వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. | - | Sakshi
Sakshi News home page

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..

Jun 10 2025 6:55 AM | Updated on Jun 10 2025 6:55 AM

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్‌ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి అన్నారు. సోమవారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓ జర్నలిస్ట్‌ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదించి, పాలనా వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి కూటమి ప్రభుత్వం వేసిన ఎత్తుగడను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మహిళలను గౌరవించడం, మహిళా సాధికారత కోసం అనుక్షణం తపించే నాయకుడు జగన్‌ అని చెప్పారు. ఆయన పాలనలో వారి కోసం ప్రత్యేకంగా పథకాలు అమలు చేశారన్నారు. 32 లక్షల మంది మహిళల పేరుపై ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. రక్షణ కోసం దిశ యాప్‌ను తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. మహిళల రక్షణ కల్పించడంలో విఫలమైన రాష్ట్ర హోంమంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేయడం బాధాకరమన్నారు. తన్మయి హత్య ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది

రాష్ట్ర మహిళా విభాగం జోనల్‌

అధ్యక్షురాలు గౌరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement