యువకుడి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Jun 12 2025 3:03 AM | Updated on Jun 12 2025 3:03 AM

యువకుడి అనుమానాస్పద మృతి

యువకుడి అనుమానాస్పద మృతి

అల్లూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన అల్లూరు పాత మటన్‌ మార్కెట్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అల్లూరు దళితవాడకు చెందిన గంటా సురేష్‌ (26) సెంట్రింగ్‌ పను లకు వెళ్తుంటాడు. అతను తన అవ్వ వద్ద ఉంటున్నాడు. మంగళవారం రాత్రి పాత మటన్‌ మార్కెట్‌ ప్రాంతంలో తన ఇద్దరి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. బుధవారం ఉదయం చూసే సరికి చనిపోయి రక్తపుమడుగులో పడి ఉండగా స్థానికులు అల్లూరు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘట నా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. మద్యం మత్తులో పడి మృతిచెందాడా? లేదా ఎవరైనా హత్య చేశారా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని ఎస్సై కిశోర్‌బాబు తెలిపారు. సురేష్‌ను హత్య చేసి ఉంటారని అను మానం ఉందని అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్రాధ్యక్షుడు ఎల్లు సాల్మన్‌రాజ్‌ తెలియజేశారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.

గుంతల్ని తప్పించబోయి..

కారు బోల్తా

కలువాయి(సైదాపురం): రోడ్డుపై ఉన్న గుంతల్ని తప్పించబోయి కారు బోల్తా పడిన ఘటన కలువాయి మండలంలోని కోటూరుపల్లి జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెంచలకోనకు చెందిన శేషు కుటుంబ సభ్యులతో కనిగిరి నుంచి కలువాయి వైపు వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఉన్న గుంతల్ని తప్పించబోయి కారు అదుపు తప్పిందని క్షతగాత్రులు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement