
మీడియాపై కక్ష సాధింపుతో ఎమర్జెన్సీ పరిస్థితులు
వైఎస్ జగన్పై, కుటుంబంపై నిత్యం విషం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మీడియాపై కక్ష సాధింపులతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండి పడ్డారు. నగర పార్టీ కార్యాలయంలో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియాపై సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఒక ప్రణాళిక ప్రకారం వివాదాస్పదం చేసి, సంబంధం లేని సీనియర్ పాత్రికేయుడు కొమ్మి నేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం చూస్తుంటే పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారనే విషయం అర్థమవుతోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి మీడియా చానల్ సమకాలీన మేధావులతో లైవ్ డిబేట్ల ద్వారా ప్రజా సమస్యలపై జరిపే చర్చల్లో కొన్ని సందర్భాల్లో విశ్లేషకులు అసందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలను వెంటనే సరిచేసుకోవడం, కొన్ని సందర్భాల్లో వాటికి క్షమాపణలు చెప్పడం కూడా చూస్తున్నామన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ మాట్లాడిన మాటలను కొమ్మినేని వారించారన్నారు. అయితే కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తుండడంతో సాక్షి టీవీ యాజమాన్యం, ఇటు వైఎస్సార్సీపీ కూడా ఖండిస్తూ మహిళలపై తమకు ఉన్న గౌరవాన్ని చాలా స్పష్టంగా వెల్లడించాయన్నారు.
పథకం ప్రకారం రాద్ధాంతం సృష్టి
టీవీ డిబేట్లో కృష్ణంరాజు మాట్లాడిన మాటలను మరుసటి రోజు నుంచి రెచ్చగొట్టే ధోరణితో టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసేందుకు తెగబడిందన్నారు. మంత్రి లోకేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం, టీడీపీ ఆందోళనకు దిగడం జరిగాయన్నారు. దీంతో అదే రోజు తాను చేసిన వ్యాఖ్యలపై కృష్ణంరాజు క్షమాపణలు చెప్పినా టీడీపీకి చెందిన సోషల్ మీడియా ఈ అంశాన్ని సాక్షి టీవీ యాజమాన్యానికి, మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతికి ఆపాదిస్తూ అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నారు. ఆ వెంటనే చంద్రబాబు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించడం, డిప్యూటీ సీఎం పవన్ ప్రెస్నోట్ రిలీజ్ చేయడం చూస్తే పథకం ప్రకారమే జరుగుతున్నట్లు అర్థమవుతుందన్నారు.
సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు
రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతుందని, సాక్షి కార్యాలయాలపైన దాడులు చేస్తున్నారన్నారు. ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంకు ప్రజాస్పందన రావడంతో, ఏడాది పాలనపై సంబరా లు చేసుకుందామన్న కూటమి పార్టీల పిలుపును ప్రజ లు తిరస్కరించారని, దానిని డైవర్ట్ చేసేందుకే సాక్షి మీడియాపై ఈ దాడులు జరుగుతున్నాయన్నారు.
శాంతిభద్రతలు పట్టవా?
అనంతపురం జిల్లాలో గిరిజన బాలిక తన్మయిని దుండగులు బీరు బాటిళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్పై ఆరు రోజుల కిందట ఫిర్యాదు అందినా, పోలీసులు పట్టించుకోలేదన్నారు. చివరికి దారుణమైన స్థితిలో ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు. సత్యసాయి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారని, కేసు పెట్టేందుకు వచ్చిన బాధితులను బెదిరిస్తే వారు ఊరు వదిలి వెళ్లిపోయారన్నారు. శాంతిభద్రతల విషయంలో విఫలమైన ఇటువంటి దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, హోంమంత్రి వంగలపూడి అనితను కీలుబొమ్మ మంత్రిగా మారారన్నారు. నారా లోకేశ్ డిఫాక్టో హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్సీపీ పలువురు మహిళా ప్రజాప్రతినిధుల గురించి గతంలో టీడీపీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మరిచిపోయారా? సీఎంగా ఉన్న వైఎస్ జగన్పై టీడీపీ నాయకులు వాడిన భాష ఎలాంటిది? వంగలపూడి అనిత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఎలాంటి మాటలు మాట్లాడారు, కిరాక్ ఆర్పీ, సీమరాజా, కిరణ్ వంటి వారు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు చేశారో ప్రజలందరికీ తెలుసునని, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారికి టీడీపీ కొమ్ముకాస్తోందన్నారు.
రాష్ట్రంలో శ్రుతిమించిన రెడ్బుక్ రాజ్యాంగం
కొమ్మినేని అరెస్ట్ పత్రికా స్వేచ్ఛపై దాడి
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి
టీడీపీ సోషల్ మీడియాలో వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై నిత్యం విషపూరితమైన ప్రచారం చేశారో అందరికీ తెలుసునని, టీడీపీ అనుకూల పత్రికల్లో దారుణమైన కథనాలను ప్రచురించారన్నారు. అయినా ఏ ఒక్కరిపైనా ఆయన కక్ష సాధింపులకు పాల్పడేందుకు ప్రయత్ని ంచలేదన్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తోందన్నారు. చివరికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని వంటి వారిని అరెస్ట్ చేయడం ద్వారా పత్రికలను, మీడియాను కూడా వదలి పెట్టమనే సంకేతాన్ని ఇచ్చారన్నారు.