వైఎస్‌ జగన్‌తో ప్రసన్న భేటీ | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌తో ప్రసన్న భేటీ

Jun 11 2025 11:44 AM | Updated on Jun 11 2025 11:44 AM

వైఎస్‌ జగన్‌తో ప్రసన్న భేటీ

వైఎస్‌ జగన్‌తో ప్రసన్న భేటీ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కోవూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజయ్‌కుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల ప్రసన్న చేతికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకుని జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ప్రసన్నకుమార్‌రెడ్డిని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసన్నకుమార్‌రెడ్డితో, రజత్‌కుమార్‌రెడ్డితో జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, పలు అంశాలపై చర్చించారు.

వైఎస్‌ జగన్‌ పర్యటనకు హెలిప్యాడ్‌ పరిశీలన

వెంకటాచలం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో మండలంలోని కాకుటూరు సమీపంలో హెలిప్యాడ్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు మంగళవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరుకు రానున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి పి అనిల్‌కుమార్‌యాదవ్‌, పేర్నేటి శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు హెలిప్యాడ్‌ను పరిశీలించారు.

డ్వామా అడిషనల్‌

పీడీగా స్వరూప్‌

నెల్లూరు (పొగతోట): జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అడిషనల్‌ పీడీగా స్వరూప్‌ని నియమిస్తూ పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కోనసీమ జిల్లా డ్వామా కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న స్వరూప్‌ను నెల్లూరు అడిషనల్‌ పీడీగా నియమించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులును కందుకూరు క్లస్టర్‌ ఏపీడీగా నియమించారు.

జెడ్పీలో 65 మంది

ఉద్యోగుల బదిలీలు

నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్‌ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న పరిపాలనాధికారులు, సీనియర్‌, జూనియర్‌ సహాయకులు, టైపిస్టులు, రికార్డు ల్యాబ్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేటర్లను బదిలీ చేశారు. మొత్తం 183 మంది అధికారులు, ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న 45 మందిలో 32 మందిని, ఽరిక్వెస్ట్‌ చేసుకున్న ఉద్యోగుల్లో 33 మందిని మొత్తం 65 మందిని వివిధ ప్రాంతాలకు బదిలీలు చేశారు. ఇందులో ఐదుగురు పరిపాలనాధికారులు, ఒకరు సీనియర్‌ సహాయకులు, 12 మంది జూనియర్‌ సహాయకులు, ఒక టైపిస్టు, 25 మంది రికార్డు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, 21 మంది ఆఫీస్‌ సబార్డినేటర్లు ఉన్నారు. నిబంధనల మేరకే బదిలీలు చేశామని జిల్లా పరిషత్‌ సీఈఓ విద్యారమ, డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు తెలిపారు.

గురుకులాల

కో ఆర్డినేటర్‌గా ప్రభావతమ్మ

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్‌గా డాక్టర్‌ ప్రభావతమ్మను నియమిస్తూ మంగళవారం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంఎం నాయక్‌ ఉత్తర్వులిచ్చారు. విశాఖపట్నంలో పనిచేస్తున్న ప్రభావతమ్మను జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాలో కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న పద్మజను చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారు.

గోవర్ధన్‌రెడ్డికి 23 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

నెల్లూరు (లీగల్‌): సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై గుంటూరు సీఐడీ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీవారెంట్‌పై సీఐడీ పోలీసులు మంగళవారం నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి కాకాణిని గుంటూరు 6వ అదనపు మున్సిఫ్‌ (ప్రత్యేక సీబీసీఐడీ) న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఉత్తర్వులిచ్చారు. గోవర్ధన్‌రెడ్డి తరఫున న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరంగోవర్ధన్‌రెడ్డిని గుంటూరు నుంచి నెల్లూరు కేంద్రకారాగారానికి తరలించారు. గుంటూరు న్యాయస్థానం వద్ద గోవర్ధన్‌రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement