
తొలుత మోడల్ ప్రైమరీ స్కూల్స్కు ప్రాధాన్యత
తొలుత మోడల్ ప్రైమరీ స్కూల్స్కు ప్రాధాన్యత ఇవ్వనున్నాం. ఒక్కో స్కూల్లో 5 గదులు, ఐదుగురు టీచర్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఒక వేళ ఆ పాఠశాలలో 5 గదులు లేకుంటే వరండాను పార్టీషన్ చేసి తరగదిగా నిర్వహిస్తాం. లేకుంటే 500 మీటర్ల లోపు ఉన్న పాఠశాల ఉంటే అక్కడ కొన్ని తరగతులును నిర్వహిస్తాం. వీటితో హైస్కూల్స్గా అప్గ్రేడ్ అయిన యూపీ పాఠశాలలను తీసుకోనున్నాం. అసంపూర్తిగా నిలిచిన నాడు–నేడు పనులు, టాయిలెట్స్, అదనపు తరగతి గదులు, ఇతర సౌకర్యాలను గూగుల్ ఫాంలో అప్డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
– వెంకటసుబ్బయ్య, ఏపీసీ, సమగ్రశిక్ష
షెడ్యూల్ ప్రకారం అయితే బదిలీలు పూర్తయ్యేవి
తొలుత ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే పాఠశాలల పునః ప్రాంరభం నాటికి బదిలీల ప్రక్రియను పూర్తి చేసేవారు. ఉపాధ్యాయులు పట్టుబట్టి మాన్యువల్ కౌన్సెలింగ్ కావాలనడంతో ఎస్జీటీల బదిలీలు ఆలస్యమయ్యాయి. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పిస్తాం.
– బాలాజీరావు, డీఈఓ
●

తొలుత మోడల్ ప్రైమరీ స్కూల్స్కు ప్రాధాన్యత