
బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తోటపల్లిగూడూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలో చిన్నచెరుకూరు సమీపంలో జరిగింది. ఎస్సై వీరేంద్రబాబు కథ నం మేరకు.. ఇందుకూరుపేట గ్రామానికి చెందిన వెంపులూరు సతీష్ (30) అనే వ్యక్తికి భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు. అతను చిన్నపాటి కాంట్రాక్ట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో పనుల విషయమై మంగళవారం రాత్రి ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామంలో కూలీలతో మాట్లాడాడు. బుధవారం వేకువజామున స్వగ్రామమైన ఇందుకూరుపేటకు మోటార్బైక్పై బయలుదేరాడు. కాకుపల్లి సెంటర్ – చిన్నచెరుకూరు మార్గమధ్యలో కల్వర్టును బైక్ ఢీకొట్టింది. దీంతో పక్కనే ఉన్న పంటకాలువలో సతీష్ పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయం గుర్తించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీయించి శవపరీక్ష నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
వివాహిత బలవన్మరణం
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లిలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. కల్లూరుపల్లిలో ఆర్డీటీ కాలనీకి చెందిన బాషా, మరియమ్మల కుమార్తె రజియ (23)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలానికి భర్త నుంచి విడిపోయి తల్లి వద్ద ఉంటోంది. రజియకు కుమారుడు ఉన్నాడు. కాగా తల్లి తిట్టిందని రజియ మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్కు తరలించారు. అప్పటికే రజియ మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.