
నాణ్యమైన విద్యుత్ను అందించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య ఆదేశించారు. విద్యుత్ భవన్లోని స్కాడా కార్యాలయంలో నెల్లూరు రూరల్ డివిజన్ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. విఽధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వినియోగదారుల నుంచి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. లో ఓల్టేజీ ఉన్న ప్రాంతాలను గుర్తించి అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం బుజబుజనెల్లూరు సబ్స్టేషన్ను సందర్శించి.. సరఫరా, రికార్డులను పరిశీలించారు. ఎస్ఈ విజయన్, రూరల్ ఈఈ సోమశేఖర్రెడ్డి, సూర్యఘర్ నోడల్ అధికారి శేషాద్రిబాలచంద్ర, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.