పెంచలకోనలో శాస్త్రోక్తంగా జ్యేష్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

పెంచలకోనలో శాస్త్రోక్తంగా జ్యేష్టాభిషేకం

Jun 12 2025 3:03 AM | Updated on Jun 12 2025 3:03 AM

పెంచలకోనలో శాస్త్రోక్తంగా జ్యేష్టాభిషేకం

పెంచలకోనలో శాస్త్రోక్తంగా జ్యేష్టాభిషేకం

రాపూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీరసింహస్వామి దేవస్థానంలో బుధవారం జ్యేష్టాభిషేక వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జ్యేష్ట మాసంలో జ్యేష్ట నక్షత్రం, పౌర్ణమి, ఒకేరోజు వచ్చిన సందర్భంగా వైష్ణవ దేవస్థానాల్లో హోమం, అభిషేకాలు, నిర్వహించడం ఆచారమని ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి వెల్లడించారు. 5 గంటలకు సుప్రభాతం, అభిషేకం, పూలంగిసేవ, నరసింహ హోమం నిర్వహించారు. 10 గంటలకు శ్రీవారి నిత్య కల్యాణ మండపంలో స్నపనపీఠంపై నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీదేవిల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చారు. వాటి ముందు 81 కలశాలను ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ కలశాల్లోని జలాలతో స్వామి, అమ్మవార్లకు వేదపండితులు స్నపన తిరుమంజనం జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై కొలువుదీర్చి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement