
నెల్లూరులో యోగాంధ్ర ర్యాలీ
నెల్లూరు(బారకాసు): నగరంలోని ముత్తుకూరు సెంటర్ నుంచి చిల్డ్రన్్స్ పార్క్ వరకు జిల్లా స్థాయి యోగా ర్యాలీని సోమవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కె.కార్తీక్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా అధికారులు, మెప్మా మహిళలు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలోని చిట్టచివరి గ్రామానికి సైతం చేరేలా అందరూ కృషి చేయాలని సూచించారు. ర్యాలీలో కమిషనర్ నందన్, జెడ్పీ సీఈఓ విద్యారమ, వివిధ శాఖల అధికారులు వెంకటరమణ, విజయన్, గంగాధర్, గంగా భవాని, గురప్ప పాల్గొన్నారు. కాగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డు, గ్రామ సచివాలయ పరిధిల్లో ర్యాలీలను నిర్వహించారు.