. రెవెన్యూ అధికారులు బుధవారం చామదలలోని రేషన్ దుకాణాల వద్ద తనిఖీలు చేపట్టి 6ఏ కేసు నమోదు చేశారు. అనంతరం అక్రమ రేషన్ బియ్యాన్ని మద్దూరుపాడులోని స్టాక్ పాయింట్కు తరలించారు.

కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా